ETV Bharat / city

నేతలూ... మీరూ డ్యూటీ చేయాల్సిందే!

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలందరూ ఇకనుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కొనసాగించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సంఘాల నాయకులందరూ తమ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే వేతనం లేకుండా సెలవు పెట్టాల్సిందే.

author img

By

Published : Dec 17, 2019, 5:22 AM IST

Updated : Dec 17, 2019, 7:39 AM IST

నేతలూ... మీరూ డ్యూటీ చేయాల్సిందే!
నేతలూ... మీరూ డ్యూటీ చేయాల్సిందే!


ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నందున... నేతలు తమ రోజువారీ విధుల నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో విధులు నిర్వర్తించకుండానే వారు వేతనాలు పొందుతుంటారు. తెలంగాణ నాన్ గెజిటెట్ అధికారుల సంఘం, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీఎఫ్ వంటి సంఘాల నేతలకు ఈ సదుపాయం ఉండేది. 2018 ఎన్నికలకు ముందు కొన్ని ఇతర సంఘాలకు కూడా కల్పించారు.

ఏడాదిగా లేదు...

ఆయా సంఘాల్లోని బాధ్యులకు ఉండే ఆన్ డ్యూటీ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కొనసాగించడం లేదు. ఆన్ డ్యూటీ అవకాశం కల్పిస్తే ప్రతి ఏడాది అందుకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ సర్వీసెస్ విభాగం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే 2019 జనవరి నుంచి ఆన్ డ్యూటీకీ సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. అందువల్ల అప్పటి నుంచి ఆయా సంఘాల నేతలకు ఆన్ డ్యూటీ సదుపాయం లేనట్లే.

వేతనం కావాలంటే..

ఆన్ డ్యూటీ అవకాశం కల్పించాలని వివిధ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. సర్కార్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆన్ డ్యూటీ లేకపోవడం వల్ల... వేతనం కావాలంటే వారు తప్పనిసరిగా రోజువారీ విధులకు హాజరుకావాలి లేదంటే సెలవు పెట్టాల్సి ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడితోపాటు కొందరు విధుల్లో చేరారు. మరికొందరి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికసంఘాల నేతలకు యాజమాన్యం ఇప్పటికే ఆన్ డ్యూటీ రద్దు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు కూడా ఆన్ డ్యూటీ అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరికీ ఈ అవకాశం లేనట్లైంది.

ఇవీచూడండి: విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు

నేతలూ... మీరూ డ్యూటీ చేయాల్సిందే!


ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నందున... నేతలు తమ రోజువారీ విధుల నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో విధులు నిర్వర్తించకుండానే వారు వేతనాలు పొందుతుంటారు. తెలంగాణ నాన్ గెజిటెట్ అధికారుల సంఘం, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీఎఫ్ వంటి సంఘాల నేతలకు ఈ సదుపాయం ఉండేది. 2018 ఎన్నికలకు ముందు కొన్ని ఇతర సంఘాలకు కూడా కల్పించారు.

ఏడాదిగా లేదు...

ఆయా సంఘాల్లోని బాధ్యులకు ఉండే ఆన్ డ్యూటీ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కొనసాగించడం లేదు. ఆన్ డ్యూటీ అవకాశం కల్పిస్తే ప్రతి ఏడాది అందుకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ సర్వీసెస్ విభాగం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే 2019 జనవరి నుంచి ఆన్ డ్యూటీకీ సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. అందువల్ల అప్పటి నుంచి ఆయా సంఘాల నేతలకు ఆన్ డ్యూటీ సదుపాయం లేనట్లే.

వేతనం కావాలంటే..

ఆన్ డ్యూటీ అవకాశం కల్పించాలని వివిధ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. సర్కార్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆన్ డ్యూటీ లేకపోవడం వల్ల... వేతనం కావాలంటే వారు తప్పనిసరిగా రోజువారీ విధులకు హాజరుకావాలి లేదంటే సెలవు పెట్టాల్సి ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడితోపాటు కొందరు విధుల్లో చేరారు. మరికొందరి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికసంఘాల నేతలకు యాజమాన్యం ఇప్పటికే ఆన్ డ్యూటీ రద్దు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు కూడా ఆన్ డ్యూటీ అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరికీ ఈ అవకాశం లేనట్లైంది.

ఇవీచూడండి: విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు

File : TG_Hyd_03_17_No_Onduty_Pkg_3053262 From : Raghu Vardhan ( ) ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలందరూ ఇకనుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కొనసాగించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సంఘాల నాయకులందరూ తమ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సెలవు పెట్టి వేతనం పొందకుండా ఉండాల్సి వస్తుంది...లుక్ వాయిస్ ఓవర్ - ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు కార్మిక సంఘాల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. దీంతో ఆన్ డ్యూటీ పొందిన నేతలు ఉద్యోగాలకు సంబంధించిన రోజువారీ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉండదు. ఆ మేరకు సదరు నేతలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిస్తుంది. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందున వారికి ఆన్ డ్యూటీ అవకాశం లభిస్తుంది. దీంతో రోజువారీ విధులు నిర్వర్తించకుండానే వారు తమ వేతనాలు పొందుతుంటారు. తెలంగాణ నాన్ గెజిటెట్ అధికారుల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీఎఫ్ తదితర సంఘాలకు ఆన్ డ్యూటీ సదుపాయం ఉండేది. 2018 ఎన్నికలకు ముందు కొన్ని ఇతర సంఘాలకు కూడా ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కల్పించారు. ఆయా సంఘాల్లోని ఒకరు, ఇద్దరు, కొంతమంది బాధ్యులకు ఆన్ డ్యూటీ సదుపాయం ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత కొంత కాలంగా ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కొనసాగించడం లేదు. ఆన్ డ్యూటీ అవకాశం ఇస్తే ప్రతి ఏడాది అందుకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ సర్వీసెస్ విభాగం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే 2019 జనవరి నుంచి ఆన్ డ్యూటీకీ సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో అప్పట్నుంచి ఆయా సంఘాలకు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తోన్న నేతలకు ఆన్ డ్యూటీ లేనట్లే. తమకు ఆన్ డ్యూటీ అవకాశం కల్పించాలని సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. సర్కార్ మాత్రం ఆ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గత 12 నెలలుగా వారికి ఆన్ డ్యూటీ లేనట్లే. ఆన్ డ్యూటీ లేకపోవడంతో వారు తప్పనిసరిగా రోజువారీ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. వేతనం కావాలంటే విధులకు విధిగా వెళ్లాలి లేదంటే సెలవు పెట్టి వేతనానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాత్రం విధుల్లో చేరారు. మిగతా వారిలోనూ కొందరు విధుల్లో చేరారు. మరికొందరి విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికసంఘాల నేతలకు యాజమాన్యం ఇప్పటికే ఆన్ డ్యూటీని రద్దు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు కూడా ఆన్ డ్యూటీ అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరికీ ఆన్ డ్యూటీ అవకాశం లేనట్లైంది.
Last Updated : Dec 17, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.