ETV Bharat / international

శ్రీలంక ఎన్నికలు: ఉగ్రదాడి బాధితులు ఎవరి పక్షం?

ఏప్రిల్​లో ఈస్టర్​ రోజు శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతటి మారణహోమం తరువాత శ్రీలంకలో రేపు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో బాంబు దాడి జరిగిన సెయింట్​ ఆంటోని చర్చి ఫాదర్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మాట్లాడింది.

author img

By

Published : Nov 15, 2019, 5:03 PM IST

Updated : Nov 15, 2019, 5:28 PM IST

శ్రీలంక ఎన్నికలు: ఉగ్రదాడి బాధితులు ఎవరి పక్షం?
శ్రీలంక ఎన్నికలు: ఉగ్రదాడి బాధితులు ఎవరి పక్షం?

2019 ఏప్రిల్​ 21.. ఈస్టర్​ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబోలోని మూడు చర్చిలు, మూడు విలాసవంతమైన హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 250 మందికి పైగా మరణించారు. ఆ మారణహోమం తర్వాత తొలిసారి శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దేశ జనాభాలో 7 శాతం ఉన్న కైస్త్రవులు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది కీలకంగా మారింది.

ఇక్కడున్న క్రైస్తవ వర్గంలో విచారణ జరుగుతోన్న తీరుపై అసంతృప్తి ఉంది. అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఒక్కటే... ఇంతటి మారణహోమానికి పాల్పడిన వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది?

ఈ నేపథ్యంలో ఈస్టర్​ బాంబు పేలుళ్లు జరిగిన సెయింట్​ ఆంటోని చర్చి ఫాదర్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మాట్లాడింది. బాంబు పేలుళ్ల కేసులో జరుగుతోన్న విచారణ, తదితర అంశాలపై ఫాదర్​ పలు విషయాలు ప్రస్తావించారు.

"మాకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం కావాలి. ఎవరు ఈ దాడికి పాల్పడ్డారో.. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ దాడిపై ఇంతకుముందు కమిషన్లు ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేశారు. నివేదికలు వచ్చాయి. తాజాగా దర్యాప్తు కోసం మరో కమిషన్​ ఏర్పాటు చేశారు. దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. దర్యాప్తు కమిటీ న్యాయం చేస్తుందని వేచి చూస్తున్నాం."
- జూడె ఫెర్నాండో, సెయింట్ ఆంటోనీ చర్చి ఫాదర్​

ప్ర. ఈ అధ్యక్ష ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లు ఎలా కీలకం కానున్నాయి ?

జ. ఏ రాజకీయ పార్టీపైనా మాకు ప్రత్యేక ఆసక్తి లేదు. ఏ అభ్యర్థులకు మేం మద్దతు పలకలేదు. అయితే ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కు కనుక అందరినీ పోలింగ్​లో పాల్గొనమని చర్చి ప్రోత్సహిస్తోంది. మేము ఎన్నికలను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. ఓటర్లుగా వారి ఎంపిక వారికి ఉంటుంది. దానికి అనుగుణంగా ఓటు వేస్తారు.

ప్ర. ఇంతటి గాయం నుంచి క్రైస్తవులు కోలుకోగలిగారా?

జ. ఈస్టర్​ బాంబు పేలుళ్ల బాధితుల సహాయం కోసం, వారికి మనోస్థైర్యం ఇవ్వడం కోసం చర్చి ఆధ్వర్యంలో పలు సమావేశాలు నిర్వహించాం. వీటి వల్ల, భద్రత పెంచడం కారణంగా బాధితులు, క్రైస్తవులు ఇప్పుడిప్పుడే చర్చికు వస్తున్నారు.

ప్ర. ఆసియా ఉపఖండాల్లో ఎక్కువగా ఎదురవుతోన్న ఈ తీవ్రవాద సమస్యను ఎలా ఎదుర్కోవాలి?

జ. ఈ ఉపఖండాల్లో నివసించే ప్రజలు చాలా శాంతి, సహృదయం కలిగినవారు. మాకంటూ కొన్ని విలువలు, ఆచారాలు ఉన్నాయి. ఆసియా దేశాలైన భారత్​, శ్రీలంక.. చిన్న చిన్న విభేదాలు ఉన్నా సఖ్యతతో ముందుకు వెళ్తున్నాయి. మన సనాతన విలువలు, ఆచారాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించి తీవ్రవాదంపై పోరాడేందుకు సిద్ధమవ్వాలి.

(నిషాంత్​ శర్మ, ఈటీవీ భారత్​ ఎడిటర్​ ఇన్​ చీఫ్​)

శ్రీలంక ఎన్నికలు: ఉగ్రదాడి బాధితులు ఎవరి పక్షం?

2019 ఏప్రిల్​ 21.. ఈస్టర్​ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబోలోని మూడు చర్చిలు, మూడు విలాసవంతమైన హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 250 మందికి పైగా మరణించారు. ఆ మారణహోమం తర్వాత తొలిసారి శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దేశ జనాభాలో 7 శాతం ఉన్న కైస్త్రవులు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది కీలకంగా మారింది.

ఇక్కడున్న క్రైస్తవ వర్గంలో విచారణ జరుగుతోన్న తీరుపై అసంతృప్తి ఉంది. అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఒక్కటే... ఇంతటి మారణహోమానికి పాల్పడిన వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది?

ఈ నేపథ్యంలో ఈస్టర్​ బాంబు పేలుళ్లు జరిగిన సెయింట్​ ఆంటోని చర్చి ఫాదర్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మాట్లాడింది. బాంబు పేలుళ్ల కేసులో జరుగుతోన్న విచారణ, తదితర అంశాలపై ఫాదర్​ పలు విషయాలు ప్రస్తావించారు.

"మాకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం కావాలి. ఎవరు ఈ దాడికి పాల్పడ్డారో.. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ దాడిపై ఇంతకుముందు కమిషన్లు ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేశారు. నివేదికలు వచ్చాయి. తాజాగా దర్యాప్తు కోసం మరో కమిషన్​ ఏర్పాటు చేశారు. దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. దర్యాప్తు కమిటీ న్యాయం చేస్తుందని వేచి చూస్తున్నాం."
- జూడె ఫెర్నాండో, సెయింట్ ఆంటోనీ చర్చి ఫాదర్​

ప్ర. ఈ అధ్యక్ష ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లు ఎలా కీలకం కానున్నాయి ?

జ. ఏ రాజకీయ పార్టీపైనా మాకు ప్రత్యేక ఆసక్తి లేదు. ఏ అభ్యర్థులకు మేం మద్దతు పలకలేదు. అయితే ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కు కనుక అందరినీ పోలింగ్​లో పాల్గొనమని చర్చి ప్రోత్సహిస్తోంది. మేము ఎన్నికలను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. ఓటర్లుగా వారి ఎంపిక వారికి ఉంటుంది. దానికి అనుగుణంగా ఓటు వేస్తారు.

ప్ర. ఇంతటి గాయం నుంచి క్రైస్తవులు కోలుకోగలిగారా?

జ. ఈస్టర్​ బాంబు పేలుళ్ల బాధితుల సహాయం కోసం, వారికి మనోస్థైర్యం ఇవ్వడం కోసం చర్చి ఆధ్వర్యంలో పలు సమావేశాలు నిర్వహించాం. వీటి వల్ల, భద్రత పెంచడం కారణంగా బాధితులు, క్రైస్తవులు ఇప్పుడిప్పుడే చర్చికు వస్తున్నారు.

ప్ర. ఆసియా ఉపఖండాల్లో ఎక్కువగా ఎదురవుతోన్న ఈ తీవ్రవాద సమస్యను ఎలా ఎదుర్కోవాలి?

జ. ఈ ఉపఖండాల్లో నివసించే ప్రజలు చాలా శాంతి, సహృదయం కలిగినవారు. మాకంటూ కొన్ని విలువలు, ఆచారాలు ఉన్నాయి. ఆసియా దేశాలైన భారత్​, శ్రీలంక.. చిన్న చిన్న విభేదాలు ఉన్నా సఖ్యతతో ముందుకు వెళ్తున్నాయి. మన సనాతన విలువలు, ఆచారాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించి తీవ్రవాదంపై పోరాడేందుకు సిద్ధమవ్వాలి.

(నిషాంత్​ శర్మ, ఈటీవీ భారత్​ ఎడిటర్​ ఇన్​ చీఫ్​)

Intro:Body:

dd


Conclusion:
Last Updated : Nov 15, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.