ETV Bharat / sports

73 మ్యాచ్​ల తర్వాత టీమిండియా జెర్సీలో 'శాంసన్'

author img

By

Published : Jan 10, 2020, 7:19 PM IST

Updated : Jan 10, 2020, 7:25 PM IST

మంచి ఫామ్​, ప్రతిభ గల టీమిండియా యువ క్రికెటర్​ సంజు శాంసన్​ ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు శ్రీలంకతో జరుగుతోన్న మూడో టీ20లో అవకాశం దక్కించుకున్నాడు. ఇందులో రాణిస్తే పంత్​కు మరింత కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Team India Keeper-Batsmen Sanju Samson got t20 match Oppurtunity After 73 matches in 2015-20
73 మ్యాచ్​ల తర్వాత భారత జెర్సీలో 'సంజు'

ఫామ్‌కు ఢోకాలేదు, రికార్డులకు కొదవలేదు, ప్రతిభకు తిరుగులేని యువ వికెట్​ కీపర్​ సంజు శాంసన్​.. తుది జట్టులో చోటు సంపాదించడానికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. అతడి కల నెరవేరుస్తూ పుణె వేదికగా లంకతో జరగుతున్న మూడో టీ20లో అవకాశమిచ్చింది టీమిండియా యాజమాన్యం. ఈ మ్యాచ్​లో నిరూపించుకుంటే తన కెరీర్​కు చాలా ఉపయోగపడనుంది. దాదాపు 73 టీ20ల తర్వాత సంజుకు మళ్లీ అవకాశం లభించింది.

అద్భుతమైన ఆటతీరు...

బ్యాట్‌తో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడగలిగే ఈ కేరళ కుర్రాడు గ్లోవ్స్‌తో అద్భుతాలు సృష్టించగలడు. 2015లో నీలిరంగు జెర్సీ ధరించిన అతడు.. తొలిసారి భారత్‌ తుది జట్టులో బరిలోకి దిగుతున్నాడు. జట్టులో ఎంపికైనా తుదిజట్టులో స్థానం కోసం ఇన్నాళ్లు వేచిచూశాడు. గతేడాది జరిగిన బంగ్లా, వెస్టిండీస్​ టీ20 సిరీస్‌లో ఇతడికి చోటు రాలేదు.

>> 2015లో జింబాబ్వేపై ఆఖరి టీ20 మ్యాచ్​ ఆడిన శాంసన్​ 73 మ్యాచ్​ల తర్వాత మళ్లీ నేడు బరిలోకి దిగాడు. భారత జట్టులో అత్యధిక టీ20​ల్లో చోటు లభించని ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానంలో ఉమేశ్​ యాదవ్​(65), దినేశ్​ కార్తీక్​(56), మహ్మద్​ షమి(43), రవీంద్ర జడేజా(33) ఉన్నారు.

>> ఒక జట్టుకు ఎక్కువ టీ20ల్లో చోటు లభించని ఆటగాడిగా ఎమ్​ ఉదావతే(73)తో సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాడు శాంసన్. ఇతడి కంటే ముందు జే డెన్లీ(79), ప్లంకెట్​(74) ఉన్నారు.

పంత్​కు పోటీయా..?

సంజు విశ్వనాథ్‌ శాంసన్‌.. చాలా రోజులుగా ఈ క్రికెటర్​ పేరు వార్తల్లో మార్మోగుతోంది. విజయ్‌ హజారె ట్రోఫీలో సంచలన ద్విశతకం, భారత్-ఏ తరఫున అద్భుత విజయాలు, పంత్‌కు అసలైన పోటీదారుడు.. అంటూ అతడిపై వార్తలు వెల్లువెత్తాయి. ఇతడి ఆటతీరుపై గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ వంటి దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.

రంజీల్లో రికార్డు..

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడుదొడుకులు ఎదుర్కొన్న సంజు.. అండర్‌-13 కేరళ జట్టు సారథిగా పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే శతకంతో అదరగొట్టాడు. ఆ తర్వాత అండర్‌-16, అండర్‌-19 కేరళ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తన బ్యాటింగ్‌ టెక్నిక్‌తో అందర్నీ ఆకర్షించిన అతడు 2012లో భారత్ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. యువ భారత్ ఆసియాకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2011లో రంజీ ట్రోఫీ ఆడిన అతడు 2015-16 సీజన్‌లో కేరళ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో కెప్టెన్‌ అయిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

సంజు తొలి టీ20 మ్యాచ్​ ఆడినప్పుడు కేఎల్​ రాహుల్, శ్రేయస్​ అయ్యర్​, వాషింగ్టన్​ సుందర్​, శార్దుల్​ ఠాకుర్​, బుమ్రా, చాహల్​,సైని టీ20 జట్టులోకి అరంగేట్రం చేయకపోవడం విశేషం.

Team India Keeper-Batsmen Sanju Samson got t20 match Oppurtunity After 73 matches in 2015-20
రిషబ్​ పంత్​

ఐపీఎల్‌లో మెరుపులు

ఐపీఎల్‌ 2012 వేలంలో శాంసన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. కానీ, అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. తర్వాతి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఆడిన రెండో మ్యాచ్‌లోనే అర్ధశతకం బాది 'మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌' అందుకున్నాడు. ఐపీఎల్‌లో అర్ధశతకం సాధించిన పిన్నవయస్కుడిగా రికార్డుకెక్కాడు. ఈ సీజన్‌లో 206 పరుగులు బాది ఫర్వాలేదనిపించాడు.

>> 2013 ఐపీఎల్‌ 'బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌'గా ఎంపికయ్యాడు.

>> 2016లో అతడిని దిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది.

>> 2017లో పుణెపై శతకం బాది 386 పరుగులు సాధించాడు.

2018 ఐపీఎల్‌ వేలంలో శాంసన్‌ను రాజస్థాన్‌ తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్‌లో 441 పరుగులతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 12వ సీజన్‌లోనూ శతకంతో చెలరేగి 342 పరుగులు బాదాడు.

ఎన్నోసార్లు నిరాశ...

2014 ఇంగ్లాండ్‌ పర్యటనకు సంజు శాంసన్ ఎంపికయ్యాడు. 5 వన్డేలు, టీ20 కోసం ధోనీకి బ్యాకప్ కీపర్‌గా అవకాశం దక్కింది. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి తుదిజట్టులో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో కూడా సెలక్టర్లు అతడిని ఎంపికచేశారు. కానీ, అదే పునరావృతం అయ్యింది.

>> 2015 జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు నీలిరంగు జెర్సీ ధరించలేదు. భారత్‌ తరఫున ఆడాలని ఎంతో కృషి చేస్తూ దేశవాళీ, భారత్-ఎ తరఫున రాణించాడు.

>> 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్‌-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, యోయో ఫిటెనెస్‌ టెస్టులో విఫలమవడం వల్ల అవకాశం కోల్పోయాడు. అయినా కుంగిపోకుండా తిరిగి పుంజుకొని అద్భుత ప్రదర్శనతో రాణించాడు.

>> గతేడాది దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన సిరీస్‌లో 'మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌'ను అందుకున్నాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో గోవాపై ఏకంగా ద్విశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు చేసిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు.

>> 53 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో అతడు 2,945 పరుగులతో పాటు 71 క్యాచ్‌లు, 7 స్టంప్స్‌ చేశాడు. 88 లిస్ట్‌-ఎ మ్యాచుల్లో 2,281 పరుగులు, 12 స్టంప్స్‌, 92 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఫామ్‌కు ఢోకాలేదు, రికార్డులకు కొదవలేదు, ప్రతిభకు తిరుగులేని యువ వికెట్​ కీపర్​ సంజు శాంసన్​.. తుది జట్టులో చోటు సంపాదించడానికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. అతడి కల నెరవేరుస్తూ పుణె వేదికగా లంకతో జరగుతున్న మూడో టీ20లో అవకాశమిచ్చింది టీమిండియా యాజమాన్యం. ఈ మ్యాచ్​లో నిరూపించుకుంటే తన కెరీర్​కు చాలా ఉపయోగపడనుంది. దాదాపు 73 టీ20ల తర్వాత సంజుకు మళ్లీ అవకాశం లభించింది.

అద్భుతమైన ఆటతీరు...

బ్యాట్‌తో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడగలిగే ఈ కేరళ కుర్రాడు గ్లోవ్స్‌తో అద్భుతాలు సృష్టించగలడు. 2015లో నీలిరంగు జెర్సీ ధరించిన అతడు.. తొలిసారి భారత్‌ తుది జట్టులో బరిలోకి దిగుతున్నాడు. జట్టులో ఎంపికైనా తుదిజట్టులో స్థానం కోసం ఇన్నాళ్లు వేచిచూశాడు. గతేడాది జరిగిన బంగ్లా, వెస్టిండీస్​ టీ20 సిరీస్‌లో ఇతడికి చోటు రాలేదు.

>> 2015లో జింబాబ్వేపై ఆఖరి టీ20 మ్యాచ్​ ఆడిన శాంసన్​ 73 మ్యాచ్​ల తర్వాత మళ్లీ నేడు బరిలోకి దిగాడు. భారత జట్టులో అత్యధిక టీ20​ల్లో చోటు లభించని ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానంలో ఉమేశ్​ యాదవ్​(65), దినేశ్​ కార్తీక్​(56), మహ్మద్​ షమి(43), రవీంద్ర జడేజా(33) ఉన్నారు.

>> ఒక జట్టుకు ఎక్కువ టీ20ల్లో చోటు లభించని ఆటగాడిగా ఎమ్​ ఉదావతే(73)తో సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాడు శాంసన్. ఇతడి కంటే ముందు జే డెన్లీ(79), ప్లంకెట్​(74) ఉన్నారు.

పంత్​కు పోటీయా..?

సంజు విశ్వనాథ్‌ శాంసన్‌.. చాలా రోజులుగా ఈ క్రికెటర్​ పేరు వార్తల్లో మార్మోగుతోంది. విజయ్‌ హజారె ట్రోఫీలో సంచలన ద్విశతకం, భారత్-ఏ తరఫున అద్భుత విజయాలు, పంత్‌కు అసలైన పోటీదారుడు.. అంటూ అతడిపై వార్తలు వెల్లువెత్తాయి. ఇతడి ఆటతీరుపై గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ వంటి దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.

రంజీల్లో రికార్డు..

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడుదొడుకులు ఎదుర్కొన్న సంజు.. అండర్‌-13 కేరళ జట్టు సారథిగా పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే శతకంతో అదరగొట్టాడు. ఆ తర్వాత అండర్‌-16, అండర్‌-19 కేరళ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తన బ్యాటింగ్‌ టెక్నిక్‌తో అందర్నీ ఆకర్షించిన అతడు 2012లో భారత్ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. యువ భారత్ ఆసియాకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2011లో రంజీ ట్రోఫీ ఆడిన అతడు 2015-16 సీజన్‌లో కేరళ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో కెప్టెన్‌ అయిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

సంజు తొలి టీ20 మ్యాచ్​ ఆడినప్పుడు కేఎల్​ రాహుల్, శ్రేయస్​ అయ్యర్​, వాషింగ్టన్​ సుందర్​, శార్దుల్​ ఠాకుర్​, బుమ్రా, చాహల్​,సైని టీ20 జట్టులోకి అరంగేట్రం చేయకపోవడం విశేషం.

Team India Keeper-Batsmen Sanju Samson got t20 match Oppurtunity After 73 matches in 2015-20
రిషబ్​ పంత్​

ఐపీఎల్‌లో మెరుపులు

ఐపీఎల్‌ 2012 వేలంలో శాంసన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. కానీ, అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. తర్వాతి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఆడిన రెండో మ్యాచ్‌లోనే అర్ధశతకం బాది 'మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌' అందుకున్నాడు. ఐపీఎల్‌లో అర్ధశతకం సాధించిన పిన్నవయస్కుడిగా రికార్డుకెక్కాడు. ఈ సీజన్‌లో 206 పరుగులు బాది ఫర్వాలేదనిపించాడు.

>> 2013 ఐపీఎల్‌ 'బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌'గా ఎంపికయ్యాడు.

>> 2016లో అతడిని దిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది.

>> 2017లో పుణెపై శతకం బాది 386 పరుగులు సాధించాడు.

2018 ఐపీఎల్‌ వేలంలో శాంసన్‌ను రాజస్థాన్‌ తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్‌లో 441 పరుగులతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 12వ సీజన్‌లోనూ శతకంతో చెలరేగి 342 పరుగులు బాదాడు.

ఎన్నోసార్లు నిరాశ...

2014 ఇంగ్లాండ్‌ పర్యటనకు సంజు శాంసన్ ఎంపికయ్యాడు. 5 వన్డేలు, టీ20 కోసం ధోనీకి బ్యాకప్ కీపర్‌గా అవకాశం దక్కింది. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి తుదిజట్టులో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో కూడా సెలక్టర్లు అతడిని ఎంపికచేశారు. కానీ, అదే పునరావృతం అయ్యింది.

>> 2015 జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు నీలిరంగు జెర్సీ ధరించలేదు. భారత్‌ తరఫున ఆడాలని ఎంతో కృషి చేస్తూ దేశవాళీ, భారత్-ఎ తరఫున రాణించాడు.

>> 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్‌-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, యోయో ఫిటెనెస్‌ టెస్టులో విఫలమవడం వల్ల అవకాశం కోల్పోయాడు. అయినా కుంగిపోకుండా తిరిగి పుంజుకొని అద్భుత ప్రదర్శనతో రాణించాడు.

>> గతేడాది దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన సిరీస్‌లో 'మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌'ను అందుకున్నాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో గోవాపై ఏకంగా ద్విశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు చేసిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు.

>> 53 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో అతడు 2,945 పరుగులతో పాటు 71 క్యాచ్‌లు, 7 స్టంప్స్‌ చేశాడు. 88 లిస్ట్‌-ఎ మ్యాచుల్లో 2,281 పరుగులు, 12 స్టంప్స్‌, 92 క్యాచ్‌లు అందుకున్నాడు.

Intro:Body:Conclusion:
Last Updated : Jan 10, 2020, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.