హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టోట్ పబ్పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ముజ్రా పార్టీ జరుగుతోందనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. పబ్లో నగ్న నృత్యాలు నిర్వహిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. 22మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టోట్ పబ్లో ఓ ప్రైవేటు సంస్థ ముజ్రా పార్టీ ఏర్పాటు చేసింది. నగ్న నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో మరికొన్ని పబ్ల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
అక్రమంగా మద్యాన్ని నిల్వ చేశారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇళ్ల మధ్యలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.