ETV Bharat / international

జపాన్​ ప్రధానికి 'పౌర సెగ'- భారత పర్యటన రద్దు!

author img

By

Published : Dec 13, 2019, 11:29 AM IST

Updated : Dec 13, 2019, 2:02 PM IST

పౌరసత్వ చట్ట సవరణపై అసోం గువాహటిలో నిరసనల నేపథ్యంలో భారత్​-జపాన్​ మధ్య జరగాల్సిన వార్షిక సదస్సు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రతా కారణాలతో జపాన్​ ప్రధానమంత్రి షింజో అబే మూడు రోజుల భారత పర్యటనను రద్దు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Japan Prime Minister
జపాన్ ప్రధానమంత్రి షింజో అబే
జపాన్​ ప్రధానికి 'పౌర సెగ'- భారత పర్యటన రద్దు!

మూడు రోజుల భారత పర్యటనను జపాన్​ ప్రధానమంత్రి షింజో అబే రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పౌరసత్వ చట్ట సవరణపై ఈశాన్య భారతంలో తీవ్ర స్థాయి నిరసనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అసోం గువాహటిలో ఈనెల 15 నుంచి 17 వరకు వార్షిక ద్వైపాక్షిక సదస్సులో భాగంగా భారత్, జపాన్​ ప్రధానులు భేటీ కావాల్సి ఉంది. అయితే.. గువాహటిలో భద్రతా పరిస్థితులు క్షీణించినందున భారత పర్యటను రద్దు చేసుకోవాలని అబే భావిస్తున్నట్లు జపాన్ మీడియా పేర్కొంది. వార్షిక సదస్సు నిర్వహణపై ఇరుదేశాలు చివరి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.

పీఐబీ ట్వీట్​తో మరింత బలం

వార్షిక సదస్సు జరుగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేని సమయంలో పీఐబీ హిందీ ఓ ట్వీట్​ చేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, జపాన్​ ప్రత్యర్థి మంత్రితో ఉన్న ఫోటోను పెడుతూ.. డిసెంబర్​ 16న మోదీ-అబేల భేటీకి ముందే వీరి సమావేశం జరిగిందని పేర్కొంది. పీఐబీ ట్వీట్​తో అబే భారత పర్యటన రద్దు వార్తలకు బలం చేకూరినట్లయింది.

pib
పీఐబీ ట్వీట్​

ఇదీ చూడండి: యూకే ఫలితాలు: బోరిస్ దూకుడు​.. బ్రెగ్జిట్​కే బ్రిటన్​ ఓటు!

జపాన్​ ప్రధానికి 'పౌర సెగ'- భారత పర్యటన రద్దు!

మూడు రోజుల భారత పర్యటనను జపాన్​ ప్రధానమంత్రి షింజో అబే రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పౌరసత్వ చట్ట సవరణపై ఈశాన్య భారతంలో తీవ్ర స్థాయి నిరసనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అసోం గువాహటిలో ఈనెల 15 నుంచి 17 వరకు వార్షిక ద్వైపాక్షిక సదస్సులో భాగంగా భారత్, జపాన్​ ప్రధానులు భేటీ కావాల్సి ఉంది. అయితే.. గువాహటిలో భద్రతా పరిస్థితులు క్షీణించినందున భారత పర్యటను రద్దు చేసుకోవాలని అబే భావిస్తున్నట్లు జపాన్ మీడియా పేర్కొంది. వార్షిక సదస్సు నిర్వహణపై ఇరుదేశాలు చివరి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.

పీఐబీ ట్వీట్​తో మరింత బలం

వార్షిక సదస్సు జరుగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేని సమయంలో పీఐబీ హిందీ ఓ ట్వీట్​ చేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, జపాన్​ ప్రత్యర్థి మంత్రితో ఉన్న ఫోటోను పెడుతూ.. డిసెంబర్​ 16న మోదీ-అబేల భేటీకి ముందే వీరి సమావేశం జరిగిందని పేర్కొంది. పీఐబీ ట్వీట్​తో అబే భారత పర్యటన రద్దు వార్తలకు బలం చేకూరినట్లయింది.

pib
పీఐబీ ట్వీట్​

ఇదీ చూడండి: యూకే ఫలితాలు: బోరిస్ దూకుడు​.. బ్రెగ్జిట్​కే బ్రిటన్​ ఓటు!

New Delhi, Dec 12 (ANI): Equity benchmark indices edged higher during early hours on Thursday with metal and pharma stocks showing the most gains. At 10:15 am, the BSE S and P Sensex was up by 130 points to 40,543 while the Nifty 50 gained 47 points at 11,958. All sectoral indices were in the positive zone with Nifty metal up by 1.5 per cent, pharma by 1.1 per cent and PSU bank by 1 per cent. Among stocks, Vedanta moved up by 2.7 per cent at Rs 142.25 per share while Hindalco edged higher by 2.4 per cent, Tata Steel by 2.1 per cent and JSW Steel by 1.4 per cent.
Last Updated : Dec 13, 2019, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.