ETV Bharat / bharat

జల్​అమియా: వంటింటి వస్తువులతో మురికి నీటిశుద్ధి

స్వచ్ఛమైన నీటికోసం భారీ ఖర్చు చేసే యంత్రాలను శాస్త్రజ్ఞులు కనుగొంటున్నారు. కానీ దీనికి భిన్నంగా వంటింటి వస్తువులతో మురికినీటిని తాగునీటిగా మార్చగల ప్రకృతి మిశ్రమం తయారుచేసి మన్ననలు పొందుతోంది ఛత్తీస్​గఢ్​కు చెందిన  'హిమాంగి హల్దర్'​ అనే పాఠశాల విద్యార్థిని.

author img

By

Published : Nov 10, 2019, 7:32 AM IST

Updated : Nov 10, 2019, 9:48 AM IST

ఇలా చేస్తే మురికి నీరుని మనం తాగచ్చు తెలుసా?
జల్​ఆమియా: వంటింటి వస్తువులతో మురికి నీటిశుద్ధి

నీటి కొరత నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. గ్రామాలు, పట్టణాలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయి. మంచినీరు లభ్యంకాక కొన్ని ప్రాంతాల వాసులు కాలుష్యమయమైన నీటినే తాగేస్తున్నారు. ఈ కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారు సాధారణ ప్రజానీకం. ఈ నేపథ్యంలో ఛత్తీస్​గఢ్​కు చెందిన 'హిమాంగి హల్దర్'​ అనే పాఠశాల విద్యార్థిని వంటింటి వస్తువులతో నీటిని శుద్ధి చేసే ప్రకృతి మిశ్రమం తయారుచేసి అందరినీ అబ్బురపరుస్తోంది. దీనికి 'జల్​ అమియా' అనే పేరుపెట్టింది.

ఈ మిశ్రమ తయారీకోసం ఆరు నెలల పాటు పరిశోధన చేసింది హిమాంగి. రసాయనాలు ఉపయోగించకుండా కేవలం ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తయారుచేసింది. దీన్ని ఉపయోగించి మురికినీరును తాగునీటిగా మార్చి ఎంచక్కా తాగేయ్యొచ్చు.

"ప్రస్తుతం జలసమస్య పెరిగిపోయి.. తాగేందుకు నీరు దొరకటం కష్టమైపోయింది. ఈ కారణంగా ప్రజలు మురికినీరుని తాగుతున్నారు. దీనివలన పచ్చకామెర్లు​, కలరా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని అనుకున్నాను. మురికినీటిని ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలతో తాగునీటిగా మార్చాలనుకున్నాను. ఫలితంగా ఈ జల్​ అమియా అనే మిశ్రమాన్ని తయారుచేశాను. "

-హిమాంగి హల్దర్​, విద్యార్థిని

మిశ్రమ తయారీ విధానం

ఓ కప్పులోకి కావల్సినంత నిర్మాలీ విత్తనాల పొడి, మునగకాయ, వేప, తులసి ఆకుల పొడి సమాన పాళ్లలో తీసుకొని తగినంత నీరు కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఒక లీటరు మురికినీటిలో 0.005మిల్లీలీటర్ల మిశ్రమాన్ని కలపాలి. నీటిలోని మలినాలను ఈ మిశ్రమం శుద్ధి చేయడం ద్వారా కొంత సమయం అనంతరం దానంటత అదే శుభ్రమైన తాగునీటిగా మారిపోతుంది. ఈ నీటిని తాగడం వలన ఏవిధమైన ప్రమాదం లేదని.. పూర్తి రసాయన రహిత మిశ్రమమని హిమాంగి వెల్లడించారు.

పలువురి ప్రశంసలు..

ఈ మిశ్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో పుణెలో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఐక్యరాజ్యసమితి కాప్14 సదస్సులో 'జల్​అమియ'ను కామన్​ వెల్త్​ దేశాల ప్రతినిధులు పరీక్షించారు. ఇంట్లో దొరికే గింజలతో నీటిని శుద్ధి చేస్తున్న ఈ మిశ్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పేటెంట్​ హక్కుల​ కోసం భారత ప్రభుత్వానికి నమూనాని పంపారు.

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు: కట్టుదిట్టమైన భద్రత నీడలో దేశం

జల్​ఆమియా: వంటింటి వస్తువులతో మురికి నీటిశుద్ధి

నీటి కొరత నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. గ్రామాలు, పట్టణాలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయి. మంచినీరు లభ్యంకాక కొన్ని ప్రాంతాల వాసులు కాలుష్యమయమైన నీటినే తాగేస్తున్నారు. ఈ కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారు సాధారణ ప్రజానీకం. ఈ నేపథ్యంలో ఛత్తీస్​గఢ్​కు చెందిన 'హిమాంగి హల్దర్'​ అనే పాఠశాల విద్యార్థిని వంటింటి వస్తువులతో నీటిని శుద్ధి చేసే ప్రకృతి మిశ్రమం తయారుచేసి అందరినీ అబ్బురపరుస్తోంది. దీనికి 'జల్​ అమియా' అనే పేరుపెట్టింది.

ఈ మిశ్రమ తయారీకోసం ఆరు నెలల పాటు పరిశోధన చేసింది హిమాంగి. రసాయనాలు ఉపయోగించకుండా కేవలం ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తయారుచేసింది. దీన్ని ఉపయోగించి మురికినీరును తాగునీటిగా మార్చి ఎంచక్కా తాగేయ్యొచ్చు.

"ప్రస్తుతం జలసమస్య పెరిగిపోయి.. తాగేందుకు నీరు దొరకటం కష్టమైపోయింది. ఈ కారణంగా ప్రజలు మురికినీరుని తాగుతున్నారు. దీనివలన పచ్చకామెర్లు​, కలరా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని అనుకున్నాను. మురికినీటిని ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలతో తాగునీటిగా మార్చాలనుకున్నాను. ఫలితంగా ఈ జల్​ అమియా అనే మిశ్రమాన్ని తయారుచేశాను. "

-హిమాంగి హల్దర్​, విద్యార్థిని

మిశ్రమ తయారీ విధానం

ఓ కప్పులోకి కావల్సినంత నిర్మాలీ విత్తనాల పొడి, మునగకాయ, వేప, తులసి ఆకుల పొడి సమాన పాళ్లలో తీసుకొని తగినంత నీరు కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఒక లీటరు మురికినీటిలో 0.005మిల్లీలీటర్ల మిశ్రమాన్ని కలపాలి. నీటిలోని మలినాలను ఈ మిశ్రమం శుద్ధి చేయడం ద్వారా కొంత సమయం అనంతరం దానంటత అదే శుభ్రమైన తాగునీటిగా మారిపోతుంది. ఈ నీటిని తాగడం వలన ఏవిధమైన ప్రమాదం లేదని.. పూర్తి రసాయన రహిత మిశ్రమమని హిమాంగి వెల్లడించారు.

పలువురి ప్రశంసలు..

ఈ మిశ్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో పుణెలో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఐక్యరాజ్యసమితి కాప్14 సదస్సులో 'జల్​అమియ'ను కామన్​ వెల్త్​ దేశాల ప్రతినిధులు పరీక్షించారు. ఇంట్లో దొరికే గింజలతో నీటిని శుద్ధి చేస్తున్న ఈ మిశ్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పేటెంట్​ హక్కుల​ కోసం భారత ప్రభుత్వానికి నమూనాని పంపారు.

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు: కట్టుదిట్టమైన భద్రత నీడలో దేశం


Bengaluru, Nov 09 (ANI): While addressing the press conference the Karnataka ADGP (Law and Order) Amar Kr Pandey said that Karnataka Police is at maximum alert and maximum 'bandobast' ahead of special judgment. "This is a very unique situation where we have Eid Milad, issue of celebration of Tipu Jayanti and the very special judgment which is expected tomorrow. Keeping that in mind, Karnataka police is at maximum alert and maximum 'bandobast'" Supreme Court is likely to pronounce its verdict in the Ram Janmabhoomi-Babri Masjid dispute.
Last Updated : Nov 10, 2019, 9:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.