ఎన్నికలంటే ఉత్తమ్కుమార్ రెడ్డికి వణుకు పుడుతోందని తెరాస నేతలు ధ్వజమెత్తారు. ఉత్తమ్కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందే కత్తి కింద పారేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల షెడ్యూల్ను తప్పుబడుతూ కోర్టుకు వెళ్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెరాస నేత, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, శంభీపూర్ రాజుతో కలిసి కర్నె ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఉత్తమ్ తీరుతో కాంగ్రెస్ టికెట్లు అడిగే వారే కరువయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటర్లను నమ్ముకోకుండా కోర్టులనే నమ్ముకున్నట్లు స్పష్టమైందని దుయ్యబట్టారు. ఉత్తమ్ తీరుతో ఎన్నికలకు ముందే తెరాస గెలుపు ఖరారైందన్నారు. లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలకు బీసీ, ఎస్సీ వర్గాల నుంచి నియామకాలు జరపడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: హేమంత్ సోరెన్కు కేసీఆర్,కేటీఆర్ శుభాకాంక్షలు