ETV Bharat / state

దేవుడా అమ్మను చంపి నాన్న ఉరేసుకున్నాడు.. మా గతేంటి?

16 ఏళ్లుగా సాగుతున్న వారి ప్రయాణంలో అనుమానమే పెనుభూతమైంది. వారిద్దరు వారికిద్దరు. ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్న వారి సంసారం చిన్నాభిన్నమైంది. అనుమానం పెంచుకుని కోపంతో భార్య తలపగలగొట్టిన ఆ భర్త... ఉరేసుకుని చనిపోయాడు. క్షణికావేశంతో... చిన్నారుల జీవితాలను అంధకారం చేశారు.

author img

By

Published : Nov 5, 2019, 3:36 PM IST

Updated : Nov 5, 2019, 6:39 PM IST

A MAN MURDERED HIS WIFE AND HE DIED WITH SUICIDE

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని మంచికంటినగర్​లో దారుణం చోటుచేసుకుంది. భార్తపై అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను చంపేసి తానూ చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా చిలకోడు గ్రామానికి చెందిన అశోక్​తో రాజేశ్వరికి 16 ఏళ్ల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కొరకు పాల్వంచ మంచికంటినగర్​కు వచ్చి జీవనం సాగిస్తున్నారు. స్థానిక నవభారత్ పాఠశాలలో రాజేశ్వరి ఆయాగా పనిచేస్తోంది. కొన్ని రోజులు స్థానిక నవభారత్ కర్మాగారంలో పనిచేసిన ఆశోక్​... అనంతరం తాపీమేస్త్రీగా పని చేశాడు. వీరికి ఇద్దరు సంతానం.

అనుమానమే పెనుభూతమై...

భార్య రాజేశ్వరి ప్రవర్తనపై అశోక్​కు అనుమానం కలిగింది. ప్రతినిత్యం ఇద్దరికీ గొడవలు జరుగుతుండేవి. వారం రోజులుగా ఘర్షణలు ఎక్కువయ్యాయి. స్థానిక పెద్ద మనుషులు, కుటుంబ సభ్యులు దంపతులకు సర్దిచెప్పారు. అయినా... అశోక్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. అనుమానం పెంచుకున్న అశోక్​.. సోమవారం రాత్రిపూట ఇనుపరాడ్​తో రాజేశ్వరి తలపై బలంగా కొట్టి చంపాడు. తాను కూడా ఉరేకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న రాజేశ్వరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయంతో రక్తం ఎక్కువగా పోవటం వల్ల రాజేశ్వరి మరిణించినట్లు వైద్యులు నిర్ధరించారు. అమ్మానాన్నల మృతిని తట్టుకోలేని ఆ చిన్నారులు రోదన... అందరినీ కలచివేసింది.

దేవుడా అమ్మను చంపి నాన్న ఉరేసుకున్నాడు.. మా గతేంటి?

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని మంచికంటినగర్​లో దారుణం చోటుచేసుకుంది. భార్తపై అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను చంపేసి తానూ చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా చిలకోడు గ్రామానికి చెందిన అశోక్​తో రాజేశ్వరికి 16 ఏళ్ల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కొరకు పాల్వంచ మంచికంటినగర్​కు వచ్చి జీవనం సాగిస్తున్నారు. స్థానిక నవభారత్ పాఠశాలలో రాజేశ్వరి ఆయాగా పనిచేస్తోంది. కొన్ని రోజులు స్థానిక నవభారత్ కర్మాగారంలో పనిచేసిన ఆశోక్​... అనంతరం తాపీమేస్త్రీగా పని చేశాడు. వీరికి ఇద్దరు సంతానం.

అనుమానమే పెనుభూతమై...

భార్య రాజేశ్వరి ప్రవర్తనపై అశోక్​కు అనుమానం కలిగింది. ప్రతినిత్యం ఇద్దరికీ గొడవలు జరుగుతుండేవి. వారం రోజులుగా ఘర్షణలు ఎక్కువయ్యాయి. స్థానిక పెద్ద మనుషులు, కుటుంబ సభ్యులు దంపతులకు సర్దిచెప్పారు. అయినా... అశోక్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. అనుమానం పెంచుకున్న అశోక్​.. సోమవారం రాత్రిపూట ఇనుపరాడ్​తో రాజేశ్వరి తలపై బలంగా కొట్టి చంపాడు. తాను కూడా ఉరేకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న రాజేశ్వరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయంతో రక్తం ఎక్కువగా పోవటం వల్ల రాజేశ్వరి మరిణించినట్లు వైద్యులు నిర్ధరించారు. అమ్మానాన్నల మృతిని తట్టుకోలేని ఆ చిన్నారులు రోదన... అందరినీ కలచివేసింది.

దేవుడా అమ్మను చంపి నాన్న ఉరేసుకున్నాడు.. మా గతేంటి?

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

sample description
Last Updated : Nov 5, 2019, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.