ETV Bharat / state

పోషకాహార పైలట్​ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్​, గద్వాల జిల్లాలు - హైదరాబాద్​లో బాలామృతం ప్లస్​ విడుదల

గ్రామీణ ప్రాంతాలతో పాటు.. నగర వాసులు కూడా పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. అందరికీ పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలామృతం ప్లస్​ విడుదల కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు.

balamrutam plus launch in hyderabad
పోషకాహార పైలట్​ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్​, గద్వాల జిల్లాలు
author img

By

Published : Dec 16, 2019, 5:07 PM IST

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ పౌష్టికాహారం లోపం గురించి మాట్లాడుకోవడం బాధిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపంతో దేశ వ్యాప్తంగా చాలా మంది బాధ పడుతున్నారని... దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ, యునిసెఫ్ సహాకారంతో... మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలామృతం ప్లస్ కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స వ్యయంతో కూడుకున్నది... అందువల్ల ముందే జాగ్రత్తపడాలని మంత్రి సూచించారు.

పోషకాహారాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల్ జిల్లాల్లో అమలు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. తల్లులు ఆరోగ్యంగా లేకపోవడం వల్లనే పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. బాలామృతం ప్లస్ సమర్థవంతంగా లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించారు.

పోషకాహార పైలట్​ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్​, గద్వాల జిల్లాలు

ఇదీ చూడండి: జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ పౌష్టికాహారం లోపం గురించి మాట్లాడుకోవడం బాధిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపంతో దేశ వ్యాప్తంగా చాలా మంది బాధ పడుతున్నారని... దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ, యునిసెఫ్ సహాకారంతో... మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలామృతం ప్లస్ కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స వ్యయంతో కూడుకున్నది... అందువల్ల ముందే జాగ్రత్తపడాలని మంత్రి సూచించారు.

పోషకాహారాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల్ జిల్లాల్లో అమలు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. తల్లులు ఆరోగ్యంగా లేకపోవడం వల్లనే పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. బాలామృతం ప్లస్ సమర్థవంతంగా లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించారు.

పోషకాహార పైలట్​ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్​, గద్వాల జిల్లాలు

ఇదీ చూడండి: జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి

TG_HYD_24_16_Balamrutham_Plus_Launch_Avb_3182301 Reporter: Kartheek () గ్రామీణ ప్రాంతాలే కాదు.. నగరాల్లో కూడా పౌష్టికాహార లోపంతో ప్రజలు బాధపడుతున్నారని వారికి పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికీ మనం పౌష్టికాహారం గురించి మాట్లాడుకోవడం బాధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపంతో దేశంలో అనేక మంది బాధ పడుతున్నారని... దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు తీవ్ర పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ, యునిసెఫ్ సహాకారంతో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలామృతం ప్లస్ కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్ లు ప్రారంభించారు. వ్యాధి వచ్చాకా దానిని తగ్గించడం వ్యయంతో కుడుకున్నదని.. వ్యాధి రాకముందే చర్యలు తీసుకోవాలని ఈటల చెప్పారు. పోషకాహారాన్ని పైలట్ ప్రాజెక్టు పద్దతిలో మొదటగా ఆసిఫాబాద్, గద్వాల్ జిల్లాలో అమలు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గర్బిణులు ఉండాల్సిన స్థాయిలో బరువు, ఎత్తు లేరు అని సర్వేలు చెబుతున్నాయని... తల్లులు ఆరోగ్యంగా లేకపోవడంతో పిల్లలు కూడా అలాగే ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలామృతం ప్లస్ సమర్థవంతంగా లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించారు. బైట్ః ఈటల రాజేందర్, వైద్య శాఖ మంత్రి బైట్ః సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బైట్ః డాక్టర్ హేమలత, డైరెక్టర్, ఎన్ ఐఎన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.