ETV Bharat / business

సంపన్నుల కోసం శాంసంగ్ లగ్జరీ స్క్రీన్.. ధర రూ.12 కోట్లు!

author img

By

Published : Dec 6, 2019, 6:40 AM IST

విలాస వసతులు కోరుకునే సంపన్నులే లక్ష్యంగా శాంసంగ్​ ఇండియా ఓ సరికొత్త ఎల్​ఈడీ స్క్రీన్​ను మార్కెట్లోకి తీసుకురానుంది. రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల ధరతో మూడు సైజులలో  ఈ డిస్​ప్లేలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది శాంసంగ్​.

SAMSUNG
శాంసంగ్​ వాల్​

ఎలక్ట్రానిక్​ దిగ్గజం శాంసంగ్​.. సరికొత్త మాడ్యులర్​ మైక్రో ఎల్​ఈడీ డిస్​ప్లే 'ది వాల్​'ను భారత మార్కెట్​కు పరిచయం చేసింది. జాయింట్​ స్క్రీన్​తో 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల వేరియంట్లలో ఈ డిస్​ప్లేలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. వీటి ధరలు రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు పేర్కొంది.

లగ్జరీ స్క్రీనింగ్​ అనుభూతిని కోరుకునే సంపన్నులే లక్ష్యంగా ఈ డిస్​ప్లేను పరిచయం చేసినట్లు శాంసంగ్ తెలిపింది. 2022 నాటికి 200 యూనిట్లు విక్రయించి రూ.498 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాంసంగ్​ ఇండియా ఉపాధ్యక్షుడు (కన్సూమర్ ఎలక్ట్రానిక్స్) పునీత్​ సేతి తెలిపారు.

భారత్​లో ప్రస్తుతం 140 మంది బిలియనీర్​లు, 950 మంది మల్టీ మిలియనీర్​లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ స్క్రీన్​లకు మెట్రో, నాన్​ మెట్రో పట్టణాల నుంచి డిమాండ్​ ఉండొచ్చని శాంసంగ్​ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్​, బెంగళూరు, పుణె, లుథియానా, అహ్మదాబాద్​, ఛండీగఢ్​ల నుంచి ఎక్కువగా డిమాండ్​ ఉంటుందని అంచనా వేస్తోంది.

ది వాల్​ ప్రత్యేకతలు..

ది వాల్ 146 అంగుళాల డిస్​ప్లే.. మైక్రో ఎల్​ఈడి సదుపాయంతో లభించనుంది.

219 అంగుళాల డిస్​ప్లే.. 6కే డెఫినిషన్​తో.. 292 అంగుళాల డిస్​ప్లే 8కే డెఫినిషిన్​తో రూపొందిస్తున్నారు.

ది వాల్​తో వినియోగదారులు ఇంతకు ముందు ఎన్నడూ లేని స్క్రీన్​ అనుభూతి పొందుతారని శాంసంగ్ చెబుతోంది. ఈ డిస్​ప్లేలలో 0.8 ఎంఎం పిక్సెల్​ పిఛ్​ టెక్నాలజీ పొందుపరిచినట్లు తెలిపింది. దీని ద్వారా సినిమా, వీడియోలలో లగ్జరీ వినియోగదారులు అనుభూతి పొందుతారని శాంసంగ్ పేర్కొంది.

అన్ని రకాల ఓఎస్​లకు ది వాల్ అనుకూలంగా ఉండనున్నట్లు శాంసంగ్ తెలిపింది.

ది వాల్​ ప్రొఫెషనల్ వెర్షన్​ను అందుబాటులోకి తేనుంది శాంసంగ్. పెద్ద పెద్ద వ్యాపారాలకు, రిటైలర్లకు ఇది ఉపయోగకరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇది పూర్తి కస్టమైజబుల్​ ఫీచర్లతో రానున్నట్లు పేర్కొంది.

ది వాల్​ను పూర్తిగా ఆఫ్​ ​చేయాల్సిన అవసరం లేకుండా రూపొందించినట్లు శాంసంగ్​ వెల్లడించింది. ఎక్కువ సమయం వాడకపోతే.. ఇంటీరియర్​కు తగ్గట్లు సీనరీలు, ఆర్ట్​ల వంటివి డిస్​ప్లే అవుతూ ఉంటాయని తెలిపింది.

ఇదీ చూడండి:ఉల్లి రైతు రికార్డ్​- కిలో రూ.200కు విక్రయం

ఎలక్ట్రానిక్​ దిగ్గజం శాంసంగ్​.. సరికొత్త మాడ్యులర్​ మైక్రో ఎల్​ఈడీ డిస్​ప్లే 'ది వాల్​'ను భారత మార్కెట్​కు పరిచయం చేసింది. జాయింట్​ స్క్రీన్​తో 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల వేరియంట్లలో ఈ డిస్​ప్లేలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. వీటి ధరలు రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు పేర్కొంది.

లగ్జరీ స్క్రీనింగ్​ అనుభూతిని కోరుకునే సంపన్నులే లక్ష్యంగా ఈ డిస్​ప్లేను పరిచయం చేసినట్లు శాంసంగ్ తెలిపింది. 2022 నాటికి 200 యూనిట్లు విక్రయించి రూ.498 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాంసంగ్​ ఇండియా ఉపాధ్యక్షుడు (కన్సూమర్ ఎలక్ట్రానిక్స్) పునీత్​ సేతి తెలిపారు.

భారత్​లో ప్రస్తుతం 140 మంది బిలియనీర్​లు, 950 మంది మల్టీ మిలియనీర్​లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ స్క్రీన్​లకు మెట్రో, నాన్​ మెట్రో పట్టణాల నుంచి డిమాండ్​ ఉండొచ్చని శాంసంగ్​ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్​, బెంగళూరు, పుణె, లుథియానా, అహ్మదాబాద్​, ఛండీగఢ్​ల నుంచి ఎక్కువగా డిమాండ్​ ఉంటుందని అంచనా వేస్తోంది.

ది వాల్​ ప్రత్యేకతలు..

ది వాల్ 146 అంగుళాల డిస్​ప్లే.. మైక్రో ఎల్​ఈడి సదుపాయంతో లభించనుంది.

219 అంగుళాల డిస్​ప్లే.. 6కే డెఫినిషన్​తో.. 292 అంగుళాల డిస్​ప్లే 8కే డెఫినిషిన్​తో రూపొందిస్తున్నారు.

ది వాల్​తో వినియోగదారులు ఇంతకు ముందు ఎన్నడూ లేని స్క్రీన్​ అనుభూతి పొందుతారని శాంసంగ్ చెబుతోంది. ఈ డిస్​ప్లేలలో 0.8 ఎంఎం పిక్సెల్​ పిఛ్​ టెక్నాలజీ పొందుపరిచినట్లు తెలిపింది. దీని ద్వారా సినిమా, వీడియోలలో లగ్జరీ వినియోగదారులు అనుభూతి పొందుతారని శాంసంగ్ పేర్కొంది.

అన్ని రకాల ఓఎస్​లకు ది వాల్ అనుకూలంగా ఉండనున్నట్లు శాంసంగ్ తెలిపింది.

ది వాల్​ ప్రొఫెషనల్ వెర్షన్​ను అందుబాటులోకి తేనుంది శాంసంగ్. పెద్ద పెద్ద వ్యాపారాలకు, రిటైలర్లకు ఇది ఉపయోగకరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇది పూర్తి కస్టమైజబుల్​ ఫీచర్లతో రానున్నట్లు పేర్కొంది.

ది వాల్​ను పూర్తిగా ఆఫ్​ ​చేయాల్సిన అవసరం లేకుండా రూపొందించినట్లు శాంసంగ్​ వెల్లడించింది. ఎక్కువ సమయం వాడకపోతే.. ఇంటీరియర్​కు తగ్గట్లు సీనరీలు, ఆర్ట్​ల వంటివి డిస్​ప్లే అవుతూ ఉంటాయని తెలిపింది.

ఇదీ చూడండి:ఉల్లి రైతు రికార్డ్​- కిలో రూ.200కు విక్రయం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 5 December 2019
++NIGHT SHOTS++  
1. Police officers and police vans
2. Protester walking and throwing object
3. Protesters standing in line with red flares and flags
4. People walking across pedestrian crossing where police and police vans are lined up
5. Protesters letting off red flares and chanting
6. Various of protesters jumping up and down singing and letting off red flares
STORYLINE:
Protests in Paris continued into Thursday evening with demonstrators letting off flares, chanting and singing.
Unions launched an open-ended, nationwide walkout over President Emmanuel Macron's centerpiece reform in the biggest challenge to the centrist leader since the yellow vest movement against economic inequality erupted a year ago.
Opponents fear the changes to how and when workers can retire will threaten the hard-fought French way of life.
At least 87 protesters were arrested in the French capital after small groups of masked activists smashed store windows, set fires and hurled flares on the sidelines of an otherwise peaceful protest.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.