ETV Bharat / international

అమెరికా నౌకాశ్రయంలో కాల్పులు- రాకేశ్ బృందం సురక్షితం

author img

By

Published : Dec 5, 2019, 2:10 PM IST

Updated : Dec 5, 2019, 2:38 PM IST

అమెరికాలోని ఓ నౌకాశ్రయం వద్ద దుండగుడు కాల్పులు జరిపి ఇద్దరిని బలిగొన్నాడు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో భారత వాయుసేన సారథి ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా బృందం ఘటనా స్థలంలోనే ఉంది. వారికి ఎలాంటి హాని జరగలేదని వాయుసేన స్పష్టం చేసింది.

two-killed-in-hawaiis-pAearl-harbor-base-shooting-and-indian-air-force-chief-rsk-bhadauria-is-present-on-spot
అమెరికా నౌకాశ్రయంలో కాల్పులు- భారత వాయుసేన బృందం సురక్షితం

అమెరికా హవాయ్​లో పెరల్​ హార్బర్​ నౌకాశ్రయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఇద్దరిని బలిగొని... ఆత్మహత్య చేసుకున్నాడు.

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:30 నిమిషాల ప్రాంతంలో నావికా దళ దుస్తుల్లో ఓ ఆగంతుకుడు నౌకాశ్రయం వద్ద దాడికి తెగబడ్డాడు. ప్రతిస్పందించిన ముగ్గురు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరు అధికారులు కాసేపటికే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాల్పులతో నౌకాశ్రయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికాలో ఉన్న నాలుగు నౌకాశ్రయాల్లోకెల్లా కీలకమైన పెరల్​ హార్బర్​ను మూసివేశారు అధికారులు.

మనోళ్లు సురక్షితం...

కాల్పులు జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా, ఆయన బృందంతో కలిసి ఉన్నారు. ఫసిఫిక్​ వాయు దళాధిపతుల సమావేశం (పాక్స్​-2019) కోసం ఆ బృందం అక్కడకు వెళ్లింది.

దుండగుడి దాడి కారణంగా అమెరికాలో ఉన్న భారతీయులకు ఎలాంటి ఆపద కలగలేదని స్పష్టం చేసింది భారత వైమానిక దళం.

ఇదీ చదవండి:'''దిశ' నిందితుల్ని ఉరి తీసే వరకు ఆమరణ దీక్ష''

అమెరికా హవాయ్​లో పెరల్​ హార్బర్​ నౌకాశ్రయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఇద్దరిని బలిగొని... ఆత్మహత్య చేసుకున్నాడు.

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:30 నిమిషాల ప్రాంతంలో నావికా దళ దుస్తుల్లో ఓ ఆగంతుకుడు నౌకాశ్రయం వద్ద దాడికి తెగబడ్డాడు. ప్రతిస్పందించిన ముగ్గురు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడ్డ ముగ్గురిలో ఇద్దరు అధికారులు కాసేపటికే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాల్పులతో నౌకాశ్రయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికాలో ఉన్న నాలుగు నౌకాశ్రయాల్లోకెల్లా కీలకమైన పెరల్​ హార్బర్​ను మూసివేశారు అధికారులు.

మనోళ్లు సురక్షితం...

కాల్పులు జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా, ఆయన బృందంతో కలిసి ఉన్నారు. ఫసిఫిక్​ వాయు దళాధిపతుల సమావేశం (పాక్స్​-2019) కోసం ఆ బృందం అక్కడకు వెళ్లింది.

దుండగుడి దాడి కారణంగా అమెరికాలో ఉన్న భారతీయులకు ఎలాంటి ఆపద కలగలేదని స్పష్టం చేసింది భారత వైమానిక దళం.

ఇదీ చదవండి:'''దిశ' నిందితుల్ని ఉరి తీసే వరకు ఆమరణ దీక్ష''

New Delhi, Dec 05 (ANI): Congress leader Ahmed Patel met former finance minister P Chidambaram at latter's residence in Delhi. Congress leader P Chidambaram was granted bail by Supreme Court in the INX Media money laundering case on Dec 04. The case registered by the Enforcement Directorate and Chidambaram was in custody for over 100 days.

Last Updated : Dec 5, 2019, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.