మహారాష్ట్ర ఠానేలో దారుణం జరిగింది. శాంతి నగర్ ప్రాంతంలో ఉండే ఓ ప్రైవేటు ట్యూషన్ టీచర్ తన దగ్గరకు వచ్చే 3వ తరగతి విద్యార్థికి అత్యంత కఠిన శిక్ష విధించింది. హోం వర్క్ చేయలేదని ఆగ్రహించి 450 గుంజీలు తీయించింది. రెండు కాళ్లు వాచి, నడవలేని స్థితిలో ఆ చిన్నారి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
ట్యూషన్ టీచర్ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. ఆ ఉపాధ్యాయురాలు గతంలోనూ బాలికను వివస్త్రను చేసి, కర్రతో చితకబాదిందని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!