ETV Bharat / state

'దుర్గమ్మా... ముఖ్యమంత్రి మనసు మార్చమ్మా' - ఆదిలాబాద్​లో దుర్గామాతకు పూజ చేసిన ఆర్టీసీ కార్మికులు

ప్రభుత్వ మొండి వైఖరిలో మార్పువచ్చేలా చేయాలని ప్రార్థిస్తూ ఆర్టీసీ కార్మికులు దుర్గామాతకు పూజలు చేశారు. ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'దుర్గమ్మా... ముఖ్యమంత్రి మనసు మార్చమ్మా'
author img

By

Published : Nov 15, 2019, 8:37 PM IST

ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి మనసు మారేలా చూడాలని ప్రార్థిస్తూ ఆదిలాబాద్​ పట్టణంలోని దుర్గానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో మహిళా కార్మికులు పూజలు చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జడ్పీ ఛైర్​పర్సన్‌ సుహాసినిరెడ్డి పాల్గొని దీపారాధన చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికుల్లో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నారని సుహాసినిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ నిర్ణయంలో మార్పురావాలని కోరుతూ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.

'దుర్గమ్మా... ముఖ్యమంత్రి మనసు మార్చమ్మా'

ఇదీ చూడండి: మా తల్లికి... కన్నబిడ్డలే అమ్మగా మారారు..

ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి మనసు మారేలా చూడాలని ప్రార్థిస్తూ ఆదిలాబాద్​ పట్టణంలోని దుర్గానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో మహిళా కార్మికులు పూజలు చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జడ్పీ ఛైర్​పర్సన్‌ సుహాసినిరెడ్డి పాల్గొని దీపారాధన చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికుల్లో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నారని సుహాసినిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ నిర్ణయంలో మార్పురావాలని కోరుతూ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.

'దుర్గమ్మా... ముఖ్యమంత్రి మనసు మార్చమ్మా'

ఇదీ చూడండి: మా తల్లికి... కన్నబిడ్డలే అమ్మగా మారారు..

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.