పాకిస్థాన్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో 150 మ్యాచ్లాడిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో పాల్గొని, ఈ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది పాక్.
పాకిస్థాన్.. 2006 ఆగస్టులో ఇంగ్లాండ్తో తొలి టీ20 ఆడింది. ప్రస్తుత మ్యాచ్తో కలిపి మొత్తంగా 150 మ్యాచ్ల్లో పాల్గొంది. ఇందులో 90 సార్లు గెలిచి, 55 సార్లు ఓడింది. మూడు టై, ఒకదానిలో ఫలితం తేలలేదు.
ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది భారత్. ప్రస్తుతం ఐదో ర్యాంక్లో ఉన్న మన జట్టు.. ఇప్పటివరకు 130 మ్యాచ్లు ఆడింది. ఇందులో 82 గెలవగా, 44 ఓడింది. మిగిలిన నాలుగు టైగా ముగిశాయి. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉంది కోహ్లీసేన.