ETV Bharat / state

జనవరి 15 నుంచి ఫాస్టాగ్​ లేకుంటే తిప్పలే..

ఫాస్టాగ్  కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడంలేదని అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ 29 వరకు కేవలం 85,897 వాహనదారులు మాత్రమే ఫాస్టాగ్​లను కొనుగోలు చేశారు. రోజుకు సగటున 1,300 మంది మాత్రమే కొత్తగా కొనుగోళ్లు చేస్తున్నారు. మరోవైపు జనవరి 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు ఒకే ఒక్క లైన్ మాత్రమే కేటాయిస్తామని ఎన్​హెచ్​ఏఐ స్పష్టం చేసింది. ఇది ఇలాగే కొనసాగితే... సంక్రాంతికి  సొంతూళ్లకు వెళ్లే వాహనదారులు  టోల్ ప్లాజాల  వద్ద  తిప్పలు  పడాల్సిందే..! క్యూలో బారులు తీరాల్సిందే..!

author img

By

Published : Jan 1, 2020, 9:02 AM IST

'ఫాస్టాగ్ లేకుంటే ఫాస్ట్​గా వెళ్లలేరు'
'ఫాస్టాగ్ లేకుంటే ఫాస్ట్​గా వెళ్లలేరు'

రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ అమలు అనుకున్నట్లుగా సాగడం లేదు. రాష్ట్రంలో 17 టోల్ ప్లాజాలలో డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్​ అమలు చేయాలని ఎన్​హెచ్ఏఐ భావించినా.. ఇంకా వాహనదారుల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల గడువును జనవరి 15 వరకు పెంచారు. రాష్ట్రంలో చిల్లకల్లు, గూడూరు, ఇందల్వాయి, పంతంగి, కోరల్ పాడ్, రాయికల్, రోల్ మమ్దా, శాఖాపూర్, పిప్పల్వాడ, దిలావర్ పూర్, గంజల్, చింతపల్లి, పుల్లూరు, కోనేటిపురం, మనోహరాబాద్, భిక్నూర్, కడ్తాల్, ముతోజీపేట్ టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ 17 టోల్ ప్లాజాలను డిసెంబర్ 29 వరకు పరిశీలిస్తే.. 60.14 శాతం ఈ-చెల్లింపులు, 39.87 శాతం నగదు చెల్లింపులు జరిగాయి.

ప్రక్రియ చెల్లింపులు (రూ.లలో) శాతం
ఫాస్టాగ్​ 1,85,76,000 58.91
ఈ చెల్లింపులు 3,87,195 1.23
నగదు 12,571,340 39.87


టోల్‌ ప్లాజాల మీదుగా వెళ్తున్న వాహనాల్లో 48శాతం ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వెళితే.. 52శాతం నగదు లేన్ల నుంచి వెళ్తున్నాయి. ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా టోల్‌ వసూలు ఎక్కువగా, వాహనాల రాక తక్కువగా ఉంది. క్యాష్‌ లేన్ల నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 29 వరకు 85,897 వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్​లు కొనుగోలు చేశారు. 26న 1,499 ఫాస్టాగ్​లు, 27న 1,530, 28న 1,743 ఫాస్టాగ్ లు, 29న 1,392 ఫాస్టాగ్​ల అమ్మకాలు జరిగాయి. రోజుకు కొత్తగా సరాసరి సుమారు 1,300ల ఫాస్టాగ్ అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాస్టాగ్ వల్ల టోల్ చెల్లించే సమయంలో క్యూలో ఉండాల్సిన సమస్య ఉండదని తెలిసినా.. వాహనదారుల్లో ఆశించిన ఫలితం కనిపించడంలేదు. వాణిజ్య వాహనాలు ఉన్నవారు ఎక్కువగా, సొంత వాహనాలు ఉన్నవారు తక్కువగా ట్యాగ్​లు కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద 25 శాతం దారులను హైబ్రీడ్‌ వేలుగా మార్చారు. వీటిల్లో ట్యాగ్‌ ఉన్నవాటిని లేని వాటిని అనుమతిస్తున్నారు. జనవరి 15 నుంచి కేవలం ఒకవైపు గేట్లను మాత్రమే నగదు చెల్లించేందుకు పరిమితం చేయనున్నారు. ఫాస్టాగ్‌ లేని వాహనాలన్నీ ఈ ఒక్క గేటు నుంచే ముందుకు కదలాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్‌ వసూలు చేస్తారు. అదే సమయంలో సంక్రాంతి రద్దీ ఉండనుండటం వల్ల టోల్‌గేట్ల వద్ద అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

పండుగ సందర్భంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాంలు అయ్యే అవకాశాలుంటాయి. వీటిని నిరోధించేందుకే కేంద్రం ఫాస్టాగ్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. వాహనదారుల నుంచి సరైన స్పందనలేక కొనుగోళ్లు అనుకున్నస్థాయిలో జరగడంలేదు. ఇప్పటికైనా వాహనదారుల్లో ఎన్​హెచ్​ఏఐ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

'ఫాస్టాగ్ లేకుంటే ఫాస్ట్​గా వెళ్లలేరు'

ఇవీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్​గా సోమేశ్‌ కుమార్‌

రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ అమలు అనుకున్నట్లుగా సాగడం లేదు. రాష్ట్రంలో 17 టోల్ ప్లాజాలలో డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్​ అమలు చేయాలని ఎన్​హెచ్ఏఐ భావించినా.. ఇంకా వాహనదారుల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల గడువును జనవరి 15 వరకు పెంచారు. రాష్ట్రంలో చిల్లకల్లు, గూడూరు, ఇందల్వాయి, పంతంగి, కోరల్ పాడ్, రాయికల్, రోల్ మమ్దా, శాఖాపూర్, పిప్పల్వాడ, దిలావర్ పూర్, గంజల్, చింతపల్లి, పుల్లూరు, కోనేటిపురం, మనోహరాబాద్, భిక్నూర్, కడ్తాల్, ముతోజీపేట్ టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ 17 టోల్ ప్లాజాలను డిసెంబర్ 29 వరకు పరిశీలిస్తే.. 60.14 శాతం ఈ-చెల్లింపులు, 39.87 శాతం నగదు చెల్లింపులు జరిగాయి.

ప్రక్రియ చెల్లింపులు (రూ.లలో) శాతం
ఫాస్టాగ్​ 1,85,76,000 58.91
ఈ చెల్లింపులు 3,87,195 1.23
నగదు 12,571,340 39.87


టోల్‌ ప్లాజాల మీదుగా వెళ్తున్న వాహనాల్లో 48శాతం ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వెళితే.. 52శాతం నగదు లేన్ల నుంచి వెళ్తున్నాయి. ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా టోల్‌ వసూలు ఎక్కువగా, వాహనాల రాక తక్కువగా ఉంది. క్యాష్‌ లేన్ల నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 29 వరకు 85,897 వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్​లు కొనుగోలు చేశారు. 26న 1,499 ఫాస్టాగ్​లు, 27న 1,530, 28న 1,743 ఫాస్టాగ్ లు, 29న 1,392 ఫాస్టాగ్​ల అమ్మకాలు జరిగాయి. రోజుకు కొత్తగా సరాసరి సుమారు 1,300ల ఫాస్టాగ్ అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాస్టాగ్ వల్ల టోల్ చెల్లించే సమయంలో క్యూలో ఉండాల్సిన సమస్య ఉండదని తెలిసినా.. వాహనదారుల్లో ఆశించిన ఫలితం కనిపించడంలేదు. వాణిజ్య వాహనాలు ఉన్నవారు ఎక్కువగా, సొంత వాహనాలు ఉన్నవారు తక్కువగా ట్యాగ్​లు కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద 25 శాతం దారులను హైబ్రీడ్‌ వేలుగా మార్చారు. వీటిల్లో ట్యాగ్‌ ఉన్నవాటిని లేని వాటిని అనుమతిస్తున్నారు. జనవరి 15 నుంచి కేవలం ఒకవైపు గేట్లను మాత్రమే నగదు చెల్లించేందుకు పరిమితం చేయనున్నారు. ఫాస్టాగ్‌ లేని వాహనాలన్నీ ఈ ఒక్క గేటు నుంచే ముందుకు కదలాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్‌ వసూలు చేస్తారు. అదే సమయంలో సంక్రాంతి రద్దీ ఉండనుండటం వల్ల టోల్‌గేట్ల వద్ద అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

పండుగ సందర్భంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాంలు అయ్యే అవకాశాలుంటాయి. వీటిని నిరోధించేందుకే కేంద్రం ఫాస్టాగ్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. వాహనదారుల నుంచి సరైన స్పందనలేక కొనుగోళ్లు అనుకున్నస్థాయిలో జరగడంలేదు. ఇప్పటికైనా వాహనదారుల్లో ఎన్​హెచ్​ఏఐ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

'ఫాస్టాగ్ లేకుంటే ఫాస్ట్​గా వెళ్లలేరు'

ఇవీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్​గా సోమేశ్‌ కుమార్‌

TG_HYD_41_31_FASTAAG_NO_RESPONCE_PKG_3182388 reporter : sripathi.srinivas Note : టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జాంలు, వాహనాలు బారులు తీరిన విజువల్స్, ఫాస్టాగ్ ల ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఫాస్టాగ్ కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడంలేదు. ఈ విషయాలను ఫాస్టాగ్ అమ్మకాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ 29వ తేదీ వరకు కేవలం 85,897 వాహనదారులు మాత్రమే ఫాస్టాగ్ లను కొనుగోలు చేశారు. రోజుకు సగటున 1,300ల ఫాస్టాగ్ కొనుగోళ్లు మాత్రమే జరుగుతున్నాయి. మరోవైపు జనవరి 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు ఒకే ఒక్క లైన్ మాత్రమే కేటాయిస్తామని ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు స్పష్టం చేశారు.ఇది ఇలాగే కొనసాగితే...సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద తిప్పలు పడాల్సిందే..! క్యూలో బారులు తీరాల్సిందే..! Look.. వాయిస్ : రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ లను అమలుచేయాలని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 17 టోల్ ప్లాజాలలో డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ ను అమలు చేయాలని ఎన్.హెచ్.ఏ.ఐ భావించినప్పటికీ..ఇంకా వాహనదారుల్లో సరైన అవగాహన లేకపోవడంతో జనవరి 15వ తేదీ వరకు ఫాస్టాగ్ గడువును పెంచారు. చిల్లకల్లు, గూడూరు, ఇందల్వాయి, పంతంగి, కోరల్ పాడ్, రాయికల్, రోల్ మమ్దా, శాఖాపూర్, పిప్పల్వాడ, దిలావర్ పూర్, గంజల్, చింతపల్లి, పుల్లూరు, కోనేటిపురం, మనోహరాబాద్, భిక్నూర్, కడ్తాల్, ముతోజీపేట్ టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ 17 టోల్ ప్లాజాలలలో డిసెంబర్ 29వ తేదీ వరకు జరిగిన చెల్లింపులను పరిశీలిస్తే...60.14 ఈచెల్లింపులు, 39.87 నగదు చెల్లింపులు ఉన్నాయి. వీటిలో ఫాస్టాగ్ ల ద్వారా రూ.1,85,76,000లు చెల్లించారు. వీటితో 58.91శాతం చెల్లింపులు జరిగాయని అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ-చెల్లింపుల ద్వారా రూ.3,87,195లు చెల్లించారు. వీటితో 1.23శాతం మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇక నగదు చెల్లింపులు రూ.12,571,340లు జరిగాయి. మొత్తం చెల్లింపుల్లో నగదు ద్వారా 39.87శాతం చెల్లింపులు జరిగాయి. అన్ని రకాల చెల్లింపులు రూ.3,15,34,535 జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వాయిస్ : టోల్‌ ప్లాజాల మీదుగా వెళ్తున్న వాహనాల్లో 48శాతం ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వాహనాలు వెళితే.. 52శాతం వాహనాలు నగదు లేన్ల నుంచి వెళ్తున్నాయి. ఫాస్టాగ్‌ లేన్ల ద్వారా టోల్‌ వసూలు ఎక్కువగా, వాహనాల రాక తక్కువగా ఉంది. క్యాష్‌ లేన్ల నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు 85,897 వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ లు కొనుగోలు చేశారు. 26వ తేదీన 1,499 ఫాస్టాగ్ లు, 27న 1,530 ఫాస్టాగ్ లు, 28న 1,743 ఫాస్టాగ్ లు, 29న 1,392 ఫాస్టాగ్ ల అమ్మకాలు జరిగాయి. రోజుకు సరాసరిగా సుమారు 1,300ల ఫాస్టాగ్ అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాస్టాగ్ వల్ల టోల్ చెల్లించే సమయంలో క్యూలో ఉండాల్సిన సమస్య ఉండదని తెలిసినప్పటికీ..వాహనదారుల్లో ఆశించిన ఫలితం కన్పించడంలేదు. వాణిజ్య వాహనాలు ఉన్నవారు ఎక్కువగా, సొంత వాహనాలు ఉన్నవారు తక్కువగా ట్యాగ్ లు కొనుగోలు చేస్తున్నారు. వాయిస్ : ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద 25 శాతం దారులను హైబ్రీడ్‌ వేలుగా మార్చారు. వీటిల్లో ట్యాగ్‌ ఉన్నవాటిని లేని వాటిని అనుమతిస్తున్నారు. జనవరి 14 వరకు ఈ వెసులుబాటుంది. ఆ తర్వాత జనవరి 15 నుంచి కేవలం ఒకవైపు గేట్లను మాత్రమే నగదు చెల్లించేందుకు పరిమితం చేయనున్నారు. ఫాస్టాగ్‌ లేని వాహనాలన్నీ ఈ ఒక్క గేటు నుంచే ముందుకు కదలాల్సి ఉం టుంది. ఫాస్టాగ్‌ లేన్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్‌ వసూలు చేస్తారు. అదే సమయంలో సంక్రాంతి రద్దీ ఉండనుండటంతో టోల్‌గేట్ల వద్ద అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సంక్రాంతి పండగ సందర్బంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాంలు అయ్యే అవకాశాలుంటాయి. వీటిని నిరోధించేందుకే కేంద్రం ఫాస్టాగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐతే..వాహనదారుల నుంచి సరైన స్పందనలేక..కొనుగోళ్లు అనుకున్నస్థాయిలో జరగడంలేదు. ఇప్పటికైనా వాహనదారుల్లో ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. END....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.