ETV Bharat / business

బోయింగ్ ​ నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హూన్​

బోయింగ్​ 737 మాక్స్ విమానాలను అంతర్జాతీయంగా పలు దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రస్తుత సీఈవోగా ఉన్న డెన్నిస్ ముయిలెన్‌బర్గ్​ను తొలగించింది బోయింగ్​ సంస్థ. నూతన సీఈవోగా డేవిడ్ కాల్హూన్​ను నియమించింది.

author img

By

Published : Dec 24, 2019, 12:07 AM IST

Boeing ousts Muilenburg, names Chair David Calhoun as CEO
బోయింగ్ ​ నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హౌన్​

బోయింగ్​ 737 మాక్స్​ విమానాలను అంతర్జాతీయంగా పలు దేశాలు నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుత సీఈవోను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హూన్​​ను నియమించింది.

వినియోగదారులు, ఇతర వాటా దారులకు, రెగ్యులేటర్లకు సంస్థపై విశ్వాసాన్ని పెంచటమే కాకుండా, వారి మధ్య సంబంధాలను మెరుగుపరచటానికి సీఈవో​గా డేవిడ్​ను నియమించినట్లు సంస్థ తెలిపింది.

2020 జనవరి 13 నుంచి డేవిడ్​ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారని ఓ ప్రకటన విడుదల చేసింది బోయింగ్​. అప్పటి వరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారిగా ఉన్న గ్రెగ్​ స్మిత్​ తాత్కాలిక సీఈవోగా కొనసాగుతారని పేర్కొంది.

సీఈవో మార్పు ప్రకటన తర్వాత బోయింగ్ షేర్ల విలువ 3.4 శాతం పెరిగాయి.

ఇంతకీ ఏం జరిగింది?

ఇథియోపియా ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడిస్​ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేషియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మృతి చెందారు.

ఈ నేపథ్యంలో బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాలను భారత్​తో పాటు యూఏఈ, ఒమన్​, న్యూజిలాండ్​, ఫ్రాన్స్​ దేశాలు నిషేధించాయి. ఈ విమానాల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది బోయింగ్​.

ఇదీ చూడండి:'రాజ్యాంగంపై దాడి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు'

బోయింగ్​ 737 మాక్స్​ విమానాలను అంతర్జాతీయంగా పలు దేశాలు నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుత సీఈవోను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హూన్​​ను నియమించింది.

వినియోగదారులు, ఇతర వాటా దారులకు, రెగ్యులేటర్లకు సంస్థపై విశ్వాసాన్ని పెంచటమే కాకుండా, వారి మధ్య సంబంధాలను మెరుగుపరచటానికి సీఈవో​గా డేవిడ్​ను నియమించినట్లు సంస్థ తెలిపింది.

2020 జనవరి 13 నుంచి డేవిడ్​ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారని ఓ ప్రకటన విడుదల చేసింది బోయింగ్​. అప్పటి వరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారిగా ఉన్న గ్రెగ్​ స్మిత్​ తాత్కాలిక సీఈవోగా కొనసాగుతారని పేర్కొంది.

సీఈవో మార్పు ప్రకటన తర్వాత బోయింగ్ షేర్ల విలువ 3.4 శాతం పెరిగాయి.

ఇంతకీ ఏం జరిగింది?

ఇథియోపియా ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడిస్​ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేషియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మృతి చెందారు.

ఈ నేపథ్యంలో బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాలను భారత్​తో పాటు యూఏఈ, ఒమన్​, న్యూజిలాండ్​, ఫ్రాన్స్​ దేశాలు నిషేధించాయి. ఈ విమానాల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది బోయింగ్​.

ఇదీ చూడండి:'రాజ్యాంగంపై దాడి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు'

New Delhi, Dec 23 (ANI): Congress party staged protest at Rajghat against Citizenship (Amendment) Act on Dec 23. During the protest, Congress leader Rahul Gandhi said that entire nation knows it was PM Narendra Modi who wore a suit worth Rs 2 crore. "When it comes to clothes, the entire nation knows you because of your clothes. It was you who had worn a suit worth Rs 2 crore, it was not the people of the country," said Rahul Gandhi. Gandhi said this after PM Modi gave a statement that people who are protesting and creating violence can be identified by their clothes.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.