ETV Bharat / city

పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు: గవర్నర్

author img

By

Published : Jan 11, 2020, 2:42 PM IST

Updated : Jan 11, 2020, 3:34 PM IST

పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ తారామతి బారాదరిలో జరిగిన తెలంగాణ ప్రజాస్వామ్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హజరైన ఆమె పురస్కారాలు అందజేశారు.

పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రెటీలు: గవర్నర్
పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రెటీలు: గవర్నర్

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ప్రజాస్వామ్య అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హైదరాబాద్​లోని తారామతి బారాదరిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘాన్ని, కమిషనర్​ నాగిరెడ్డిని ఆమె ప్రశంసించారు. సాధారణ ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికల్లో పోలింగ్​ శాతం ఎక్కువ నమోదవుతోందని గవర్నర్​ అన్నారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు చేపడుతున్న చర్యలను గవర్నర్​ అభినందించారు.

పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎన్నికల విధానం గొప్పదని కితాబిచ్చారు. అనంతరం పురస్కార గ్రహీతలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ అత్యధిక పురస్కారాలు తమ శాఖ ఉద్యోగులకే దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు: గవర్నర్

ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ప్రజాస్వామ్య అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హైదరాబాద్​లోని తారామతి బారాదరిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘాన్ని, కమిషనర్​ నాగిరెడ్డిని ఆమె ప్రశంసించారు. సాధారణ ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికల్లో పోలింగ్​ శాతం ఎక్కువ నమోదవుతోందని గవర్నర్​ అన్నారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు చేపడుతున్న చర్యలను గవర్నర్​ అభినందించారు.

పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎన్నికల విధానం గొప్పదని కితాబిచ్చారు. అనంతరం పురస్కార గ్రహీతలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ అత్యధిక పురస్కారాలు తమ శాఖ ఉద్యోగులకే దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు: గవర్నర్

ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

Panchkula (Haryana), Jan 11 (ANI): Private organisation has started a campaign to tie radium bands on stray cattle and dogs. They are trying to keep them safe from road traffic during night hours. These radium tapes are procured from Coimbatore. More than 150 cows have been tied radium bands or tapes around their necks to make them visible at highway roads.
Last Updated : Jan 11, 2020, 3:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.