ETV Bharat / city

మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

author img

By

Published : Jan 19, 2020, 10:40 PM IST

మంత్రి ఎర్రబెల్లిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. తొర్రూర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించే దోరణిలో మంత్రి మాట్లాడారని పేర్కొంది. తక్షణమే మంత్రి ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

congress complaint
congress complaint

ఎన్నికల ప్రచారంలో ఓటర్ల గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మున్సిపల్‌ ప్రచారంలో ఓటర్లను బెదిరించే దోరణిలో మంత్రి మాట్లాడారని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ వెల్లడించారు.

ఓట్లు ఎవరికి వేశారో తెలుస్తుందని... తెరాసకు వేయకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. ఆ తరువాత బాధపడి ప్రయోజనం ఉండదని.. మరో నాలుగేళ్లు తామే అధికారంలో ఉంటామని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నట్లు పేర్కొన్నారు. తెరాసకు ఓటు వేయాలన్న బెదిరింపు మాటలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో తెలిపారు.

ఓటరు ఎవరికి ఓటు వేశారో... మంత్రి ఎలా తెలుసుకుంటారో వివరణ కోరాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తక్షణమే మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

congress complaint
మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

ఇదీ చూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'

ఎన్నికల ప్రచారంలో ఓటర్ల గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మున్సిపల్‌ ప్రచారంలో ఓటర్లను బెదిరించే దోరణిలో మంత్రి మాట్లాడారని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ వెల్లడించారు.

ఓట్లు ఎవరికి వేశారో తెలుస్తుందని... తెరాసకు వేయకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. ఆ తరువాత బాధపడి ప్రయోజనం ఉండదని.. మరో నాలుగేళ్లు తామే అధికారంలో ఉంటామని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నట్లు పేర్కొన్నారు. తెరాసకు ఓటు వేయాలన్న బెదిరింపు మాటలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో తెలిపారు.

ఓటరు ఎవరికి ఓటు వేశారో... మంత్రి ఎలా తెలుసుకుంటారో వివరణ కోరాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తక్షణమే మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

congress complaint
మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

ఇదీ చూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'

TG_Hyd_83_19_CONG_COMPLAINT_TO_ELECTION_COMMISSION_AV_3038066 From : Tirupal reddy గమనిక: ఎన్నికల కమిషన్‌కు పంపిన లేఖ...డెస్క్‌ వాట్సప్‌కు పంపించాను. వాడుకోగలరు. ()ఎన్నికల ప్రచారంలో ఓటర్ల గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మున్సిపల్‌ ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి ఓటర్లను బెదిరించే దోరణలో మాట్లాడారని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో వెల్లడించారు. ఓట్లు ఎవరికి వేశారో...తెలుస్తుందిని...తెరాసకు ఓటు వేయకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. ఆ తరువాత బాధపడి ప్రయోజనం ఉండదని..మరో నాలుగేళ్లు అధికారంలో తామే ఉంటామని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నట్లు పేర్కొన్నారు. తెరాసకు ఓటు వేయాలన్న బెదిరింపు మాటలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని...ఓటరు ఎవరికి ఓటు వేశారో... మంత్రి ఎలా తెలుసుకుంటారో వివరణ కోరాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తక్షణమే మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.