ETV Bharat / international

పాక్​​ జైలులో హఫీజ్​ సయీద్ సెటిల్మెంట్ దందా - saeed in lahore jail

అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్​ సయీద్​.. పాక్​ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నాడనేందుకు మరో ఆధారం దొరికింది. ఓ  పోలీసు కస్టడీలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబం, అధికారుల మధ్య సయోధ్య కుదిర్చాడు సయీద్​. ఈ విషయాన్ని బాధిత కుటుంబంతో పాటు అధికారులూ ధ్రువీకరించారు.

PAK-SAEED
author img

By

Published : Oct 22, 2019, 5:53 PM IST

పాకిస్థాన్​లోని జైలులో ఉన్న ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​కు సకల రాజభోగాలు అందుతున్నాయి. లాహోర్​లోని కోట్​ లఖ్​పత్​ కారాగారంలో ఉంటున్న అతడు పోలీసులు, ఖైదీల మధ్య వివాదాలను పంచాయితీల ద్వారా పరిష్కరిస్తున్నాడు.

తాజాగా జరిగిన ఓ బడా​ సెటిల్మెంట్​ను చూస్తే హఫీజ్​ పాక్​ జైలులో ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాడో అర్థం అవుతుంది. పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబం, అధికారుల మధ్య వివాదాన్ని సయీద్​ పరిష్కరించినట్లు సమాచారం.

ఏటీఎం చోరీ కేసులో..

గత నెలలో ఏటీఎం దొంగతనం కేసులో అనుమానితుడు, మతిస్థిమితం లేని సలాబుద్దీన్ అయూబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయూబీ కస్టడీలోనే మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల కారణంగానే అతను మరణించాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అయూబీ కుటుంబ సభ్యులను సయీద్​ కలిశారు. కేసుతో సంబంధమున్న పోలీసులను క్షమించి వదిలేయాలని వారిని ఒప్పించాడు. ఇందుకు ఆయూబీ కుటుంబం నివసిస్తున్న గుజ్రన్​వాలాకు రూ.80 కోట్లతో రోడ్డు, గ్యాస్ సరఫరా ఏర్పాటు చేసేలా పోలీసులతో సయీద్​ ఒప్పందం చేసుకున్నాడని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.

"ఆయూబీ కుటుంబంలో సయీద్​ అభిమానులు ఉన్నారు. ఫలితంగా సయీద్​తో కుటుంబ సభ్యులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు పోలీసులు. రెండు వైపుల వాదనలు విన్న సయీద్​ బాధిత కుటుంబానికి 3 అవకాశాలు ఇచ్చాడు. అవి... పోలీసుల నుంచి డబ్బు లేదా దేవుని పేరుమీద క్షమించి వదిలేయటం లేదా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం. క్షమించి వదిలేయాలని కుటుంబం నిర్ణయించుకుంది."

- ప్రభుత్వ అధికారి, పాకిస్థాన్

ధ్రువీకరించి బాధిత కుటుంబం

ఆయూబీ కుటుంబం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మృతుడి తండ్రి అఫ్జల్​ ఘుమ్మన్​ ఈ విషయం నిజమేనని తెలిపాడు. సయీద్​ ఆదేశాల మేరకు పంజాబ్​ గవర్నర్​ చౌదురి సర్వార్​ రోడ్డు, గ్యాస్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పాడు.

2016లో సయీద్​ స్థాపించిన ఉగ్రసంస్థ జమాత్​ ఉద్​ దవా.. పంజాబ్​లో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించింది పాక్. లాహోర్​లోని సంస్థ కార్యాలయంలో ఎన్నో సెటిల్​మెంట్లు జరిగేవి. ఇవన్నీ రుజువైనా వారిపై చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.

ఇదీ చూడండి: జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!

పాకిస్థాన్​లోని జైలులో ఉన్న ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​కు సకల రాజభోగాలు అందుతున్నాయి. లాహోర్​లోని కోట్​ లఖ్​పత్​ కారాగారంలో ఉంటున్న అతడు పోలీసులు, ఖైదీల మధ్య వివాదాలను పంచాయితీల ద్వారా పరిష్కరిస్తున్నాడు.

తాజాగా జరిగిన ఓ బడా​ సెటిల్మెంట్​ను చూస్తే హఫీజ్​ పాక్​ జైలులో ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాడో అర్థం అవుతుంది. పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబం, అధికారుల మధ్య వివాదాన్ని సయీద్​ పరిష్కరించినట్లు సమాచారం.

ఏటీఎం చోరీ కేసులో..

గత నెలలో ఏటీఎం దొంగతనం కేసులో అనుమానితుడు, మతిస్థిమితం లేని సలాబుద్దీన్ అయూబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయూబీ కస్టడీలోనే మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల కారణంగానే అతను మరణించాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అయూబీ కుటుంబ సభ్యులను సయీద్​ కలిశారు. కేసుతో సంబంధమున్న పోలీసులను క్షమించి వదిలేయాలని వారిని ఒప్పించాడు. ఇందుకు ఆయూబీ కుటుంబం నివసిస్తున్న గుజ్రన్​వాలాకు రూ.80 కోట్లతో రోడ్డు, గ్యాస్ సరఫరా ఏర్పాటు చేసేలా పోలీసులతో సయీద్​ ఒప్పందం చేసుకున్నాడని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.

"ఆయూబీ కుటుంబంలో సయీద్​ అభిమానులు ఉన్నారు. ఫలితంగా సయీద్​తో కుటుంబ సభ్యులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు పోలీసులు. రెండు వైపుల వాదనలు విన్న సయీద్​ బాధిత కుటుంబానికి 3 అవకాశాలు ఇచ్చాడు. అవి... పోలీసుల నుంచి డబ్బు లేదా దేవుని పేరుమీద క్షమించి వదిలేయటం లేదా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం. క్షమించి వదిలేయాలని కుటుంబం నిర్ణయించుకుంది."

- ప్రభుత్వ అధికారి, పాకిస్థాన్

ధ్రువీకరించి బాధిత కుటుంబం

ఆయూబీ కుటుంబం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మృతుడి తండ్రి అఫ్జల్​ ఘుమ్మన్​ ఈ విషయం నిజమేనని తెలిపాడు. సయీద్​ ఆదేశాల మేరకు పంజాబ్​ గవర్నర్​ చౌదురి సర్వార్​ రోడ్డు, గ్యాస్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పాడు.

2016లో సయీద్​ స్థాపించిన ఉగ్రసంస్థ జమాత్​ ఉద్​ దవా.. పంజాబ్​లో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించింది పాక్. లాహోర్​లోని సంస్థ కార్యాలయంలో ఎన్నో సెటిల్​మెంట్లు జరిగేవి. ఇవన్నీ రుజువైనా వారిపై చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.

ఇదీ చూడండి: జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!

Lucknow (Uttar Pradesh), Oct 22 (ANI): While speaking to ANI on Kamlesh Tiwari murder case in Lucknow on October 22, Uttar Pradesh's Law Minister Brajesh Pathak said, "We stand in support with Kamlesh Tiwari's family and the culprits will be caught soon. We will take the case to a fast-track court." "We will demand death sentence for the killers," he added. The former leader of Hindu Mahasabha was killed after being shot dead in Lucknow on October 18.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.