ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: టోకెన్​ ఉన్నవారికే మాస్క్​ల విక్రయం!

author img

By

Published : Jan 30, 2020, 4:06 PM IST

Updated : Feb 28, 2020, 1:15 PM IST

కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో పలు దేశాల్లో మాస్క్​లకు డిమాండ్​ పెరుగుతోంది. హాంకాంగ్​లో ప్రజలు గంటల తరబడి క్యూ​లో నిలబడి, టోకెన్లు తీసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో మాస్కుల ధరలు పెంచేశారు వ్యాపారులు.

people-around-the-world-are-buying-up-protective-face-masks-in-hopes-of-keeping-a-new-virus-from-china-at-bay
కరోనా ఎఫెక్ట్​: టోకెన్​ ఉన్నవారికే మాస్క్​ల విక్రయం!

కరోనా వైరస్​.. చైనాతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలనూ వణకిస్తోంది. ఇప్పటి వరకు చైనాలో 170 మంది మృతి చెందారు. పలు దేశాలు కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్​లు ధరించడమే మేలైన మార్గమని వైద్యులు చెప్పిన నేపథ్యంలో పలు దేశాల్లో వాటికి డిమాండ్ పెరుగుతోంది.

హాంకాంగ్​...

హాంకాంగ్​లో మాస్క్​లకు డిమాండ్​ విపరీతంగా ఉంది. వాటిని కొనేందుకు అక్కడి ప్రజలు గంటల తరబడి లైన్​లో నిల్చుంటున్నారు. దుకాణదారులు ఎంత సరుకు తెచ్చినా క్షణాల్లో అయిపోతోంది. భారీ డిమాండ్ దృష్ట్యా టోకెన్ పద్ధతి అవలంబిస్తున్నారు వ్యాపారులు. షాపు తెరవకముందే ప్రజలకు చిట్టీలు రాసి ఇస్తున్నారు. అవి ఉన్న వారికి మాత్రమే మాస్క్​లు విక్రయిస్తున్నారు.

మాస్క్​ల ధరలూ భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల మాస్క్​ల పెట్టె ఒక్కొక్కటి 7 డాలర్లకు విక్రయిస్తుండగా... మరికొన్ని చోట్ల ఏకంగా 65 డాలర్లు పలుకుతోంది.

కరోనా ఎఫెక్ట్​: టోకెన్​ ఉన్నవారికే మాస్క్​ల విక్రయం!

తైవాన్​లోనూ...

తైవాన్​ దేశంలో మాస్క్​ ధరించే ప్రజలు బయటకు వస్తున్నారు. ఇది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వైరస్​ బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరని అంటున్నారు.

భారత్​లోనూ డిమాండ్​...

మాస్క్​ల కోసం భారత్​లోని తయారీదారులకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. డిమాండ్ దృష్ట్యా అదనపు గంటలు పనిచేస్తున్నట్లు తెలిపారు మధురైలోని మెడివేర్ సంస్థ ఎండీ. మాస్క్​ల ఉత్పత్తిని రెట్టింపు చేసినట్లు చెప్పారు.

ఎలా వ్యాప్తి చెందుతోంది?

సాధారణంగా వైరస్​లు గాలి ద్వారా వ్యాప్తి చెందవని నిపుణలు చెబుతున్నారు. వైరస్​ సోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాత్రమే ఓ వ్యక్తి నుంచి మరొక వ్యక్తి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

మాస్క్​లు ఎలా ఉపయోగపడతాయి?

వైరస్​ సోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ మాస్క్​లు ఉపయోగపడతాయని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. పూర్తిగా వీటి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పలేకపోయినా, కొంత వరకు నివారించవచ్చన్నది వారి మాట.

ఇదీ చూడండి: భారత్​కు 'కరోనా'- కేరళలో తొలి పాజిటివ్ కేసు

కరోనా వైరస్​.. చైనాతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలనూ వణకిస్తోంది. ఇప్పటి వరకు చైనాలో 170 మంది మృతి చెందారు. పలు దేశాలు కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్​లు ధరించడమే మేలైన మార్గమని వైద్యులు చెప్పిన నేపథ్యంలో పలు దేశాల్లో వాటికి డిమాండ్ పెరుగుతోంది.

హాంకాంగ్​...

హాంకాంగ్​లో మాస్క్​లకు డిమాండ్​ విపరీతంగా ఉంది. వాటిని కొనేందుకు అక్కడి ప్రజలు గంటల తరబడి లైన్​లో నిల్చుంటున్నారు. దుకాణదారులు ఎంత సరుకు తెచ్చినా క్షణాల్లో అయిపోతోంది. భారీ డిమాండ్ దృష్ట్యా టోకెన్ పద్ధతి అవలంబిస్తున్నారు వ్యాపారులు. షాపు తెరవకముందే ప్రజలకు చిట్టీలు రాసి ఇస్తున్నారు. అవి ఉన్న వారికి మాత్రమే మాస్క్​లు విక్రయిస్తున్నారు.

మాస్క్​ల ధరలూ భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల మాస్క్​ల పెట్టె ఒక్కొక్కటి 7 డాలర్లకు విక్రయిస్తుండగా... మరికొన్ని చోట్ల ఏకంగా 65 డాలర్లు పలుకుతోంది.

కరోనా ఎఫెక్ట్​: టోకెన్​ ఉన్నవారికే మాస్క్​ల విక్రయం!

తైవాన్​లోనూ...

తైవాన్​ దేశంలో మాస్క్​ ధరించే ప్రజలు బయటకు వస్తున్నారు. ఇది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వైరస్​ బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరని అంటున్నారు.

భారత్​లోనూ డిమాండ్​...

మాస్క్​ల కోసం భారత్​లోని తయారీదారులకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. డిమాండ్ దృష్ట్యా అదనపు గంటలు పనిచేస్తున్నట్లు తెలిపారు మధురైలోని మెడివేర్ సంస్థ ఎండీ. మాస్క్​ల ఉత్పత్తిని రెట్టింపు చేసినట్లు చెప్పారు.

ఎలా వ్యాప్తి చెందుతోంది?

సాధారణంగా వైరస్​లు గాలి ద్వారా వ్యాప్తి చెందవని నిపుణలు చెబుతున్నారు. వైరస్​ సోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాత్రమే ఓ వ్యక్తి నుంచి మరొక వ్యక్తి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

మాస్క్​లు ఎలా ఉపయోగపడతాయి?

వైరస్​ సోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ మాస్క్​లు ఉపయోగపడతాయని ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. పూర్తిగా వీటి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పలేకపోయినా, కొంత వరకు నివారించవచ్చన్నది వారి మాట.

ఇదీ చూడండి: భారత్​కు 'కరోనా'- కేరళలో తొలి పాజిటివ్ కేసు

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL17
DL-LD POLLS-TMC-AAP
TMC endorses AAP in Delhi polls
         New Delhi, Jan 30 (PTI) The Mamata Banerjee-led Trinamool Congress has thrown its weight behind the Aam Admi Party for the Delhi polls, with its national spokesperson Derek O' Brien on Thursday uploading a video endorsing not just Chief Minister Arvind Kejriwal but all AAP candidates.
         Banerjee and Kejriwal have shared a cordial relationship over the years, with the Delhi CM coming out in support of his West Bengal counterpart during the general elections in 2019 and also during her face-off with the Centre over Kolkata police chief Rajeev Kumar.
         Banerjee too on her part condemned attacks on Kejriwal during the general elections and lashed out at the BJP over the issue.
         "Vote for @AamAadmiParty, Vote for the candidate from Rajendra Nagar constituency @raghav_chadha, Vote for @ArvindKejriwal and all AAP candidates in Delhi," O' Brien tweeted.
         In the video, O' Brien is in Rajendra Nagar constituency in Central Delhi where he endorses the Kejriwal government saying it has delivered what it promised in terms of health, education, water, electricity and pollution.
         "What they promised, they have delivered. The candidate here is Raghav Chadha, he is a boy from here, very enthusiastic. One of the youngest bright minds I have seen in Delhi. Vote for AAP, vote for Raghav Chadha. May the Aam Admi Party do very very well," said O' Brien. PTI ASG ASG
RDM
RDM
01301158
NNNN
Last Updated : Feb 28, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.