ETV Bharat / bharat

48 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబాన్ని కలిపిన 'ఫేస్​బుక్'

author img

By

Published : Jan 21, 2020, 11:23 AM IST

Updated : Feb 17, 2020, 8:25 PM IST

ఒక్క ఫేస్​బుక్ వీడియోతో.. 48 ఏళ్ల క్రితం విడిపోయిన బంగ్లాదేశ్​లోని ఓ కుటుంబం ఎట్టకేలకు ఒక్కటైంది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి..

fb-video-reunites-bdeshi-man-with-family-after-48-yrs
48 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబాన్ని కలిపిన 'ఫేస్​బుక్'

48 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన హబీబర్​ అనే వృద్ధుడు.. ఫేస్​బుక్ పుణ్యమా అని తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. బంగ్లాదేశ్ బజ్​గ్రామ్​లో ఇనుప కడ్డీలు, సిమెంట్​ వ్యాపారం చేసుకునే ​హబీబర్​.. 30 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇల్లు వదిలి వెళ్లాడు.. అయితే ఏళ్లు గడిచినా.. తిరిగి ఇంటికి రాకపోయేసరికి.. కంగారు పడిన కుటుంబసభ్యలు ఆయన కోసం వెతకని చోటంటూ లేదు. కానీ, ఫలితం మాత్రం లేకపోయింది.

ఒక్క వీడియోతో ఒక్కటయ్యే..

అయితే, ఇటీవల ఓ వృద్ధుడి చికిత్సకు ఆర్థిక సాయం కోరుతూ.. వీడియో పోస్ట్​ చేశాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. ఆ వీడియోను చూసిన హబీబర్​ పెద్ద కుమారుడి భార్యకు.. ఆ ఆసుపత్రిలో ఉన్నది తన మామయ్యే అయ్యి ఉంటాడని అనుమానం వచ్చింది. వెంటనే ఈ వీడియో గురించి కుటుంబసభ్యలతో పంచుకుంది.

ఈ వీడియో చూసిన హబీబర్​ కుమారులు ఆసుపత్రికి వెళ్లారు. ఇంకేముంది హబీబర్​ కోడలి అనుమానం నిజమైంది.. చికిత్స పొందుతున్న వ్యక్తి మరెవరో కాదు వారి తండ్రే అని తెలిసింది.

ఇన్నాళ్లు ఏమైపోయావని అడినప్పుడు.. గత 25 ఏళ్లుగా మౌల్విబజార్​లోని రాయోస్సరీ​కి చెందిన​ రజియా బేగం కుటుంబంతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు హబీబర్​. 1995లో హజ్రత్​ సాహబుద్దీన్​ తీర్థంలో హబీబర్​ తమ కుటుంబాన్ని కలిశాడనీ, అతడిని తాము పీర్​ అని పిలుస్తూ గౌరవంగా చూసుకుంటామని తెలిపింది రజియా.

ఏదైతేనేం... దాదాపు అర్ధ శతాబ్దం తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోయిన తండ్రి వృద్ధాప్యంలో మళ్లీ కలిసినందుకు ఎంతో సంతోషించారు హబీబర్​ కుమారులు. ప్రస్తుతం ఆయన​ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

'మా అమ్మ, మామయ్యలు నాన్నను వెతికేందుకు ఎంతగా ప్రయత్నించారో నాకు ఇంకా గుర్తుంది. మా అమ్మ 20 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఇప్పుడు మా నాన్న కలిశాడు' అంటూ కంటతడి పెట్టుకున్నారు ఆ సోదరులు.

ఇదీ చదవండి: ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!

48 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన హబీబర్​ అనే వృద్ధుడు.. ఫేస్​బుక్ పుణ్యమా అని తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. బంగ్లాదేశ్ బజ్​గ్రామ్​లో ఇనుప కడ్డీలు, సిమెంట్​ వ్యాపారం చేసుకునే ​హబీబర్​.. 30 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇల్లు వదిలి వెళ్లాడు.. అయితే ఏళ్లు గడిచినా.. తిరిగి ఇంటికి రాకపోయేసరికి.. కంగారు పడిన కుటుంబసభ్యలు ఆయన కోసం వెతకని చోటంటూ లేదు. కానీ, ఫలితం మాత్రం లేకపోయింది.

ఒక్క వీడియోతో ఒక్కటయ్యే..

అయితే, ఇటీవల ఓ వృద్ధుడి చికిత్సకు ఆర్థిక సాయం కోరుతూ.. వీడియో పోస్ట్​ చేశాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. ఆ వీడియోను చూసిన హబీబర్​ పెద్ద కుమారుడి భార్యకు.. ఆ ఆసుపత్రిలో ఉన్నది తన మామయ్యే అయ్యి ఉంటాడని అనుమానం వచ్చింది. వెంటనే ఈ వీడియో గురించి కుటుంబసభ్యలతో పంచుకుంది.

ఈ వీడియో చూసిన హబీబర్​ కుమారులు ఆసుపత్రికి వెళ్లారు. ఇంకేముంది హబీబర్​ కోడలి అనుమానం నిజమైంది.. చికిత్స పొందుతున్న వ్యక్తి మరెవరో కాదు వారి తండ్రే అని తెలిసింది.

ఇన్నాళ్లు ఏమైపోయావని అడినప్పుడు.. గత 25 ఏళ్లుగా మౌల్విబజార్​లోని రాయోస్సరీ​కి చెందిన​ రజియా బేగం కుటుంబంతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు హబీబర్​. 1995లో హజ్రత్​ సాహబుద్దీన్​ తీర్థంలో హబీబర్​ తమ కుటుంబాన్ని కలిశాడనీ, అతడిని తాము పీర్​ అని పిలుస్తూ గౌరవంగా చూసుకుంటామని తెలిపింది రజియా.

ఏదైతేనేం... దాదాపు అర్ధ శతాబ్దం తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోయిన తండ్రి వృద్ధాప్యంలో మళ్లీ కలిసినందుకు ఎంతో సంతోషించారు హబీబర్​ కుమారులు. ప్రస్తుతం ఆయన​ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

'మా అమ్మ, మామయ్యలు నాన్నను వెతికేందుకు ఎంతగా ప్రయత్నించారో నాకు ఇంకా గుర్తుంది. మా అమ్మ 20 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఇప్పుడు మా నాన్న కలిశాడు' అంటూ కంటతడి పెట్టుకున్నారు ఆ సోదరులు.

ఇదీ చదవండి: ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!

Intro:Body:

Blank


Conclusion:
Last Updated : Feb 17, 2020, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.