రాష్ట్రంలో జరగనున్న పురపోరుకు ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 53,36,605 మంది కాగా... ఇందులో పురుషులు 26,71,694 మంది, మహిళలు 26,64,557 మంది, ఇతరులు 354 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6.40 లక్షల మంది ఓటర్లు ఉండగా... అత్యల్పంగా కుమురం భీం జిల్లాలో 44,946 మంది ఓటర్లు ఉన్నారు.
ముసాయిదా జాబితాలో కంటే 655 మంది ఓటర్లు మాత్రమే తగ్గడం గమనార్హం. తుది జాబితా ప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన జిల్లాల వారి ఓటర్ల జాబితా సంక్షిప్తంగా...

ఇవీ చూడండి: పుర ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం నేడే..