ETV Bharat / state

400 దొంగతనాలు: చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ! - 400 theft case were recorded on interstate thief thanedhar singh

అతడు చదువుకుంది మూడో తరగతి.. దొంగతనాల్లో మాత్రం పీహెచ్​డీ చేశాడు. పూణే నుంచి సికింద్రాబాద్​కు వచ్చే రైళ్లలో మిఠాయిలు, తంబాకు విక్రయిస్తూ జీవించిన అతడు చోరీల బాట పట్టాడు. ప్రయాణికుల సొమ్ము అపహరించి విలాసవంతమైన జీవనం గడిపాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ
చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ
author img

By

Published : Dec 24, 2019, 8:49 PM IST

చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ
అతడు చదువుకున్నది మూడో తరగతి. పూణే నుంచి సికింద్రాబాద్​కు వచ్చే రైళ్లలో స్వీట్లు, తంబాకు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఆ క్రమంలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడే వారితో చేతులు కలిపాడు. దొంగతనాల్లో ఆరితేరి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. బ్లేడ్​ను ఉపయోగిస్తూ ఎదురు తిరిగిన వాళ్లపై బెదిరించి మరి వారినుంచి డబ్బులు లాక్కుని వెళ్ళేవాడు. రైళ్లలో పడుకున్న ప్రయాణికులను, రైలు ఎక్కేటప్పుడు హడావిడిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే వాడు.



విలాసవతమైన జీవనం:

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దొంగతనం చేసిన సొమ్ము వేలాది రూపాయలతో విలాసవంతమైన ఇళ్లలో అద్దెకుంటూ, లక్షలు వెచ్చించి తన పిల్లలను స్కూల్లో చేర్పించాడు. చివరికి బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద దొంగతనానికి పాల్పడే క్రమంలో పోలీసులకు చిక్కాడు. రైల్వే పోలీసులు అతన్ని అరెస్టు చేసి 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

అయితే అతను అంతర్రాష్ట్ర దొంగ తానేదార్​ సింగ్​ అని.. ఉత్తరప్రదేశ్​కి చెందినవాడిగా గుర్తించినట్లు సికింద్రాబాద్​ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. 2004 నుంచి నేరచరిత్ర ఉందన్నారు. ఇప్పటివరకు అతడు 400కు పైగా దొంగతనాలు చేశాడని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతో గత కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నట్లు అనురాధ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీ

చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ
అతడు చదువుకున్నది మూడో తరగతి. పూణే నుంచి సికింద్రాబాద్​కు వచ్చే రైళ్లలో స్వీట్లు, తంబాకు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఆ క్రమంలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడే వారితో చేతులు కలిపాడు. దొంగతనాల్లో ఆరితేరి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. బ్లేడ్​ను ఉపయోగిస్తూ ఎదురు తిరిగిన వాళ్లపై బెదిరించి మరి వారినుంచి డబ్బులు లాక్కుని వెళ్ళేవాడు. రైళ్లలో పడుకున్న ప్రయాణికులను, రైలు ఎక్కేటప్పుడు హడావిడిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే వాడు.



విలాసవతమైన జీవనం:

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దొంగతనం చేసిన సొమ్ము వేలాది రూపాయలతో విలాసవంతమైన ఇళ్లలో అద్దెకుంటూ, లక్షలు వెచ్చించి తన పిల్లలను స్కూల్లో చేర్పించాడు. చివరికి బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద దొంగతనానికి పాల్పడే క్రమంలో పోలీసులకు చిక్కాడు. రైల్వే పోలీసులు అతన్ని అరెస్టు చేసి 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

అయితే అతను అంతర్రాష్ట్ర దొంగ తానేదార్​ సింగ్​ అని.. ఉత్తరప్రదేశ్​కి చెందినవాడిగా గుర్తించినట్లు సికింద్రాబాద్​ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. 2004 నుంచి నేరచరిత్ర ఉందన్నారు. ఇప్పటివరకు అతడు 400కు పైగా దొంగతనాలు చేశాడని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతో గత కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నట్లు అనురాధ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీ

Intro:సికింద్రాబాద్ యాంకర్..అతను చదువుకున్నది మూడవ తరగతి..పూణే నుండి సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లలో స్వీట్లు తంబాకు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు..ఆ క్రమంలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడే వారితో చేతులు కలిపాడు..దొంగతనాల్లో ఆరితేరి ప్రయాణికులు జేబులు గుల్ల చేయడంలో సిద్ధహస్తుడయ్యాడు...దొంగతనం చేసే క్రమంలో బ్లేడ్ ను ఉపయోగిస్తూ ఎదురు తిరిగిన వాళ్లపై బెదిరించి మరి వారి నుండి డబ్బులు లాక్కుని వెళ్ళేవాడు ..రైళ్లలో పడుకున్న ప్రయాణికులను రైలు ఎక్కే టప్పుడు హడావిడిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే వాడు..విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు..దొంగతనం చేసిన సొమ్ము వేలాది రూపాయలతో విలాసవంతమైన ఇళ్లలో అద్దెకుంటూ ,లక్షల రూపాయలు వెచ్చించి తన పిల్లలకు స్కూల్లో చేర్పించాడు..చివరికి బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద దొంగతనానికి పాల్పడే క్రమంలో పోలీసులకు చిక్కాడు..రైల్వే పోలీసులు అతన్ని అరెస్టు చేసి అతని నుండి 40 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను డబ్బులు స్వాధీనం చేసుకున్నారు..సికింద్రాబాద్ రైల్వే సూపరిండెంట్ అనురాధ మాట్లాడుతూ తానేదార్ సింగ్ అనే అంతర్రాష్ట్ర దొంగ రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలను పడుకున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఇతను దొంగతనాలకు పాల్పడే వారని తెలిపారు.తానే ధార్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు..ప్రస్తుతం అతను మదీనాగుడా వద్ద ఉన్న myhomes విజువల్స్ అపార్ట్మెంట్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అని తెలిపారు .2004వ సంవత్సరం నుండి ఇతను నేరచరిత్ర ప్రారంభమైందని ఇప్పటి వరకు 400 దొంగతనాలకు పైగా చేశాడని ఆమె వెల్లడించారు..రైళ్లలో జేబుదొంగ లతో కలిసి తను కూడా అదే పని చేసేవాడు అని అన్నారు..త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతో గత కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు..దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు యూపీ కి చెందిన దీపక్ అగర్వాల్ అనే వ్యక్తికి అమ్మేవాడు అని పోలీసులు తెలిపారు..ఇతను దొంగతనం చేసిన సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్ సట్టా మట్కా వంటి వాటిలో కూడా పాల్గొని వాడని పోలీసులు వెల్లడించారు..క్రికెట్ బెట్టింగ్ లో కూడా డబ్బులు పోగొట్టుకుంటూ దొంగతనం చేసిన ఆభరణాలను బెట్టింగ్ లో పెట్టిపోగొట్టుకునే వాడు అని అన్నారు..2006వ సంవత్సరంలో చంద్రకాంత్ అనే వ్యక్తి తో వికారాబాద్ లో పరిచయం ఏర్పడింది..అతని ద్వారా క్రికెట్ బెట్టింగ్ వేయడం మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు..ప్రయాణికులను బ్లడ్ తో బెదిరించి మరి రైళ్లలో వారి నుండి డబ్బులను ఆభరణాలను దొంగిలించిన వారని తెలిపారు.ఇతను ప్రధానంగా సికింద్రాబాద్ కాచిగూడ వికారాబాద్ గుల్బర్గా సోలాపూర్ పూణే హైదరాబాద్ రాయచూర్ కర్నూల్ స్టేషన్లలో ప్రయాణించే రైలులో దొంగతనాలకు ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు..రైళ్లలో జేబు దొంగతనాలు చేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే వారి పై బ్లేడుతో దాడి లో కూడా పాల్పడేవాడు అని వారు తెలిపారు..ఇతని పై గతంలో వికారాబాద్ నాంపల్లి స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు..బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద స్కూటీ తో అనుమానాస్పదంగా తిరుగుతున్న క్రమంలో ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి సిబ్బంది ఇతన్ని చూసి అడగ్గా వారిపై దాడికి పాల్పడే ఈ క్రమంలో అతను అక్కడి నుండి పారిపోయాడు..కొన్ని రోజుల తరువాత తిరిగి తన స్కూటీని తీసుకెళ్తామని వచ్చినప్పుడు పోలీసులు అతన్ని గమనించి పట్టుకున్నట్లు తెలిపారు..
బైట్.. అనురాధ రైల్వే ఎస్పీBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.