మలేషియాలో గణేష్ అనే వ్యక్తి పిల్లిని చంపి జైలుకెళ్లాడు. గర్భం దాల్చిన పిల్లిని కౌలాలంపుర్లోని ఓ పబ్లిక్ లాండ్రీ డ్రయర్లో పడేసి హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్ధరించింది. జంతు సంరక్షణ చట్టాన్ని అతిక్రమించినందున గణేష్కు 34 నెలల శిక్షతో పాటు 40 వేల రింగెట్స్(మలేషియా కరెన్సీ)ను జరిమానాగా విధించింది. అతను అప్పీలు చేసుకోవడానికి వీలుగా బెయిల్పై విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదే కేసులో ఓ ట్యాక్సీ డ్రైవర్కు జనవరిలోనే రెండేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
42 ఏళ్ల గణేశ్, ఓ ట్యాక్సీ డ్రైవర్ కలిసి గతేడాది సెప్టెంబర్లో దుస్తులు ఆరబట్టే యంత్రంలో పిల్లిని పడేయడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా... జంతు ప్రేమికులతో పాటు అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.