ETV Bharat / city

చేయి జారకుండా.. ఉన్నవి కాపాడుకుంటూ...

author img

By

Published : Jan 27, 2020, 4:22 AM IST

Updated : Jan 27, 2020, 9:02 AM IST

కాంగ్రెస్‌కు అధిక స్థానాలు వచ్చిన పురపాలక సంఘాలలో ఛైర్మన్లను, వైస్‌ ఛైర్మన్లను ఎంపిక చేసుకునేందుకు పీసీసీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన పురపాలక సంఘాల్లో అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్త తీసుకుంటోంది. అధికార పార్టీతో సమానంగా కానీ.. ఒకట్రెండు తక్కువ స్థానాలు వచ్చిన చోట కూడా అభ్యర్ధులను కాపాడుకోడానికి విప్‌ జారీ చేసింది. అందుకోసం 20 రూపాయల స్టాంపుపై ముందుగానే అఫిడవిట్ తీసుకుంది.

చేయి జారకుండా.. ఉన్నవి కాపాడుకుంటూ...
చేయి జారకుండా.. ఉన్నవి కాపాడుకుంటూ...
చేయి జారకుండా.. ఉన్నవి కాపాడుకుంటూ...

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఆరు పురపాలక సంఘాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. మరో ఎనిమిది మున్సిపాలిటీలపై ఆశలు మాత్రం పెట్టుకుంది. అధికార పార్టీకి దీటుగా పలు స్థానాల్లో గెలుపొందిన పురపాలక సంఘాల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకం అవుతారు.

పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు వచ్చిన పురపాలక సంఘాలను పరిశీలిస్తే... చండూరులో మొత్తం పది స్థానాలు ఉండగా తెరాసకు రెండు, కాంగ్రెస్‌కు ఏడు, భాజపాకి ఒకటి లెక్కన స్థానాలు దక్కాయి. వడ్డేపల్లిలో మొత్తం స్థానాలు పది కాగా రెండు తెరాసకు, ఎనిమిది కాంగ్రెస్‌కు వచ్చాయి. తుర్కయాంజల్‌లో మొత్తం 24 స్థానాలు కాగా అయిదు తెరాసకు, 17 కాంగ్రెస్​కు, ఒకటి భాజపాకి, ఒకటి స్వతంత్రులకు వచ్చాయి. పెద్ద అంబర్‌పేటలో 24 స్థానాలు ఉండగా తెరాసకు 8, కాంగ్రెస్‌కు 13, భాజపాకి ఒకటి, ఇతరులకు రెండు లెక్కన వచ్చాయి. మణికొండలో మొత్తం 20 స్థానాలకు తెరాసకు 5, కాంగ్రెస్‌కు 8, భాజపాకి ఆరు, ఇతరులకు ఒకటి లెక్కన గెలుపొందారు. నారాయణఖేడ్​లో మొత్తం 15కు గానూ తెరాసకు ఏడు, కాంగ్రెస్​ 8 స్థానాలు దక్కించుకుంది. హాలియాలో మొత్తం 12 స్థానాలు ఉండగా అయిదు తెరాసకు, ఆరు కాంగ్రెస్‌కు, ఒకటి ఇతరులకు వచ్చింది. ఈ ఏడు పురపాలక సంఘాల్లో ఫిజికల్‌గా కాంగ్రెస్‌కు ఛైర్మన్‌ పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. అక్కడ కూడా అవకాశం ఉన్న మేరకు ఎక్స్‌ అఫిసియో సభ్యులను రంగంలోకి దించి కాంగ్రెస్‌కు దక్కుకుండా చూడాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కాకుండా ఖానాపూర్, చేర్యాల, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి లాంటి ప్రాంతాల్లో అటు కాంగ్రెస్‌ ఇటు తెరాసకు పోటాపోటీగా స్థానాలు దక్కాయి. ఖానాపూర్‌, చేర్యాల, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్‌కు, తెరాసకు సమానంగా స్థానాలు దక్కాయి. ఇక్కడ స్వతంత్రులు ఉంటే వారికి బేరసారాలు పెట్టారు. అదే విధంగా అధికార పార్టీకి ఎక్కువగా ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉండడం వల్ల... వారికే ఎక్కువగా అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థులు చేజారకుండా విప్‌ జారీ చేసింది. రూ.20 స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ తీసుకున్నందున విప్‌ను ధిక్కరించే అవకాశం తక్కువని భావిస్తున్నారు. అయినా... కూడా తెరాస కదలికలపై నిఘా ఉంచిన కాంగ్రెస్‌ ఎక్కడైన తమ పార్టీ సభ్యులను కొనుగోలు చేసేందుకు యత్నిస్తే...అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కష్టకాలంలో... జెండాలు ఇవ్వకుండా ఎన్నికల ఖర్చులకు రూపాయి ఇవ్వకుండానే 582 స్థానాలు గెలుస్తామని తాము కూడా ఊహించ లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో కేవలం 20 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమి చెందారని పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో బలమైన పార్టీ క్యాడర్‌ ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: రాజ్​భవన్​​లో ఎట్​హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు

చేయి జారకుండా.. ఉన్నవి కాపాడుకుంటూ...

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఆరు పురపాలక సంఘాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. మరో ఎనిమిది మున్సిపాలిటీలపై ఆశలు మాత్రం పెట్టుకుంది. అధికార పార్టీకి దీటుగా పలు స్థానాల్లో గెలుపొందిన పురపాలక సంఘాల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకం అవుతారు.

పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు వచ్చిన పురపాలక సంఘాలను పరిశీలిస్తే... చండూరులో మొత్తం పది స్థానాలు ఉండగా తెరాసకు రెండు, కాంగ్రెస్‌కు ఏడు, భాజపాకి ఒకటి లెక్కన స్థానాలు దక్కాయి. వడ్డేపల్లిలో మొత్తం స్థానాలు పది కాగా రెండు తెరాసకు, ఎనిమిది కాంగ్రెస్‌కు వచ్చాయి. తుర్కయాంజల్‌లో మొత్తం 24 స్థానాలు కాగా అయిదు తెరాసకు, 17 కాంగ్రెస్​కు, ఒకటి భాజపాకి, ఒకటి స్వతంత్రులకు వచ్చాయి. పెద్ద అంబర్‌పేటలో 24 స్థానాలు ఉండగా తెరాసకు 8, కాంగ్రెస్‌కు 13, భాజపాకి ఒకటి, ఇతరులకు రెండు లెక్కన వచ్చాయి. మణికొండలో మొత్తం 20 స్థానాలకు తెరాసకు 5, కాంగ్రెస్‌కు 8, భాజపాకి ఆరు, ఇతరులకు ఒకటి లెక్కన గెలుపొందారు. నారాయణఖేడ్​లో మొత్తం 15కు గానూ తెరాసకు ఏడు, కాంగ్రెస్​ 8 స్థానాలు దక్కించుకుంది. హాలియాలో మొత్తం 12 స్థానాలు ఉండగా అయిదు తెరాసకు, ఆరు కాంగ్రెస్‌కు, ఒకటి ఇతరులకు వచ్చింది. ఈ ఏడు పురపాలక సంఘాల్లో ఫిజికల్‌గా కాంగ్రెస్‌కు ఛైర్మన్‌ పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. అక్కడ కూడా అవకాశం ఉన్న మేరకు ఎక్స్‌ అఫిసియో సభ్యులను రంగంలోకి దించి కాంగ్రెస్‌కు దక్కుకుండా చూడాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కాకుండా ఖానాపూర్, చేర్యాల, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి లాంటి ప్రాంతాల్లో అటు కాంగ్రెస్‌ ఇటు తెరాసకు పోటాపోటీగా స్థానాలు దక్కాయి. ఖానాపూర్‌, చేర్యాల, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్‌కు, తెరాసకు సమానంగా స్థానాలు దక్కాయి. ఇక్కడ స్వతంత్రులు ఉంటే వారికి బేరసారాలు పెట్టారు. అదే విధంగా అధికార పార్టీకి ఎక్కువగా ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉండడం వల్ల... వారికే ఎక్కువగా అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థులు చేజారకుండా విప్‌ జారీ చేసింది. రూ.20 స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ తీసుకున్నందున విప్‌ను ధిక్కరించే అవకాశం తక్కువని భావిస్తున్నారు. అయినా... కూడా తెరాస కదలికలపై నిఘా ఉంచిన కాంగ్రెస్‌ ఎక్కడైన తమ పార్టీ సభ్యులను కొనుగోలు చేసేందుకు యత్నిస్తే...అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కష్టకాలంలో... జెండాలు ఇవ్వకుండా ఎన్నికల ఖర్చులకు రూపాయి ఇవ్వకుండానే 582 స్థానాలు గెలుస్తామని తాము కూడా ఊహించ లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో కేవలం 20 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమి చెందారని పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో బలమైన పార్టీ క్యాడర్‌ ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: రాజ్​భవన్​​లో ఎట్​హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు

TG_HYD_02_27_CONG_VIP_ISSUED_FOR_PROTECTION_PKG_3038066 Reporter: M Tirupal Reddy ()కాంగ్రెస్‌కు అధిక స్థానాలు వచ్చిన పురపాలక సంఘాల ఛైర్మన్లను, వైస్‌ ఛైర్మన్లను ఎంపిక చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లుతోంది. పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన పురపాలక సంఘాల్లో అభ్యర్ధులు చేజారకుండా జాగ్రత్త తీసుకున్న కాంగ్రెస్‌...అధికార పార్టీతో సమానంగా కాని, ఒకట్రెండు తక్కువ స్థానాలు వచ్చిన చోట కూడా అభ్యర్ధులను కాపాడుకోడానికి విప్‌ జారీ చేసింది. ముందుగానే 20 రూపాయల స్టాంపుపై అఫిడవిట్ తీసుకున్న కారణంగా ఎ ఒక్క అభ్యర్ధి కూడా విప్‌ దిక్కరించే అవకాశం లేదని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. LOOK వాయిస్ఓవర్‌1: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఆరు పురపాలక సంఘాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. మరో ఎనిమిది మున్సిపాలిటీలపై ఆశలు మాత్రం పెట్టుకుంది. అధికార పార్టీకి దీటుగా స్థానాల్లో గెలుపొందిన పురపాలక సంఘాల్లో ఎక్స్‌ అఫిసియో సభ్యులు కీలకం అవుతారు. పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు వచ్చిన పురపాలక సంఘాలను పరిశీలిస్తే...చండూరులో మొత్తం పది స్థానాలు ఉండగా తెరాసకు రెండు కాంగ్రెస్‌కు ఏడు, బీజేపీకి ఒకటి లెక్కన స్థానాలు దక్కాయి. వడ్డేపల్లిలో మొత్తం స్థానాలు పది కాగా రెండు తెరాసకు, ఎనిమిది కాంగ్రెస్‌కు వచ్చాయి. తుర్కయాంజల్‌లో మొత్తం 24 స్థానాలు కాగా అయిదు తెరాసకు, 17 కాంగ్రెస్‌ పార్టీకి, ఒకటి బీజేపీకి, ఒకటి స్వతంత్రులకు వచ్చాయి. పెద్ద అంబర్‌పేటలో 24 స్థానాలు ఉండగా తెరాసకు 8, కాంగ్రెస్‌కు 13, బీజేపీకి ఒకటి, ఇతరులకు రెండు లెక్కన వచ్చాయి. మనికొండలో మొత్తం 20 స్థానాలు ఉండగా తెరాసకు 5, కాంగ్రెస్‌కు 8, బీజేపీకి ఆరు, ఇతరులకు ఒకటి లెక్కన గెలుపొందారు. నారాయణఖేడ్‌ లో మొత్తం 15 స్థానాలు ఉండగా ఏడు తెరాకు రాగా ఎనిమిది కాంగ్రెస్‌ పార్టీకి వచ్చాయి. హాలియాలో మొత్తం 12 స్థానాలు ఉండగా అయిదు తెరాసకు, ఆరు కాంగ్రెస్‌కు, ఒకటి ఇతరులకు వచ్చింది. ఈ ఏడు పురపాలక సంఘాల్లో ఫిజికల్‌గా కాంగ్రెస్‌కు ఛైర్మన్‌ పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాని అక్కడ కూడా అవకాశం ఉన్న మేరకు ఎక్స్‌ అఫిసియో సభ్యులను రంగంలోకి దించి కాంగ్రెస్‌కు దక్కుకుండా చూడాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఖానాపూర్; చేర్యాల, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి లాంటి ప్రాంతాల్లో అటు కాంగ్రెస్‌ ఇటు తెరాస పార్టీలకు పోటాపోటీగా స్థానాలు దక్కాయి. ఖానాపూర్‌, చేర్యాల, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్‌కు, తెరాసకు సమానంగా స్థానాలు దక్కాయి. ఇక్కడ స్వతంత్రులు ఉంటే వారికి బేరసారాలు పెట్టారు. అదే విధంగా అధికార పార్టీకి ఎక్కువగా ఎక్స్‌ అఫిసియో సభ్యులు ఉండడంతో...వారికే ఎక్కువగా అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కీలకంగా భావిస్తున్న ప్రతి చోట అటు రాజ్యసభ సభ్యులను, ఇటు ఎమ్మెల్సీలను రంగంలోకి దించే యోచనలో తెరాస ఉండగా కాంగ్రెస్‌ మాత్రం అవకాశం ఉన్న మేరకు గెలుపొందిన అభ్యర్ధులు చేజారకుండా విప్‌ జారీ చేసింది. 20రూపాయల స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ తీసుకున్నందున విప్‌ను దిక్కరించే అవకాశం తక్కువని భావిస్తున్నారు. అయినా...కూడా అధికార తెరాస పార్టీ కదలికలపై నిఘా ఉంచిన కాంగ్రెస్‌ ఎక్కడైన కాంగ్రెస్‌ పార్టీ వార్డు సభ్యులను కొనుగోలు చేసేందుకు యత్నిస్తే...అడ్డుకోడానికి సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా...సమాన స్థానాలు వచ్చిన చోట..కూడా కాంగ్రెస్‌కు ఛైర్మన్‌ పదవులు దక్కే అవకాశం చాలా తక్కువని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ వేస్తున్న ఎత్తులను చిత్తు చేయడం అంత సులువు కాదని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కష్టకాలంలో...జండాలు ఇవ్వకుండా ఎన్నికల ఖర్చులకు రూపాయి ఇవ్వకుండానే 582 స్థానాలు గెలుస్తామని తాము కూడా ఊహించ లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో 20 ఓట్లు లోపు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు ఓటమి చవిచూశారని పేర్కొంటున్న ఓ నాయకుడు క్షేత్ర స్థాయిలో బలమైన పార్టీ క్యాడర్‌ ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని వ్యాఖ్యానించారు.
Last Updated : Jan 27, 2020, 9:02 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.