ETV Bharat / state

'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ

వాహనాల రద్దీ నియంత్రించేందుకు నిర్మించిన పై వంతెనలు మృత్యుఘంటికలుగా మారాయి. గచ్చిబౌలీ బయోడైవర్సిటీ వద్ద నవంబర్​ ఐదున నూతనంగా పైవంతెన నిర్మించారు. ఇది అందుబాటులోకి వచ్చిన 10 రోజుల్లో మూడు ప్రమాదాలు జరగగా.. మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా నిన్న జరిగిన ఘటనలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పైవంతెన పైనుంచి కింద పడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సత్యవేణి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా ముగ్గురికి గాయాలయ్యాయి. దీనితో ట్రాఫిక్​ పోలీసులు పైవంతెనను మూసేశారు.

author img

By

Published : Nov 24, 2019, 5:25 AM IST

Updated : Nov 24, 2019, 10:55 AM IST

'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ
'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ
వాహనాల రద్దీ నియంత్రించేందుకు హైదరాబాద్​ గచ్చిబౌలీ బయోడైవర్సిటీ వద్ద ఇటీవల నూతనంగా నిర్మించిన పైవంతెన వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తున్న కారు పైవంతెన పై నుంచి కిందికి పడిపోయింది. కారు గాల్లో ఎగురుతూ రహదారిపై పడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో పుప్పాలగూడకు చెందిన సత్యవేణి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు పల్టీలు కొట్టి చెట్టును ఢీకొట్టడం వల్ల వేళ్లతో సహా చెట్టు కూలిపోయింది. కారు పైనుంచి కిందపడగానే అక్కడున్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగెత్తారు. పైవంతెన పైన ఉన్న సూచిక బోర్డు కూడా కిందికి ఊడిపడి... యువతి పక్కనే పడింది. ప్రమాదంలో మరణించిన సత్యవేణి కుమార్తె ప్రణీతతో కలిసి ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం ఎదురుచూస్తున్న సమయంలో కారు మృత్యువు రూపంలో వచ్చింది. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ బాలునాయక్, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చిన కూబ్రా అనే యువతి గాయపడ్డారు. వారిని కేర్ ఆస్పత్రికి తరలించారు. బాలునాయక్​కు స్పల్పగాయాలు కావడం వల్ల చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సత్యవేణి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పంపించారు. మృతురాలి కుటుంబానికి ఐదు లక్షల పరిహారం అందిస్తున్నట్లు నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ ప్రకటించారు.

పైవంతెనపై మొత్తం నలుగురు మృతి:

ప్రమాద స్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనా పరిశీలించారు. గచ్చిబౌలీలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బయోడైవర్సిటీ కూడలి వద్ద ఫ్లై ఓవర్​ను నిర్మించారు. రాయదుర్గం వైపు నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు ప్లైఓవర్ మీదుగా వెళ్లే విధంగా నిర్మించారు. నవంబర్ 4న ఫ్లైఓవర్ అందుబాటులో వచ్చింది. నాలుగు రోజుల్లోనే పై వంతెనపై ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. అదే నెల 9న అర్ధరాత్రి పై వంతెనపై సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టగా.. కిందపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. రెండు వారాల వ్యవధిలో కారు ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల పైవంతెన విషయంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సుమారు కిలో మీటరు పొడవున్న ఈ పైవంతెన మధ్యలో ఉన్న మూల మలుపు కాస్త ప్రమాదకరంగా ఉండటం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. పైవంతెన మధ్యలో ఎత్తు 19మీటర్లున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వేగంగా వెళ్లడం వల్ల మూలమలుపును గమనించక రక్షణగోడను ఢీకొట్టాడు.

సూచికలు ఉన్నా..

ఈ నెల 9న జరిగిన ప్రమాదంతో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు 40కి.మీల వేగంతోనే వెళ్లాలనే సూచిక బోర్డులతో పాటు... మలుపు ఉన్న దగ్గర హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. వాహనదారులు ఎవరూ అక్కడ నిలవకుండా... మైకుల్లో హెచ్చరికలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్​కు అనుసంధానం చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అతివేగం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు కూడా ఎక్కువగా ఉందని వాహనదారులు చెబుతున్నారు.

మూసివేత..

ప్రమాదం పట్ల పురపాలక మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పై వంతెనను వెంటనే మూసేసి.. ప్రమాదానికి గల కారణాలను నిపుణులతో అధ్యయనం చేయించాలని జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు సూచించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం పైవంతెనలో మార్పులు తీసుకొచ్చిన తర్వాత... తిరిగి రాకపోకలను అనుమతించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం

'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ
వాహనాల రద్దీ నియంత్రించేందుకు హైదరాబాద్​ గచ్చిబౌలీ బయోడైవర్సిటీ వద్ద ఇటీవల నూతనంగా నిర్మించిన పైవంతెన వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తున్న కారు పైవంతెన పై నుంచి కిందికి పడిపోయింది. కారు గాల్లో ఎగురుతూ రహదారిపై పడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో పుప్పాలగూడకు చెందిన సత్యవేణి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు పల్టీలు కొట్టి చెట్టును ఢీకొట్టడం వల్ల వేళ్లతో సహా చెట్టు కూలిపోయింది. కారు పైనుంచి కిందపడగానే అక్కడున్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగెత్తారు. పైవంతెన పైన ఉన్న సూచిక బోర్డు కూడా కిందికి ఊడిపడి... యువతి పక్కనే పడింది. ప్రమాదంలో మరణించిన సత్యవేణి కుమార్తె ప్రణీతతో కలిసి ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం ఎదురుచూస్తున్న సమయంలో కారు మృత్యువు రూపంలో వచ్చింది. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ బాలునాయక్, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చిన కూబ్రా అనే యువతి గాయపడ్డారు. వారిని కేర్ ఆస్పత్రికి తరలించారు. బాలునాయక్​కు స్పల్పగాయాలు కావడం వల్ల చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సత్యవేణి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పంపించారు. మృతురాలి కుటుంబానికి ఐదు లక్షల పరిహారం అందిస్తున్నట్లు నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ ప్రకటించారు.

పైవంతెనపై మొత్తం నలుగురు మృతి:

ప్రమాద స్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనా పరిశీలించారు. గచ్చిబౌలీలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బయోడైవర్సిటీ కూడలి వద్ద ఫ్లై ఓవర్​ను నిర్మించారు. రాయదుర్గం వైపు నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు ప్లైఓవర్ మీదుగా వెళ్లే విధంగా నిర్మించారు. నవంబర్ 4న ఫ్లైఓవర్ అందుబాటులో వచ్చింది. నాలుగు రోజుల్లోనే పై వంతెనపై ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. అదే నెల 9న అర్ధరాత్రి పై వంతెనపై సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టగా.. కిందపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. రెండు వారాల వ్యవధిలో కారు ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల పైవంతెన విషయంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సుమారు కిలో మీటరు పొడవున్న ఈ పైవంతెన మధ్యలో ఉన్న మూల మలుపు కాస్త ప్రమాదకరంగా ఉండటం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. పైవంతెన మధ్యలో ఎత్తు 19మీటర్లున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వేగంగా వెళ్లడం వల్ల మూలమలుపును గమనించక రక్షణగోడను ఢీకొట్టాడు.

సూచికలు ఉన్నా..

ఈ నెల 9న జరిగిన ప్రమాదంతో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు 40కి.మీల వేగంతోనే వెళ్లాలనే సూచిక బోర్డులతో పాటు... మలుపు ఉన్న దగ్గర హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. వాహనదారులు ఎవరూ అక్కడ నిలవకుండా... మైకుల్లో హెచ్చరికలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్​కు అనుసంధానం చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అతివేగం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు కూడా ఎక్కువగా ఉందని వాహనదారులు చెబుతున్నారు.

మూసివేత..

ప్రమాదం పట్ల పురపాలక మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పై వంతెనను వెంటనే మూసేసి.. ప్రమాదానికి గల కారణాలను నిపుణులతో అధ్యయనం చేయించాలని జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు సూచించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం పైవంతెనలో మార్పులు తీసుకొచ్చిన తర్వాత... తిరిగి రాకపోకలను అనుమతించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం

sample description
Last Updated : Nov 24, 2019, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.