ETV Bharat / city

ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి నుంచి కనీస ఛార్జీ - రూ.10

author img

By

Published : Dec 2, 2019, 9:40 PM IST

Updated : Dec 2, 2019, 10:54 PM IST

ఆర్టీసీలో ఛార్జీల మోత మోగింది. అర్థరాత్రి నుంచి అమలయ్యే కొత్త ధరలతో యాజమాన్యం... ఛార్జీల పట్టిక విడుదల చేసింది. సంస్థ మనుగడ సాధించాలంటే టికెట్ల ధరలు పెంచడమే భావ్యమని తెలిపింది. అన్ని సర్వీసులకు కిలోమీటర్​కు 20పైసలు పెంచుకునేందుకు అనుమతివచ్చింది.

ఆర్టీసీ బస్సులో రేపటి నుంచి కనీస ఛార్జీ - రూ.10
ఆర్టీసీ బస్సులో రేపటి నుంచి కనీస ఛార్జీ - రూ.10

ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేసింది. పెరిగిన ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయి. కొన్నేళ్లుగా నిర్వహణ భారం పెరిగిందని... ఆదాయ వ్యయాలకు వ్యత్యాసం భారీగా ఉంటోంది.
2018-19 ఏడాదికిగాను ఆర్టీసీ ఆదాయం రూ. 4882.72 కోట్లు ఉండగా ఖర్చు రూ.5811.39 కోట్లుగా ఉంది. అందువల్లే ఆర్టీసీకి రూ.928.67 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఆర్టీసీ మనుగడ సాధించాలంటే టికెట్ల ధరలు పెంచడమే భావ్యమని యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది.

ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి నుంచి కనీస ఛార్జీ - రూ.10

కిలోమీటర్​కు - 20పైసలు పెంపు
"ఆర్టీసీ బస్సుల్లో ప్రతి కిలోమీటర్​కు అన్ని సర్వీసులపై 20పైసలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వడం వల్ల వాటిని అర్థరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది"

గ్రేటర్​ పరిధిలో పెరిగిన ధరలు
గ్రేటర్ పరిధిలో ఛార్జీలు భారీగా పెరిగాయి. ఒక్క ఏసీ బస్సులకు మాత్రం ఛార్జీలు పెంచలేదని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇప్పటికే వీటికి ఎక్కువ ధరలు ఉన్నాయని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి రావడం ధరల పెంపు వాయిదా వేశారు.

తెలంగాణ - ఆర్టీసీ ఛార్జీల పెంపు
పల్లె వెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్‌

రూ. 10

ఎక్స్‌ప్రెస్‌

రూ. 15

డీలక్స్‌, లగ్జరీ

రూ. 20

సూపర్‌ లగ్జరీ

రూ. 25

రాజధాని, వజ్ర, గరుడ

రూ. 35

వెన్నెల స్లీపర్‌

రూ. 70

కనీస ఛార్జీ రూ.10
గ్రేటర్ హైదరాబాద్​లో కనీస ఛార్జీలు మాత్రం రూ.10 నిర్ణయించారు. ఆర్డినరీ ఆర్టీసీ బస్సుల ప్రస్తుత కనీస ధర రూ.5 ఉండగా దాన్ని రూ.10లకు పెంచారు. గ్రేటర్​లో గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు. మెట్రో ఎక్స్​ప్రెస్ కనీస ధర రూ. 10లు ఉండగా... కనీస ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. మెట్రో డీలక్స్ కనీస ఛార్జీ రూ.10లు ఉండగా దాన్ని రూ.15లు చేశారు.

బస్​ పాస్ ధరలు పెంపు
"బస్సు చార్జీలతో పాటు బస్సు పాస్ ల ధరలు కూడా పెరిగాయి. సాధారణ నెలవారీ బస్సులు పాస్​లలో ఆర్డీనరి పాస్​లు రూ.770ల నుంచి రూ.950లకు పెంచారు. మెట్రో ఎక్స్​ప్రెస్ పాస్​లను రూ.880 నుంచి రూ.1,070లకు పెంచారు. మెట్రో డీలక్స్ రూ.990 నుంచి రూ.1185లకు పెంచారు"

కిలోమీటర్‌కు ఛార్జీల్లో పెంపు పైసలలో

సర్వీసు పాత ఛార్జీ కొత్త ఛార్జీ

పల్లెవెలుగు

63 83

సెమీ ఎక్స్‌ప్రెస్‌

75 95

ఎక్స్‌ప్రెస్‌

87 107

డీలక్స్, లగ్జరీ

98 118

సూపర్‌ లగ్జరీ

116 136

రాజధాని, వజ్ర

146 166

గరుడ ప్లస్ ఏసీ

182 202

వెన్నెల ఏసీ స్లీపర్

253 272
- - -

ఆర్టీసీ - పెంచిన ధరలు

  • పల్లె వెలుగు బస్సుల్లో కనీసం ఛార్జీని రూ.10 నిర్ణయించారు. వీటిలో కనీస ఛార్జీలు ప్రస్తుతం రూ.6 ఉండగా వాటిని ఇవాళ అర్థరాత్రి నుంచి రూ.10కి పెంచారు.
  • సెమి ఎక్స్ ప్రెస్ సర్వీసు ఛార్జీల కనీస ధరను రూ.10లకు పెంచారు. సెమి ఎక్స్​ప్రెస్ సర్వీసుల్లో ప్రస్తుతం 75పైసల నుంచి 95పైసలకు పెంచారు. ఎక్స్ ప్రెస్ బస్సుల కనీస చార్జీలు రూ.15 పెంచారు. ప్రస్తుతం కిలోమీటరుకు 87 పైసలు నుంచి రూ.1.07 పైసలకు పెంచారు.
  • డీలక్స్ బస్సుల ఛార్జీలు కనీసం రూ.20 పెంచారు. ప్రస్తుతం కిలోమీటరుకు 98 పైసల నుంచి రూ.1.18పైసలకు పెంచారు. డీలక్స్ బస్సుకు కనీసం ఛార్జీలు రూ.20కి పెంచారు.
  • సూపర్ లగ్జరీ కనీస ఛార్జీలు రూ.25కు పెంచారు. ప్రస్తుత ఛార్జీలు రూ.1.16పైసల నుంచి రూ.1.36పైసలకు పెంచారు. రాజధాని/వజ్ర ఏసీ బస్సుల కనీస ఛార్జీలు రూ.35కు పెంచారు. ప్రస్తుత ఛార్జీలు కిలోమీటరుకు రూ.1.46పైసల నుంచి రూ.1.66పైసలకు పెంచారు. గరుడ ఏసీ బస్సులు కనీస ఛార్జీ రూ.35కు పెంచారు.

ఇదీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు.. ఛార్జీలు ఇవే!

ఏసీ బస్సుల ఛార్జీలు

  1. ప్రస్తుత ఛార్జీలు కిలోమీటరుకు రూ.1.71 పైసల నుంచి రూ.1.91లు పెంచారు. గరుడ ప్లస్ ఏసీ ఛార్జీలు కనీసం రూ.35లు పెంచారు.
  2. ప్రస్తుత ఛార్జీలను కిలోమీటరుకు రూ.1.82లు నుంచి రూ.2.02కు పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ ఛార్జీలు కనీసం రూ.70లు పెంచారు.

ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేసింది. పెరిగిన ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయి. కొన్నేళ్లుగా నిర్వహణ భారం పెరిగిందని... ఆదాయ వ్యయాలకు వ్యత్యాసం భారీగా ఉంటోంది.
2018-19 ఏడాదికిగాను ఆర్టీసీ ఆదాయం రూ. 4882.72 కోట్లు ఉండగా ఖర్చు రూ.5811.39 కోట్లుగా ఉంది. అందువల్లే ఆర్టీసీకి రూ.928.67 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఆర్టీసీ మనుగడ సాధించాలంటే టికెట్ల ధరలు పెంచడమే భావ్యమని యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది.

ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి నుంచి కనీస ఛార్జీ - రూ.10

కిలోమీటర్​కు - 20పైసలు పెంపు
"ఆర్టీసీ బస్సుల్లో ప్రతి కిలోమీటర్​కు అన్ని సర్వీసులపై 20పైసలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వడం వల్ల వాటిని అర్థరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది"

గ్రేటర్​ పరిధిలో పెరిగిన ధరలు
గ్రేటర్ పరిధిలో ఛార్జీలు భారీగా పెరిగాయి. ఒక్క ఏసీ బస్సులకు మాత్రం ఛార్జీలు పెంచలేదని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇప్పటికే వీటికి ఎక్కువ ధరలు ఉన్నాయని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి రావడం ధరల పెంపు వాయిదా వేశారు.

తెలంగాణ - ఆర్టీసీ ఛార్జీల పెంపు
పల్లె వెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్‌

రూ. 10

ఎక్స్‌ప్రెస్‌

రూ. 15

డీలక్స్‌, లగ్జరీ

రూ. 20

సూపర్‌ లగ్జరీ

రూ. 25

రాజధాని, వజ్ర, గరుడ

రూ. 35

వెన్నెల స్లీపర్‌

రూ. 70

కనీస ఛార్జీ రూ.10
గ్రేటర్ హైదరాబాద్​లో కనీస ఛార్జీలు మాత్రం రూ.10 నిర్ణయించారు. ఆర్డినరీ ఆర్టీసీ బస్సుల ప్రస్తుత కనీస ధర రూ.5 ఉండగా దాన్ని రూ.10లకు పెంచారు. గ్రేటర్​లో గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు. మెట్రో ఎక్స్​ప్రెస్ కనీస ధర రూ. 10లు ఉండగా... కనీస ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. మెట్రో డీలక్స్ కనీస ఛార్జీ రూ.10లు ఉండగా దాన్ని రూ.15లు చేశారు.

బస్​ పాస్ ధరలు పెంపు
"బస్సు చార్జీలతో పాటు బస్సు పాస్ ల ధరలు కూడా పెరిగాయి. సాధారణ నెలవారీ బస్సులు పాస్​లలో ఆర్డీనరి పాస్​లు రూ.770ల నుంచి రూ.950లకు పెంచారు. మెట్రో ఎక్స్​ప్రెస్ పాస్​లను రూ.880 నుంచి రూ.1,070లకు పెంచారు. మెట్రో డీలక్స్ రూ.990 నుంచి రూ.1185లకు పెంచారు"

కిలోమీటర్‌కు ఛార్జీల్లో పెంపు పైసలలో

సర్వీసు పాత ఛార్జీ కొత్త ఛార్జీ

పల్లెవెలుగు

63 83

సెమీ ఎక్స్‌ప్రెస్‌

75 95

ఎక్స్‌ప్రెస్‌

87 107

డీలక్స్, లగ్జరీ

98 118

సూపర్‌ లగ్జరీ

116 136

రాజధాని, వజ్ర

146 166

గరుడ ప్లస్ ఏసీ

182 202

వెన్నెల ఏసీ స్లీపర్

253 272
- - -

ఆర్టీసీ - పెంచిన ధరలు

  • పల్లె వెలుగు బస్సుల్లో కనీసం ఛార్జీని రూ.10 నిర్ణయించారు. వీటిలో కనీస ఛార్జీలు ప్రస్తుతం రూ.6 ఉండగా వాటిని ఇవాళ అర్థరాత్రి నుంచి రూ.10కి పెంచారు.
  • సెమి ఎక్స్ ప్రెస్ సర్వీసు ఛార్జీల కనీస ధరను రూ.10లకు పెంచారు. సెమి ఎక్స్​ప్రెస్ సర్వీసుల్లో ప్రస్తుతం 75పైసల నుంచి 95పైసలకు పెంచారు. ఎక్స్ ప్రెస్ బస్సుల కనీస చార్జీలు రూ.15 పెంచారు. ప్రస్తుతం కిలోమీటరుకు 87 పైసలు నుంచి రూ.1.07 పైసలకు పెంచారు.
  • డీలక్స్ బస్సుల ఛార్జీలు కనీసం రూ.20 పెంచారు. ప్రస్తుతం కిలోమీటరుకు 98 పైసల నుంచి రూ.1.18పైసలకు పెంచారు. డీలక్స్ బస్సుకు కనీసం ఛార్జీలు రూ.20కి పెంచారు.
  • సూపర్ లగ్జరీ కనీస ఛార్జీలు రూ.25కు పెంచారు. ప్రస్తుత ఛార్జీలు రూ.1.16పైసల నుంచి రూ.1.36పైసలకు పెంచారు. రాజధాని/వజ్ర ఏసీ బస్సుల కనీస ఛార్జీలు రూ.35కు పెంచారు. ప్రస్తుత ఛార్జీలు కిలోమీటరుకు రూ.1.46పైసల నుంచి రూ.1.66పైసలకు పెంచారు. గరుడ ఏసీ బస్సులు కనీస ఛార్జీ రూ.35కు పెంచారు.

ఇదీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు.. ఛార్జీలు ఇవే!

ఏసీ బస్సుల ఛార్జీలు

  1. ప్రస్తుత ఛార్జీలు కిలోమీటరుకు రూ.1.71 పైసల నుంచి రూ.1.91లు పెంచారు. గరుడ ప్లస్ ఏసీ ఛార్జీలు కనీసం రూ.35లు పెంచారు.
  2. ప్రస్తుత ఛార్జీలను కిలోమీటరుకు రూ.1.82లు నుంచి రూ.2.02కు పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ ఛార్జీలు కనీసం రూ.70లు పెంచారు.
TG_HYD_63_02_RTC_CHARGES_HIKE_TODAY_NIGHT_PKG_3182388_TS10120 reporter : sripathi.srinivas Note : ఆర్టీసీ బస్సులు, ప్రయాణికుల ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఆర్టీసీ సంస్థ బస్సు చార్జీలను పెంచేసింది. పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు ఈరోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ ఆదాయ వ్యయాలకు వ్యత్యాసం భారీగా ఉంటోంది. దీంతో నష్టాలు వాటిల్లుతున్నాయని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. వాటిని అధిగమించేందుకు చార్జీలు పెంచుతున్నట్లు యాజమాన్యం తెలిపింది. 2018-19 ఏడాదికి గాను ఆర్టీసీ ఆదాయం రూ.4882.72 కోట్లు ఉండగా ఖర్చు రూ.5811.39 కోట్లుగా ఉందని ...దీంతో ఆర్టీసీకి రూ.928.67 కోట్లు నష్టం వాటిల్లిందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. 2019-20 ఏడాదిలో ఆగస్టు నాటికి ఆదాయం రూ.2057.87 రాగా ఖర్చులు మాత్రం రూ.2361.25 కోట్లు అయ్యాయని నష్టం రూ.303.39 కోట్లు వాటిల్లిందని తెలిపారు. ఆర్టీసీ మనుగడ సాధించాలంటే టికెట్ల ధరలు పెంచడమే భావ్యమని యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం అన్ని సర్వీసులకు కిలోమీటర్ 20పైసలు పెంచుకునేందుకు అనుమతినిచ్చిందని అధికారులు పేర్కొన్నారు. Look... వాయిస్ : ఆర్టీసీ బస్సుల్లో ప్రతి కిలోమీటర్ కు అన్ని సర్వీసులపై 20పైసలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో వాటిని ఈరోజు అర్థరాత్రి నుంచి అములు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. పల్లె వెలుగు బస్సుల్లో కనీసం చార్జీని రూ.10 నిర్ణయించారు. పల్లెవెలుగు బస్సుల్లో కనీస చార్జీలు ప్రస్తుతం రూ.6 ఉండగా వాటిని ఇవాళ అర్థరాత్రి నుంచి రూ.10కి పెంచామన్నారు. ప్రతి 5కిలోమీటర్లకు స్టేజీలను యదావిధిగా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. పల్లె వెలుగు ప్రస్తుతం 63 పైసలు ఉండగా దాన్ని83పైసలకు పెంచారు. సెమి ఎక్స్ ప్రెస్ సర్వీసు చార్జీల కనీస ధరలను రూ.10లకు పెంచామన్నారు. సెమి ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రస్తుతం 75పైసలు నుంచి 95పైసలకు పెంచామన్నారు. ఎక్స్ ప్రెస్ బస్సుల కనీస చార్జీలు రూ.15 పెంచామన్నారు. ప్రస్తుతం కిలోమీటరుకు 87 పైసలు నుంచి రూ.1.07 పైసలుకు పెంచారు. డీలక్స్ బస్సుల చార్జీలు కనీసం రూ.20 పెంచారు. ప్రస్తుతం కిలోమీటరుకు 98 పైసల నుంచి రూ.1.18పైసలకు పెంచారు. డీలక్స్ బస్సుకు కనీసం చార్జీలు రూ.20 పెంచారు. ప్రస్తుత చార్జీలు 98పైసల నుంచి రూ.1.18పైసలకు పెంచారు. సూపర్ లగ్జరీ కనీస చార్జీలు రూ.25 పెంచారు.ప్రస్తుత చార్జీలు రూ.1.16పైసల నుంచి రూ.1.36పైసలకు పెంచారు. రాజధాని/వజ్ర ఎసీ బస్సుల కనీస చార్జీలు రూ.35లు పెంచారు. ప్రస్తుత చార్జీలు కిలోమీటరుకు రూ.1.46పైసలు నుంచి రూ.1.66పైసలకు పెంచారు. గరుడ ఏసీ బస్సులు కనీస చార్జీలు రూ.35 పెంచారు. ప్రస్తుత చార్జీలు కిలోమీటరుకు రూ.1.71 పైసల నుంచి రూ.1.91లు పెంచారు. గరుడ ప్లస్ ఏసీ చార్జీలు కనీసం రూ.35లు పెంచారు. ప్రస్తుత చార్జీలను కిలోమీటరుకు రూ.1.82లు నుంచి రూ.2.02కు పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ చార్జీలు కనీసం రూ.70లు పెంచారు. ప్రస్తుత చార్జీలు కిలోమీటరుకు రూ.2.53లు నుంచి రూ.2.72లకు పెంచారు. వాయిస్ : గ్రేటర్ పరిధిలో కూడా చార్జీలను పెంచారు. ఒక్క ఏసీ బస్సులకు మాత్రం చార్జీలు పెంచలేదని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఏసీ బస్సులకు ఎక్కువ ధరలు ఉన్నాయని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో రౌండింగ్ ధర రూ.5 యధావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. కనీస చార్జీలు మాత్రం రూ.10 నిర్ణయించామన్నారు. ఆర్డినరీ ఆర్టీసీ బస్సుల ప్రస్తుత కనీస ధర రూ.5 ఉండగా దాన్ని రూ.10లకు పెంచామన్నారు. గ్రేటర్ లో గరిష్ట ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్ కనీస ధర రూ.10లు ఉండగా కనీస ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. వీటి గరిష్ట ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు. మెట్రో డీలక్స్ కనీస చార్జీలు రూ.10లు ఉండగా దాన్ని రూ.15కు పెంచారు. వీటి గరిష్ట ధరను రూ.30 నుంచి రూ.45కు పెంచారు. బైట్ : వెంకటేశ్వర్లు, గ్రేటర్ ఈడీ. (ఫీడ్ మోజో ద్వారా వచ్చింది. సికింద్రాబాద్ కంట్రిబ్యూటర్ వంశీ పంపించారు). వాయిస్ : బస్సు చార్జీలతో పాటు బస్సు పాస్ ల ధరలు కూడా పెరిగాయి. సాధారణ నెలవారీ బస్సులు పాస్ లలో ఆర్డీనరి పాస్ లు రూ.770ల నుంచి రూ.950లకు పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ లను రూ.880 నుంచి రూ.1,070లకు పెంచారు. మెట్రో డీలక్స్ రూ.990 నుంచి పెరిగినవి రూ.1185లు. స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు ధరఖాస్తు చేసుకునే నెలవారి బస్సుల పాసులు ఆర్డీనరీకి ప్రస్తుతం రూ.260 ఉండగా వాటిని రూ.320కు పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ లు రూ.370 నుంచి రూ.450కు పెంచారు. మెట్రో డీలక్స్ పాస్ లు రూ.480 నుంచి రూ.575కు పెంచారు. విద్యార్థుల బస్ పాస్ లలో రూట్ పాస్ లలో కనీసం రూ.35లు పెంచారు. ప్రస్తుతం రూట్ పాస్ లను 4కిలోమీటర్ల పరిధిలో రూ.130 ఉండగా వాటిని రూ.165కు పెంచారు. ఉన్నత పాఠశాల/కళాశాలకు సంబంధించిన బస్ పాస్ లు కనీసం చార్జీలు నాలుగు నెలల పాస్ కు రూ.75 లు పెంచారు. 5కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం రూ.235 ఉండగా వాటిని రూ.310లకు పెంచారు. విద్యార్థుల నెలవారీ పాస్ లకు సంబంధించిన కనీస చార్జీలు రూ.30లు పెంచారు. ప్రస్తుతం 5కిలోమీటర్లకు రూ.85లు ఉండగా వాటిని రూ.115కు పెంచారు. విద్యార్థుల జనరల్ బస్ టికెట్ (హైదరాబాద్, వరంగల్ నగరాల్లో) కనీసం రూ.35లు పెంచారు. నెలవారీ చార్జీలు రూ.130 నుంచి రూ.165లు పెంచారు. END.....
Last Updated : Dec 2, 2019, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.