ప్రముఖ హీరోలు రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ల మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తీస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అదేంటంటే?
ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే పోరాట సన్నివేశాల కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తోందట చిత్రబృందం. దాదాపు రూ.150 కోట్లతో తీస్తున్నారని సమాచారం. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఈ సీన్స్ రూపొందించనున్నారట.
'ఆర్ఆర్ఆర్'ను రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాలకు కాస్త కల్పితం జోడించి తెరకెక్కిస్తున్నారు. డీవివి దానయ్య నిర్మాత. ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. వైరల్: తమిళ హీరోతో రామ్చరణ్ డ్యాన్స్