ETV Bharat / bharat

'వాతావరణ మార్పులతో.. పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు'

author img

By

Published : Nov 14, 2019, 5:32 PM IST

వాతావారణ మార్పులతో పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని 'ది లాన్సెట్' తాజా నివేదిక పేర్కొంది. తక్షణం శిలాజ ఇంధన ఉద్గారాలను నియంత్రించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఆరోగ్యం, వాతావరణ మార్పులపై 'లాన్సెట్​ కౌంట్​డౌన్' 41 కీలక సూచీలతో సమగ్ర వార్షిక నివేదికను రూపొందించింది.

'వాతావరణ మార్పులతో.. పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు'

వాతావరణ మార్పు... ఓ తరం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని 'ది లాన్సెట్' తాజా​ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా భారతదేశంలో ఆహార కొరత, అంటువ్యాధులు, వరదలు, తీవ్ర ఉష్ణ తరంగాల కారణంగా పిల్లలు ఆనారోగ్యం పాలవుతున్నారని పేర్కొంది. తక్షణం శిలాజ ఇంధన ఉద్గారాలను నియంత్రించాల్సి ఉందని సూచించింది.

ఆరోగ్యం, వాతావరణ మార్పులపై 'లాన్సెట్​ కౌంట్​డౌన్' 41 కీలక సూచీలతో సమగ్ర వార్షిక నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకుతో సహా 35 సంస్థలకు చెందిన 120 మంది నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

ప్రమాదం పొంచి ఉంది..

ప్రస్తుత రేటులోనే అధిక కర్బన ఉద్గారాలు వెలువడుతుంటే.. భూతాపం పెరిగిపోతుందని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు తమ 71 ఏళ్ల వయస్సు నాటికి సగటున 4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఫలితంగా వారి జీవితంలోని ప్రతి దశలోనూ ఆరోగ్య ముప్పు ఎదురవుతుందని స్పష్టం చేసింది.

భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్​ కన్నా తక్కువకు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించకుంటే.. భావి తరాలు తీవ్ర ముప్పును ఎదుర్కోకతప్పదని లాన్సెట్ నివేదిక తేల్చిచెప్పింది. ఉష్ణోగ్రత పెరుగుదల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట

వాతావరణ మార్పు... ఓ తరం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని 'ది లాన్సెట్' తాజా​ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా భారతదేశంలో ఆహార కొరత, అంటువ్యాధులు, వరదలు, తీవ్ర ఉష్ణ తరంగాల కారణంగా పిల్లలు ఆనారోగ్యం పాలవుతున్నారని పేర్కొంది. తక్షణం శిలాజ ఇంధన ఉద్గారాలను నియంత్రించాల్సి ఉందని సూచించింది.

ఆరోగ్యం, వాతావరణ మార్పులపై 'లాన్సెట్​ కౌంట్​డౌన్' 41 కీలక సూచీలతో సమగ్ర వార్షిక నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకుతో సహా 35 సంస్థలకు చెందిన 120 మంది నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

ప్రమాదం పొంచి ఉంది..

ప్రస్తుత రేటులోనే అధిక కర్బన ఉద్గారాలు వెలువడుతుంటే.. భూతాపం పెరిగిపోతుందని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు తమ 71 ఏళ్ల వయస్సు నాటికి సగటున 4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఫలితంగా వారి జీవితంలోని ప్రతి దశలోనూ ఆరోగ్య ముప్పు ఎదురవుతుందని స్పష్టం చేసింది.

భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్​ కన్నా తక్కువకు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించకుంటే.. భావి తరాలు తీవ్ర ముప్పును ఎదుర్కోకతప్పదని లాన్సెట్ నివేదిక తేల్చిచెప్పింది. ఉష్ణోగ్రత పెరుగుదల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట

New Delhi, Nov 11 (ANI): Chief Minister of Himachal Pradesh Jairam Thakur was honoured by M Venkaiah Naidu at the Samskrita Bharati's World Conference in New Delhi. He was accorded the honour for giving second language status to Sanskrit in the state. Speaking at the event, CM Thakur said, "Sanskrit is not just the language of our country, it can also be a global language." "Despite living in the age of technology and progressing, Sanskrit has its own importance. Even in technology, the most suitable language found for computers was Sanskrit," he added. Health Minister Harsh Vardhan also attended the event.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.