భాజపాతో కలిసేది లేదని తేల్చి చెప్పారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో పొత్తు పెట్టుకోబోమని వ్యాఖ్యానించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పదవి తమదేనని ఉద్ఘాటించారు.
"ఆఫర్లకు సమయం పూర్తయ్యింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు."
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారు అన్న విలేకరుల ప్రశ్నకు పైవిధంగా జవాబిచ్చారు రౌత్.
ఇదీ చూడండి: నౌకాదళంలో తొలి మహిళా పైలట్ శివాంగి