ETV Bharat / bharat

రఫేల్​, రాహుల్​ కేసులపై విచారణ వాయిదా

author img

By

Published : May 10, 2019, 4:41 PM IST

రఫేల్ తీర్పును పునఃసమీక్షించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. రాహుల్​పై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపైనా విచారణ వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. రఫేల్​పై కేంద్రం సమర్పించిన అఫిడవిట్​ను పరిశీలించిన కోర్టు విచారణ వాయిదావేసింది. రాహుల్​ బేషరతుగా క్షమాపణలు చెప్తూ కేసు కొట్టేయాలని విన్నవించారు. దీనిపైనా విచారణ వాయిదా వేసింది కోర్టు.

రఫేల్​, రాహుల్​ కేసులపై విచారణ వాయిదా

'రఫేల్​' తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాలు సహా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కోర్టు ధిక్కరణ కేసుపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

ఇదీ నేపథ్యం...

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు​ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్​ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్​ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ కూడా వేరుగా పిటిషన్​ దాఖలు చేశారు.
రివ్యూ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించగా... కేంద్రం ఈనెల 4న ప్రమాణపత్రం సమర్పించింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వాదించింది.
కేంద్రం సమర్పించిన ప్రమాణపత్రాలను నేడు సుప్రీంకోర్టు పరిశీలించింది. విచారణను వాయిదా వేసింది.

రాహుల్​ కేసు....

కాపలాదారే దొంగ అని రఫేల్​ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్​కు ఏప్రిల్​ 23న నోటీసులు జారీ చేసింది. రెండు ప్రమాణపత్రాలు సమర్పించిన రాహుల్.... తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్​ను కొట్టివేయాలని కోరారు.

రాహుల్​ సమర్పించిన ప్రమాణపత్రాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ఓసారి తప్పు చేశామని, మరోసారి చేయలేదని అంటున్నారని మందలించింది. అసలు మీరు ఏం చెప్పదలిచారో అర్థంకావడంలేదని అసహనం వ్యక్తంచేసింది. సుస్పష్ట వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం ఇచ్చింది.

బేషరతుగా...

సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెబుతూ ఈనెల 8న మరో ప్రమాణపత్రం దాఖలు చేశారు రాహుల్​. కోర్టు ధిక్కరణ కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

'రఫేల్​' తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాలు సహా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కోర్టు ధిక్కరణ కేసుపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

ఇదీ నేపథ్యం...

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు​ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్​ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్​ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ కూడా వేరుగా పిటిషన్​ దాఖలు చేశారు.
రివ్యూ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించగా... కేంద్రం ఈనెల 4న ప్రమాణపత్రం సమర్పించింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వాదించింది.
కేంద్రం సమర్పించిన ప్రమాణపత్రాలను నేడు సుప్రీంకోర్టు పరిశీలించింది. విచారణను వాయిదా వేసింది.

రాహుల్​ కేసు....

కాపలాదారే దొంగ అని రఫేల్​ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్​కు ఏప్రిల్​ 23న నోటీసులు జారీ చేసింది. రెండు ప్రమాణపత్రాలు సమర్పించిన రాహుల్.... తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్​ను కొట్టివేయాలని కోరారు.

రాహుల్​ సమర్పించిన ప్రమాణపత్రాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ఓసారి తప్పు చేశామని, మరోసారి చేయలేదని అంటున్నారని మందలించింది. అసలు మీరు ఏం చెప్పదలిచారో అర్థంకావడంలేదని అసహనం వ్యక్తంచేసింది. సుస్పష్ట వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం ఇచ్చింది.

బేషరతుగా...

సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెబుతూ ఈనెల 8న మరో ప్రమాణపత్రం దాఖలు చేశారు రాహుల్​. కోర్టు ధిక్కరణ కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.