వికారాబాద్ అనంతగిరి వద్ద జరిగిన ఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. డ్రగ్స్ మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఎస్సై కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందిస్తున్నానని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
ఇవీ చూడండి: డ్రగ్స్ మత్తులో కారుతో యువకుల హల్చల్... ఎస్సైకి తీవ్ర గాయాలు