ETV Bharat / city

తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసినప్పటికీ... ఎన్‌కౌంటర్‌ వివాదస్పదం కావటం వల్ల సుప్రీంకోర్టు న్యాయవిచారణకు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై కమిషన్‌ ప్రధానంగా విచారించనుంది. కాల్పుల్లో వాడిన ఆయుధాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పంపారు. దీనిపై నిపుణులు ఇచ్చే నివేదిక కమిషన్ విచారణలో కీలకం కానుంది.

author img

By

Published : Dec 19, 2019, 5:34 AM IST

Updated : Dec 19, 2019, 12:03 PM IST

తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?
తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?
తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?

దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాల్పులకు పోలీసులు వాడిన ఆయుధాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. కాల్పులకు దారితీసిన పరిస్థుతులు, నిందితులు తమ ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపారన్న పోలీసులు వాదనపై విచారించనున్నారు. బందోబస్తుగా వెళ్లిన పది మంది పోలీసులలో కాల్పులు జరిపింది ఎవరు? వారి వద్ద ఉన్న తుపాకులు ఎలాంటివి అనే వివరాలను సిట్​ ఆరా తీయనుంది. ఇప్పటికే వాటిని స్వాధీనం చేసుకున్నారు.

సుప్రీంకోర్టు కూడా కమిషన్‌ ఏర్పాటు చేసి జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. త్వరలోనే కమిషన్​ సభ్యులు హైదరాబాద్​కు రానున్నారు. ప్రధానంగా వీరు ఎదురు కాల్పులపై విచారణ జరపనున్నారు. పోలీసులు వాడిన ఆయుధాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాల్లో బుల్లెట్లు లేవు. బుల్లెట్ గాయాలను బట్టి... ఏ ఆయుధం నుంచి వచ్చిన తూటా ఎవరి శరీరంలోకి వెళ్లింది వంటి వివరాలతో ఫోరెన్సిక్ విభాగంలోని బాలిస్టిక్ నిపుణులు నివేదిక సిద్ధం చేయనున్నారు. జ్యుడీషియల్ కమిషన్‌ విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది.

ఇదీ చూడండి: 'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'

తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?

దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాల్పులకు పోలీసులు వాడిన ఆయుధాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. కాల్పులకు దారితీసిన పరిస్థుతులు, నిందితులు తమ ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపారన్న పోలీసులు వాదనపై విచారించనున్నారు. బందోబస్తుగా వెళ్లిన పది మంది పోలీసులలో కాల్పులు జరిపింది ఎవరు? వారి వద్ద ఉన్న తుపాకులు ఎలాంటివి అనే వివరాలను సిట్​ ఆరా తీయనుంది. ఇప్పటికే వాటిని స్వాధీనం చేసుకున్నారు.

సుప్రీంకోర్టు కూడా కమిషన్‌ ఏర్పాటు చేసి జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. త్వరలోనే కమిషన్​ సభ్యులు హైదరాబాద్​కు రానున్నారు. ప్రధానంగా వీరు ఎదురు కాల్పులపై విచారణ జరపనున్నారు. పోలీసులు వాడిన ఆయుధాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాల్లో బుల్లెట్లు లేవు. బుల్లెట్ గాయాలను బట్టి... ఏ ఆయుధం నుంచి వచ్చిన తూటా ఎవరి శరీరంలోకి వెళ్లింది వంటి వివరాలతో ఫోరెన్సిక్ విభాగంలోని బాలిస్టిక్ నిపుణులు నివేదిక సిద్ధం చేయనున్నారు. జ్యుడీషియల్ కమిషన్‌ విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది.

ఇదీ చూడండి: 'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'

TG_HYD_04_19_DISHA_CASE_UPDATE_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తులో భాగంగా కాల్పులకు వాడిన తుపాకులను ఫోరెన్సిక్ పరీక్షలు పంపనున్నారు. నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో మరణించడం వివాదాస్పదం కావడంతో... దీనిపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ఇప్పటికే కాల్పుల్లో పాల్గొన్న సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు....LOOOOK V.O:దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణలో కాల్పులకు వాడిన ఆయుధాలకు ఫోరోన్సిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. నలుగురు నిందితులైన మహ్మద్ ఆరిప్ , జొల్లు శివ , బొల్లు నవీన్ . చింతకుంట చెన్న కేశవులు చటానపల్లి గ్రామం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఈ కాల్పుల ఉదంతంపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 6వ తేదీన కేసు నమోదైంది. అనంతరం విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది . కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, నిందితులు తమ ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్న వాదన నిజమేనా, నిందితులకు బందోబస్తుగా వెళ్లిన పది మంది పోలీసులలో ఎవరు కాల్పులు జరిపారు, వారి వద్ద ఉన్న తుపాకులు ఎలాంటివి తదితర వివరాలను ఆరా తీసే ఉద్దేశంతోనే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు జ్యూడీషియల్ విచారణకు ఆదేశించడంతో త్వరలోనే కమిషన్ సభ్యులు హైదరాబాద్ రానున్నారు . V.O:ఎదురు కాల్పుల పై వీరు విచారణ జరపనున్నారు . వీరి విచారణ అంతా నిందితుల కాల్పులు , పోలీసుల ఎదురు కాల్పుల అంశం చుట్టూనే కేంద్రీకృతం కానుంది. దీనిలో భాగంగా కమిషన్ సభ్యులు పోలీసులు వాడిన ఆయుధాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. నిందితుల దేహాల్లో బుల్లెట్లు లేవు... అవన్నీ బయటకు వెళ్లిపోయాయి... దేహాలపై పడిన బుల్లెట్ గాయాలను బట్టి అవి ఏ ఆయుధానికి చెందినవో ఫోరెన్సిక్ విభాగంలోని బాలిస్టిక్ నిపుణులు చెబుతారు. ఈ కాల్పుల ఉదంతంలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బంది వాడిన ఆయుధాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు . వీటిలో నిందితులు లాక్కున్నారని చెబుతున్న రెండు ఆయుధాలు కూడా ఉన్నాయి . పరీక్షల నిమిత్తం వీటన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు . ప్రతి ఆయుధాన్ని నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఏ ఆయుధం నుంచి వచ్చిన తూటా ఎవరి శరీరంలోకి వెళ్లింది, వంటి వివరాలతో కూడిన నివేదికను నిపుణులు సిద్ధం చేయనున్నారు . జ్యుడీషియల్ కమిషన్ జరిపే విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది. OVER...
Last Updated : Dec 19, 2019, 12:03 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.