ETV Bharat / city

'ఆర్టీసీపై భేటీ సమయంలో.. గుండె వేగంగా కొట్టుకుంది'

ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికేందుకు సీఎం కేసీఆర్​ సమావేశమైనప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయడమే లక్ష్యంగా ఉండేదని.. ఆర్థికమంత్రిగా తన పాత్ర విభిన్నమైనదన్నారు. ఇటీవల కేబినెట్​లో సమావేశంలో తమ పాత్ర ఎలా ఉందో సరదాగా వివరించారు.. మంత్రి హరీశ్​రావు.

author img

By

Published : Dec 5, 2019, 2:58 PM IST

harish rao responds on funds and budget given to tsrtc
ఆర్టీసీ కార్మికులతో సీఎం భేటీ అయినప్పుడు.. గుండె వేగంగా కొట్టుకుంది: హరీశ్​రావు

ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించడంపై ఆర్థిక మంత్రి హరీశ్​ స్పందించారు. ఆర్టీసీకి వచ్చే ఏడాది బడ్జెట్​లో వెయ్యి కోట్లు కేటాయించడం, సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వడం, తక్షణ సాయంగా రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారని.. ఆయా మొత్తాన్ని సేకరించాల్సిన బాధ్యత తన మంత్రిత్వ శాఖపైనే ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశమైనప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందన్నారు. నీటిపారుదల మంత్రిగా గతంలో ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయడమే లక్ష్యంగా ఉండేదని.. ఇప్పుడు ఆర్థికమంత్రిగా తన పాత్ర విభిన్నమైనదని హరీశ్ పేర్కొన్నారు.

నాది నెగిటివ్​ రోల్​..

ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో జరిగిన చిన్న సంఘటన గురించి హరీశ్​ వివరించారు. భారీ వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించాలంటూ ఆ శాఖ మంత్రి కేబినెట్​ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. సమాధానం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​.. తనవైపు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వైపు చూశారని పేర్కొన్నారు. రహదారులు బాగుచేసేందుకు అప్పటికే రూ.600 కోట్లు కేటాయించామని.. దానికి తోడు మరో రూ. 550 కోట్లు ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదని తాను చెప్పానని.. హరీశ్​ తెలిపారు. నిధులు కేటాయించాలని మనసులో ఉన్న.. ఆర్థిక మంత్రిగా ఆ పని చేయలేకపోతున్నానని చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ల సదస్సులో సరదాగా తన అనుభవాలను వివరించారు.

ఆర్టీసీ కార్మికులతో సీఎం భేటీ అయినప్పుడు.. గుండె వేగంగా కొట్టుకుంది: హరీశ్​రావు

ఇవీచూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించడంపై ఆర్థిక మంత్రి హరీశ్​ స్పందించారు. ఆర్టీసీకి వచ్చే ఏడాది బడ్జెట్​లో వెయ్యి కోట్లు కేటాయించడం, సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వడం, తక్షణ సాయంగా రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారని.. ఆయా మొత్తాన్ని సేకరించాల్సిన బాధ్యత తన మంత్రిత్వ శాఖపైనే ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశమైనప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందన్నారు. నీటిపారుదల మంత్రిగా గతంలో ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయడమే లక్ష్యంగా ఉండేదని.. ఇప్పుడు ఆర్థికమంత్రిగా తన పాత్ర విభిన్నమైనదని హరీశ్ పేర్కొన్నారు.

నాది నెగిటివ్​ రోల్​..

ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో జరిగిన చిన్న సంఘటన గురించి హరీశ్​ వివరించారు. భారీ వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించాలంటూ ఆ శాఖ మంత్రి కేబినెట్​ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. సమాధానం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​.. తనవైపు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వైపు చూశారని పేర్కొన్నారు. రహదారులు బాగుచేసేందుకు అప్పటికే రూ.600 కోట్లు కేటాయించామని.. దానికి తోడు మరో రూ. 550 కోట్లు ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదని తాను చెప్పానని.. హరీశ్​ తెలిపారు. నిధులు కేటాయించాలని మనసులో ఉన్న.. ఆర్థిక మంత్రిగా ఆ పని చేయలేకపోతున్నానని చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ల సదస్సులో సరదాగా తన అనుభవాలను వివరించారు.

ఆర్టీసీ కార్మికులతో సీఎం భేటీ అయినప్పుడు.. గుండె వేగంగా కొట్టుకుంది: హరీశ్​రావు

ఇవీచూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.