ETV Bharat / city

మహాదివ్య పుణ్యక్షేత్రంగా.. యాదాద్రి..! - Telangana Yadadri temple today news

యాదాద్రి పునఃనిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో యాదాద్రి అద్భుత దివ్యక్షేత్రంగా భక్తులకు దర్శనమివ్వబోతోంది. స్వయంభువుల దర్శనానికి విచ్చేసే భక్తులకు సకల సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

mahadyaviya-shrine-yadadri
మహాదివ్య పుణ్యక్షేత్రంగా.. యాదాద్రి..!
author img

By

Published : Dec 27, 2019, 5:01 AM IST

Updated : Dec 27, 2019, 7:03 AM IST

మహాదివ్య పుణ్యక్షేత్రంగా.. యాదాద్రి..!

ప్రపంచ ఖ్యాతిగాంచేలా మహాదివ్య పుణ్యక్షేత్రంగా యాదాద్రి పంచనారసింహుల సన్నిధిని తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించిన తీరులో యాదాద్రి క్షేత్రాన్ని రూపొందించాలని యాడా నడుం బిగించింది. తరతరాలకు నిలిచిపోయేలా ఆలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం సూచించిన నేపథ్యంలో ప్రణాళికల రూపకల్పనకు సన్నాహాలు మొదలయ్యాయి.

సకల సౌకర్యాలకు ప్రణాళిక సిద్ధం

మహా పుణ్యక్షేత్రం యాదాద్రి కొండ కింద భక్తులకు సకల సౌకర్యాలు సమకూర్చడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పుష్కరిణి, కల్యాణ కట్ట, నిత్య అన్నదాన కేంద్రం, శివాలయం, యాగశాల అన్నీ వాస్తు ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయి.

యాగశాలకు 100 ఎకరాలు సేకరణ

గండిచెరువును సుందరీకరించి ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తున్నారు. కొండ చుట్టూ రింగ్‌రోడ్డు పనులు వేగవంతమయ్యాయి. సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణానికి అవసరమైన 100 ఎకరాల స్థలం సేకరించినట్లు ఆలయ అధికారి గీతా తెలిపారు.

రెండు నెలల్లో పనులు పూర్తి
"మరో రెండు నెలల్లో కొండపైన యాదాద్రి ప్రధాన ఆలయం, శివాలయ నిర్మాణం, ప్రసాదాల తయారీ విక్రయ కేంద్రాలు, భక్తుల దర్శన సముదాయాలు, విష్ణు పుష్కరిణి పనులు పూర్తి అవుతాయి"

భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన అనంతరమే మహా సుదర్శన యాగం ఉంటుందని ఈఓ గీత తెలిపారు. యాగ స్థలాన్ని చిన జీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్​ త్వరలో పరిశీలిస్తారని వివరించారు.

ఇవీ చూడండి: నరసింహుని శంఖు, చక్ర, తిరునామాలు సిద్ధం

మహాదివ్య పుణ్యక్షేత్రంగా.. యాదాద్రి..!

ప్రపంచ ఖ్యాతిగాంచేలా మహాదివ్య పుణ్యక్షేత్రంగా యాదాద్రి పంచనారసింహుల సన్నిధిని తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించిన తీరులో యాదాద్రి క్షేత్రాన్ని రూపొందించాలని యాడా నడుం బిగించింది. తరతరాలకు నిలిచిపోయేలా ఆలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం సూచించిన నేపథ్యంలో ప్రణాళికల రూపకల్పనకు సన్నాహాలు మొదలయ్యాయి.

సకల సౌకర్యాలకు ప్రణాళిక సిద్ధం

మహా పుణ్యక్షేత్రం యాదాద్రి కొండ కింద భక్తులకు సకల సౌకర్యాలు సమకూర్చడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పుష్కరిణి, కల్యాణ కట్ట, నిత్య అన్నదాన కేంద్రం, శివాలయం, యాగశాల అన్నీ వాస్తు ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయి.

యాగశాలకు 100 ఎకరాలు సేకరణ

గండిచెరువును సుందరీకరించి ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తున్నారు. కొండ చుట్టూ రింగ్‌రోడ్డు పనులు వేగవంతమయ్యాయి. సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణానికి అవసరమైన 100 ఎకరాల స్థలం సేకరించినట్లు ఆలయ అధికారి గీతా తెలిపారు.

రెండు నెలల్లో పనులు పూర్తి
"మరో రెండు నెలల్లో కొండపైన యాదాద్రి ప్రధాన ఆలయం, శివాలయ నిర్మాణం, ప్రసాదాల తయారీ విక్రయ కేంద్రాలు, భక్తుల దర్శన సముదాయాలు, విష్ణు పుష్కరిణి పనులు పూర్తి అవుతాయి"

భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన అనంతరమే మహా సుదర్శన యాగం ఉంటుందని ఈఓ గీత తెలిపారు. యాగ స్థలాన్ని చిన జీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్​ త్వరలో పరిశీలిస్తారని వివరించారు.

ఇవీ చూడండి: నరసింహుని శంఖు, చక్ర, తిరునామాలు సిద్ధం

Intro:Body:Conclusion:
Last Updated : Dec 27, 2019, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.