ETV Bharat / bharat

ప్రజాస్వామ్య సూచీలో మరింత దిగువకు భారత్​

author img

By

Published : Jan 22, 2020, 11:22 PM IST

Updated : Feb 18, 2020, 1:41 AM IST

ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ ర్యాంకింగ్స్​లో భారత్​ 10 స్థానాలు కోల్పోయింది. 6.90 స్కోరుతో 51వ స్థానంలో నిలిచింది. పౌర స్వేచ్ఛకు విఘాతం కలగడమే ఇందుకు కారణమని ది ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ పేర్కొంది.

india-falls-to-51st-position-in-eius-democracy-index
ప్రజాస్వామ్య సూచీలో మరింత దిగువకు భారత్​

2019 ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ ర్యాంకింగ్స్​లో భారత్​ 51వ స్థానంలో నిలిచింది. 2018తో పోల్చితే 10 స్థానాలు దిగువకు పడిపోయింది భారత్​. పౌర స్వేచ్ఛకు విఘాతం కలగడమే ఇందుకు ప్రధాన కారణమని ది ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ పేర్కొంది. 2018లో 7.23గా ఉన్న భారత్​ స్కోరు.. 2019లో 6.90కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా 165 స్వతంత్ర రాష్ట్రాలు, రెండు టెరిటరీల్లో ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితుల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ, బహుత్వవాదం, ప్రభుత్వ పనితీరు, రాజకీయ సంస్కృతి, పౌర స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణినలోకి తీసుకున్నారు.

ఫ్లాడ్​ డెమొక్రసీ...

ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా ఉన్న దేశాలకు స్కోరు 8గా ఇస్తారు. ప్రజాస్వామ్యంలో లోపం(ఫ్లాడ్​ డెమొక్రసీ)కు 6-8 మధ్యలో స్కోరు ఇస్తారు. ఒక్కోసారి 8 కూడా ఇచ్చే అవకాశముంది. హైబ్రీడ్​ రెజీమ్​(పాలన)కు 4-6 స్కోరు ఇస్తారు. అథారిటేరియన్​ రెజీమ్​కు 4కు కన్నా తక్కువ స్కోరు ఇస్తారు. ప్రస్తుతం భారత్​ ఫ్లాడ్​ డెమొక్రసీలో ఉంది.

చైనా(153 ర్యాంకు- స్కోర్​ 2.26), పాకిస్థాన్​(108 ర్యాంకు- స్కోర్​ 4.25), శ్రీలంక(69 ర్యాంకు, 6.27), బంగ్లాదేశ్​ (80 ర్యాంకు- 5.88 స్కోరు)గా ఉన్నాయి. నార్వే, ఐస్​లాండ్​, స్వీడన్​కు తొలి మూడు స్థానాలు దక్కాయి. అట్టడుగున స్థానం(167)లో ఉత్తర కొరియా నిలిచింది.

కాంగ్రెస్​ ఫైర్​...

ప్రజాస్వామ్య సూచీలో భారత్​ 10 స్థానాలు కోల్పోవడంపై కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణం భాజపా పాలనేనని ఆరోపించింది. ప్రజాస్వామ్య విలువలను కాషాయ పార్టీ నాశనం చేయడంలో విజయం సాధించిందని ట్వీట్​ చేసింది.

india-falls-to-51st-position-in-eius-democracy-index
కాంగ్రెస్​ ట్వీట్​

2019 ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ ర్యాంకింగ్స్​లో భారత్​ 51వ స్థానంలో నిలిచింది. 2018తో పోల్చితే 10 స్థానాలు దిగువకు పడిపోయింది భారత్​. పౌర స్వేచ్ఛకు విఘాతం కలగడమే ఇందుకు ప్రధాన కారణమని ది ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ పేర్కొంది. 2018లో 7.23గా ఉన్న భారత్​ స్కోరు.. 2019లో 6.90కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా 165 స్వతంత్ర రాష్ట్రాలు, రెండు టెరిటరీల్లో ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితుల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ, బహుత్వవాదం, ప్రభుత్వ పనితీరు, రాజకీయ సంస్కృతి, పౌర స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణినలోకి తీసుకున్నారు.

ఫ్లాడ్​ డెమొక్రసీ...

ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా ఉన్న దేశాలకు స్కోరు 8గా ఇస్తారు. ప్రజాస్వామ్యంలో లోపం(ఫ్లాడ్​ డెమొక్రసీ)కు 6-8 మధ్యలో స్కోరు ఇస్తారు. ఒక్కోసారి 8 కూడా ఇచ్చే అవకాశముంది. హైబ్రీడ్​ రెజీమ్​(పాలన)కు 4-6 స్కోరు ఇస్తారు. అథారిటేరియన్​ రెజీమ్​కు 4కు కన్నా తక్కువ స్కోరు ఇస్తారు. ప్రస్తుతం భారత్​ ఫ్లాడ్​ డెమొక్రసీలో ఉంది.

చైనా(153 ర్యాంకు- స్కోర్​ 2.26), పాకిస్థాన్​(108 ర్యాంకు- స్కోర్​ 4.25), శ్రీలంక(69 ర్యాంకు, 6.27), బంగ్లాదేశ్​ (80 ర్యాంకు- 5.88 స్కోరు)గా ఉన్నాయి. నార్వే, ఐస్​లాండ్​, స్వీడన్​కు తొలి మూడు స్థానాలు దక్కాయి. అట్టడుగున స్థానం(167)లో ఉత్తర కొరియా నిలిచింది.

కాంగ్రెస్​ ఫైర్​...

ప్రజాస్వామ్య సూచీలో భారత్​ 10 స్థానాలు కోల్పోవడంపై కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణం భాజపా పాలనేనని ఆరోపించింది. ప్రజాస్వామ్య విలువలను కాషాయ పార్టీ నాశనం చేయడంలో విజయం సాధించిందని ట్వీట్​ చేసింది.

india-falls-to-51st-position-in-eius-democracy-index
కాంగ్రెస్​ ట్వీట్​
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: London, UK. 22nd January, 2020.
++SHOTLIST TO FOLLOW++
SOURCE: SNTV
DURATION: 02:23
STORYLINE:
Last Updated : Feb 18, 2020, 1:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.