ప్రముఖ నటి రమ్యకృష్ణ.. తొలిసారిగా భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తోంది. మరాఠీ హిట్ చిత్రం 'నటసామ్రాట్'కు రీమేక్గా రూపొందిస్తున్న ఈ సినిమాకు 'రంగమార్తాండ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలో ప్రకాశ్రాజ్ కనిపించనున్నాడు. వీటితో పాటే చాలాకాలం తర్వాత కృష్ణవంశీ తీస్తున్న సినిమా ఇది కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
2017లో 'నక్షత్రం' తీశాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా తదితరులు నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు పట్టాలెక్కించలేదీ డైరెక్టర్. ఇప్పుడు ఈ చిత్రం ప్రకటించాడు.
ఇది చదవండి: మెగాహీరో పండుగ మొదలయ్యేది ఆ రోజే..!