ETV Bharat / state

'గొర్రెల పంపిణీ తక్షణమే ఆపండి' - stop the distribution of sheep

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం నిలిచిపోయింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లాలకు మౌఖికంగా ఆదేశాలు వెళ్లాయి. రెండో విడత మొదలైన మూడు మాసాలకే పంపిణీ ఆగిపోయింది. ఇంతకీ ఈ పథకం అర్థంతరంగా ఎందుకు ఆగిపోయింది...?

government says stop the distribution of sheep
'గొర్రెల పంపిణీ తక్షణమే ఆపండి'
author img

By

Published : Dec 18, 2019, 4:10 PM IST

గొల్ల, కురుమలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ చేపట్టింది. ఈ ఏడాది వేసవికాలంలో మేత, తాగునీటి కొరత, అనుకూలించని వాతావరణ పరిస్థితుల దృష్టిలో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. జాప్యం తర్వాత సెప్టెంబరు చివరి వారంలో రెండో విడత ప్రారంభించారు. 5 వేల రూపాయలు కోట్ల ఖర్చు చేసి మిగిలిన లబ్ధిదారులకు జీవాలు అందజేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ పేర్కొన్నారు.

'గొర్రెల పంపిణీ తక్షణమే ఆపండి'

ఆపండి...
తొలి విడతలో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో రెండో విడతలో నిబంధనలు మార్చారు. ప్రతి నెలా ఒక్కో జిల్లాకు 125 యూనిట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు పంపిణీ ప్రక్రియ మొదలై మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పంపిణీ ఆపాలంటూ తాజాగా ఆదేశాలు వచ్చాయి.

కొత్త డీడీలు తీసుకోవద్దు...
రాష్ట్రవ్యాప్తంగా 7.23 లక్షల మంది లబ్ధిదారులుండగా తొలివిడతలో 3లక్షల 85వేల 712 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. అప్పటికే డీడీలు కట్టిన మరో 25వేల 320 మందికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వాలని, కొత్తగా డీడీలు తీసుకోవద్దని ముందుగానే చెప్పారు. ఈ 25 వేల మందిలో సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందినవాళ్లు 100 మంది కూడా ఉండరని... గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం నాయకులు చెబుతున్నారు.


డీడీలు కట్టిన వారికీ ఇవ్వొద్దు...
డీడీలు కట్టిన వాళ్లతో సహా పంపిణీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు మరో 3.63 లక్షల మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా డీడీలు తీసుకోవద్దని, డీడీలు కట్టిన వారికి సైతం గొర్రెలు పంపిణీ చేయవద్దని చెప్పడంతో... జీవులు ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.

గొర్రెల పంపిణీకి నిధులు సమీకరణ, పథకాన్ని మరింత సమర్థంగా అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపొందించడం కోసమే... పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పినట్లు తమ దృష్టికి వచ్చిందని.. గొర్రెలు, మేకల సమాఖ్య అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్

గొల్ల, కురుమలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ చేపట్టింది. ఈ ఏడాది వేసవికాలంలో మేత, తాగునీటి కొరత, అనుకూలించని వాతావరణ పరిస్థితుల దృష్టిలో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. జాప్యం తర్వాత సెప్టెంబరు చివరి వారంలో రెండో విడత ప్రారంభించారు. 5 వేల రూపాయలు కోట్ల ఖర్చు చేసి మిగిలిన లబ్ధిదారులకు జీవాలు అందజేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ పేర్కొన్నారు.

'గొర్రెల పంపిణీ తక్షణమే ఆపండి'

ఆపండి...
తొలి విడతలో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో రెండో విడతలో నిబంధనలు మార్చారు. ప్రతి నెలా ఒక్కో జిల్లాకు 125 యూనిట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు పంపిణీ ప్రక్రియ మొదలై మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పంపిణీ ఆపాలంటూ తాజాగా ఆదేశాలు వచ్చాయి.

కొత్త డీడీలు తీసుకోవద్దు...
రాష్ట్రవ్యాప్తంగా 7.23 లక్షల మంది లబ్ధిదారులుండగా తొలివిడతలో 3లక్షల 85వేల 712 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. అప్పటికే డీడీలు కట్టిన మరో 25వేల 320 మందికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వాలని, కొత్తగా డీడీలు తీసుకోవద్దని ముందుగానే చెప్పారు. ఈ 25 వేల మందిలో సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందినవాళ్లు 100 మంది కూడా ఉండరని... గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం నాయకులు చెబుతున్నారు.


డీడీలు కట్టిన వారికీ ఇవ్వొద్దు...
డీడీలు కట్టిన వాళ్లతో సహా పంపిణీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు మరో 3.63 లక్షల మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా డీడీలు తీసుకోవద్దని, డీడీలు కట్టిన వారికి సైతం గొర్రెలు పంపిణీ చేయవద్దని చెప్పడంతో... జీవులు ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.

గొర్రెల పంపిణీకి నిధులు సమీకరణ, పథకాన్ని మరింత సమర్థంగా అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపొందించడం కోసమే... పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పినట్లు తమ దృష్టికి వచ్చిందని.. గొర్రెలు, మేకల సమాఖ్య అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్

18-12-2019 TG_HYD_04_18_SHEEP_DISTRIBUTION_STOP_PKG_3038200 REPORTER : MALLIK.B Note : file vis and grfx ( ) రాష్ట్రంలో జీవాల పంపిణీ నిలిచిపోయింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లాలకు మౌఖికంగా ఆదేశాలు వెళ్లాయి. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కింద రెండో విడత మొదలైన మూడు మాసాలకే బ్రేకులు పడ్డాయి. ఈ ఏడాది రాబోయే వేసవి కాలంలో ప్రతికూల వాతావరణం, పశుగ్రాసం కొరత ఉత్పన్నమయ్యే ప్రమాదం గ్రహించిన సర్కారు... ఈ నిర్ణయం తీసుకోవడంతో... కొన్ని మాసాలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు నిరుత్సాహానికి గురవుతోన్నారు. LOOK........... VOICE OVER - 1 రాష్ట్రంలో గొల్ల, కురుమలకు ఆర్థిక చేయూతనిచ్చే సదాశయంతో ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. జిల్లాల్లో పంపిణీ ఆపాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఈ ఏడాది వేసవికాలంలో మేత, తాగు నీరు కొరత, అనుకూలించని వాతావరణ పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తరువాత చాలా రోజులు నాన్చి సెప్టెంబరు చివరి వారంలో రెండో విడత ప్రారంభించారు. 5 వేల రూపాయలు కోట్ల ఖర్చు చేసి మిగిలిన లబ్ధిదారులకు జీవాలు అందజేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... తొలి విడతలో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో రెండో విడతలో నిబంధనలు మార్చారు. పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి నెలా ఒక్కో జిల్లాకు 125 యూనిట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు పంపిణీ ప్రక్రియ మొదలై మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పంపిణీ ఆపండంటూ తాజాగా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 7.23 లక్షల మంది లబ్ధిదారులకు తొలివిడతలో 3,85,712 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. అప్పటికే డీడీలు కట్టిన మరో 25,320 మందికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వాలని, కొత్తగా డీడీలు తీసుకోవద్దని ముందుగానే చెప్పారు. ఈ 25 వేల మందిలో సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందినవాళ్లు 100 మంది కూడా ఉండరని గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం నాయకులు చెబుతున్నారు. గతంలో మరణించిన గొర్రెలనే ఎక్కువగా రీప్లేస్ చేశారని తెలిపారు. డీడీలు కట్టిన వాళ్లను కలుపుకొని పంపిణీ కోసం ఎదురుచూస్తోన్న వాళ్లు మరో 3.63 లక్షల మందికి పైగా ఉన్నారు. అయితే... కొత్తగా డీడీలు తీసుకోవద్దని చెప్పడంతోపాటు డీడీలు కట్టిన వారికి సైతం గొర్రెలు పంపిణీ చేయవద్దని చెప్పడంతో... ఇస్తారా లేదా అనేది గొల్ల,కురమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. VOICE OVER - 2 ప్రభుత్వం పంపిణీ చేయొద్దని చెప్పింది... మళ్లీ ఆదేశిస్తే పంపిణీ చేస్తామని జనగామ జిల్లా కలెక్టర్ గొర్రెల కాపరులకు స్పష్టం చేశారు. రెండో విడత ప్రాధాన్యం ప్రకారం పంపిణీ చేస్తుండగానే ఆపేయాలని చెప్పడంతో నిలిపివేశామని జిల్లాల పశుసంవర్ధకశాఖ అధికారులు చెబుతున్నారు. గొర్రెల పంపిణీకి అవసరమైన నిధులు సమీకరణ , పథకాన్ని మరింత సమర్థంగా అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపొందించడం కోసం పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పినట్లు తమ దృష్టికి వచ్చిందని గొర్రెలు, మేకల సమాఖ్య ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఆదేశాలకు సమాఖ్యకు సంబంధం లేదని, ప్రభుత్వం నేరుగా ఆదేశాలు పంపిందని ఆయన పేర్కొన్నారు .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.