ETV Bharat / state

అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా

author img

By

Published : Nov 6, 2019, 8:10 AM IST

Updated : Nov 7, 2019, 12:01 AM IST

తహసీల్దార్​ విజయారెడ్డికి హత్యకు దారితీసినవి భూ వివాదమేనని పోలీసులు తెలిపారు. అసలు ఎవరిదా భూమి? ఎక్కడ ఉంది? ఆ భూ వ్యవహారం కోర్టు కేసులో ఎందుకు ఉంది? రైతులకు నోటీసులు ఎందుకు వచ్చాయి? సురేష్​​ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే ఈ కథనం చదవాల్సిందే.

అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా.. తహసీల్దార్​ సజీవ దహనం
అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా

భూ వివాదమే అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. బాచారం గ్రామ పరిధిలోని రాజా ఆనందరావుకు సంబంధించి సుమారు 413 ఎకరాల భూమి వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదంగానే ఉందంటున్నారు. ఈ భూములను గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామస్థులు సాగు చేసుకుంటూ వచ్చారని.. నాటి ప్రభుత్వాల నుంచి వీటికి పాసు పుస్తకాలూ జారీ అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

ఇది 'రియల్'​ స్టోరీ

అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెండు వర్గాలకు చెందిన నాయకుల అనుచరులు ‘రియల్‌’ దందాల్లో ఆరితేరారు. పాత రికార్డుల్లోకి వెళ్లి లొసుగులు వెతికి లిటిగేషన్లు సృష్టిస్తారు. వాటిని చూపి భూయజమానిని బెదిరిస్తారు. ఉన్న భూమి చేజారిపోతుందని భయపెడతారు. ఇలా నయానాభయానా వారి నుంచి ఆ భూములను చౌకగా కొనేస్తారు. తర్వాత వివిధ స్థాయిల్లో తమ పలుకుబడిని ఉపయోగించి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అనంతరం అధిక ధరలకు వాటిని విక్రయిస్తారు. ఇక్కడ వీరిని కాదని ఎవరూ తహసీల్దారు కార్యాలయ మెట్లు ఎక్కే సాహసం చేయరని స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొందరు పెద్దలు తెరవెనుక ఉంటూ కౌలు దారులను తెరమీరదకు తెస్తూ భూ కొనుగోలు దారులను పుట్టిస్తూ.. అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఇప్పటికే 200 ఎకరాల భూమిని బడాబాబులు స్వాహా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

రైతులకు నోటీసులు

తాము సాగు చేసుకుంటున్న భూములు చేజారకుండా గౌరెల్లి రైతులు ఓ ప్రజాప్రతినిధికి రూ.30 లక్షలు సమర్పించారని... అయితే ఇందులో పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉండటం వల్ల ఆ డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం సాగు చేసుకుంటున్న 130 ఎకరాల రైతులకు నోటీసులు అందటం వల్ల అప్పటి నుంచి వారిలో ఆందోళన మొదలైంది. దీంతో నిందితుడు కూర సురేష్ కుటుంబంతో సహా మిగిలిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టులో ఉండగానే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

తహసీల్దార్ హత్యతో భూవివాదం తెరమీదకు రావడంతో దీని వెనుక ఉన్న ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ని తగలబెట్టేశాడు... కారణం ఇదే..!

అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా

భూ వివాదమే అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. బాచారం గ్రామ పరిధిలోని రాజా ఆనందరావుకు సంబంధించి సుమారు 413 ఎకరాల భూమి వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదంగానే ఉందంటున్నారు. ఈ భూములను గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామస్థులు సాగు చేసుకుంటూ వచ్చారని.. నాటి ప్రభుత్వాల నుంచి వీటికి పాసు పుస్తకాలూ జారీ అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

ఇది 'రియల్'​ స్టోరీ

అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెండు వర్గాలకు చెందిన నాయకుల అనుచరులు ‘రియల్‌’ దందాల్లో ఆరితేరారు. పాత రికార్డుల్లోకి వెళ్లి లొసుగులు వెతికి లిటిగేషన్లు సృష్టిస్తారు. వాటిని చూపి భూయజమానిని బెదిరిస్తారు. ఉన్న భూమి చేజారిపోతుందని భయపెడతారు. ఇలా నయానాభయానా వారి నుంచి ఆ భూములను చౌకగా కొనేస్తారు. తర్వాత వివిధ స్థాయిల్లో తమ పలుకుబడిని ఉపయోగించి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అనంతరం అధిక ధరలకు వాటిని విక్రయిస్తారు. ఇక్కడ వీరిని కాదని ఎవరూ తహసీల్దారు కార్యాలయ మెట్లు ఎక్కే సాహసం చేయరని స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొందరు పెద్దలు తెరవెనుక ఉంటూ కౌలు దారులను తెరమీరదకు తెస్తూ భూ కొనుగోలు దారులను పుట్టిస్తూ.. అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఇప్పటికే 200 ఎకరాల భూమిని బడాబాబులు స్వాహా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

రైతులకు నోటీసులు

తాము సాగు చేసుకుంటున్న భూములు చేజారకుండా గౌరెల్లి రైతులు ఓ ప్రజాప్రతినిధికి రూ.30 లక్షలు సమర్పించారని... అయితే ఇందులో పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉండటం వల్ల ఆ డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం సాగు చేసుకుంటున్న 130 ఎకరాల రైతులకు నోటీసులు అందటం వల్ల అప్పటి నుంచి వారిలో ఆందోళన మొదలైంది. దీంతో నిందితుడు కూర సురేష్ కుటుంబంతో సహా మిగిలిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టులో ఉండగానే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

తహసీల్దార్ హత్యతో భూవివాదం తెరమీదకు రావడంతో దీని వెనుక ఉన్న ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ని తగలబెట్టేశాడు... కారణం ఇదే..!

TG_HYD_04_06_LAND_DISPUTE_MRO_DEATH_AV_3182400 note:భూమి విజువల్స్ డెస్క్ వాట్సప్ కి పంపాము, ఫైల్ షాట్స్ వాడుకోగలరు. ( )భూ వివాదమే అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయా రెడ్డి దారుణ హత్యకు దారితీసిందని పోలీసుల భావిస్తున్నారు. బాచారం గ్రామ పరిధిలోని రాజా ఆనందరావు కు సంబంధిచి సుమారు 413ఎకరాల భూమి వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమే. ఈ భూముల్లో గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామస్థులు సాగు చేసుకుంటూ వచ్చారని..నాటి ప్రభుత్వాలనుంచి వీటికి పాసు పుస్తకాలు సైతం జారీ అయ్యాని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొందరు పెద్దలు తెరవెనుక ఉంటూ కౌలు దారులను తెరమీరదకు తెస్తూ భూముల కొనుగోలు దారులను పుట్టిస్తూ..అక్రమాలకు పాల్పడ్డారని...ఇప్పటికే 200 ఎకరాల వరకూ బడాబాబుల స్వాహా చేసినట్లు స్థానికుల ఆరోపిస్తునారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు వెనుకనుంచి నడిపిస్తున్నారని పలువురు చెబుతున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూముల చేజార కుండా గౌరెల్లి రైతులు ఓ ప్రజాప్రతినిధికి 30లక్షలు సమర్పించారని....అయితే ఇందులో పెద్ద పెద్ద నాయకులు తలలు ఉండటంతో ఆ డబ్బును తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రెడు నెలల క్రితం సాగు చేసుకుంటున్న 130 ఎకరాల రైతులకు నోటీసుల అందటంతో అప్పటి నుంచి వారిలో ఆందోళన మొదలైంది. దీంతో నిందితుడు కూర సురేష్ కుటుంబంతో సహా మిగిలిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టులో ఉండగానే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపుతున్నారు. అయితే తహశీల్దార్ హత్యతో భూవివాదం తెరమీదకు రావడంతో దీని వెనుకు ఉన్న ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు.
Last Updated : Nov 7, 2019, 12:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.