హైదరాబాద్లో ఖైరతాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెక్లెస్ రోడ్ వైపు నుంచి ఖారతాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఖైరతాబాద్ సర్కిల్లోఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికంగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘనటా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. కారుని అక్కడి నుంచి తరలించారు. ప్రమాద సమయంలో కారులో యువతి, యువకుడు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి