ETV Bharat / state

1600 ఆస్పత్రులకు అగ్నిమాపక అనుమతులపై నోటీసులు

author img

By

Published : Oct 21, 2019, 7:41 PM IST

Updated : Oct 21, 2019, 8:23 PM IST

నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో అగ్నిమాపక అనుమతులు తీసుకోవాలని... లేకుంటే కఠిన చర్యలు తప్పవని జీహెచ్​ఎంసీ విపత్తు నిర్వహణ అధికారి విశ్వజిత్​ హెచ్చరించారు. ఎల్బీనగర్​ షైన్​ పిల్లల ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

GHMC ISSUED NOTICES ON SHINE CHILDREN HOSPITAL FIRE ACCIDENT IN HYDERABAD
1600 ఆస్పత్రులకు అగ్నిమాపక అనుమతులపై నోటీసులు

హైదరాబాద్​ ఎల్బీనగర్ షైన్​ ఆసుపత్రి ఘటనపై విచారణ మొదలు పెట్టినట్లు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. అగ్నిప్రమాదంపై 3 నెలల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేసీఆర్​ ఆదేశించారన్నారు. ప్రాథమిక విచారణలో ఆసుపత్రి వాళ్లు ఎలాంటి అగ్నిమాపక అనుమతులు తీసుకోలేదని తేలిందన్నారు. శనివారం నుంచి నగరంలోని 1600 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, పాఠశాలలకు నోటీసులు అందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ... ఈ అంశంపై విచారిస్తామని వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకోని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని విశ్వజిత్​ హెచ్చరించారు.

ఇవీ చూడండి: ప్రగతి భవన్​ బయల్దేరిన రేవంత్​... అరెస్ట్

1600 ఆస్పత్రులకు అగ్నిమాపక అనుమతులపై నోటీసులు

హైదరాబాద్​ ఎల్బీనగర్ షైన్​ ఆసుపత్రి ఘటనపై విచారణ మొదలు పెట్టినట్లు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. అగ్నిప్రమాదంపై 3 నెలల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేసీఆర్​ ఆదేశించారన్నారు. ప్రాథమిక విచారణలో ఆసుపత్రి వాళ్లు ఎలాంటి అగ్నిమాపక అనుమతులు తీసుకోలేదని తేలిందన్నారు. శనివారం నుంచి నగరంలోని 1600 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, పాఠశాలలకు నోటీసులు అందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ... ఈ అంశంపై విచారిస్తామని వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకోని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని విశ్వజిత్​ హెచ్చరించారు.

ఇవీ చూడండి: ప్రగతి భవన్​ బయల్దేరిన రేవంత్​... అరెస్ట్

TG_HYD_57_21_Ghmc_ON_Shine_Hospital_Ab_3182301 Reporter: Kartheek () ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రి ఘటన పై విచారణ మొదలు పెట్టినట్లు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రి మూడు నెలల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసినట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ షైన్ ఆసుపత్రి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ప్రథామిక విచారణలో ఆసుపత్రి వాళ్ళు ఎలాంటి అగ్ని మాపక అనుమతులు తీసుకోలేదని తేలిందన్నారు. శనివారం నుంచి నగరంలోని అన్ని ఆసుపత్రులకు అగ్నిమాపక అనుమతుల విషయం పై నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, స్కూల్స్ కి కూడా నోటీసులు అందించామన్నారు. నగరంలోని 1600 ఆసుపత్రులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం నోటీసులు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అగ్ని మాపక అనుమతుల విషయం పై విచారణ చేస్తామని వెల్లడించారు. బైట్ః విశ్వజిత్, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సంచాలకులు ఎండ్......,
Last Updated : Oct 21, 2019, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.