ETV Bharat / bharat

'మహా' పరీక్షకు ముందే ఫడణవీస్​ 'మిడిల్​ డ్రాప్​'

author img

By

Published : Nov 26, 2019, 4:25 PM IST

Updated : Nov 26, 2019, 7:14 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడణవీస్​ రాజీనామా చేశారు. బలపరీక్షకు సరిపడా సంఖ్యా బలం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకు ముందే ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్​ పవార్ రాజీనామా చేశారు.

Devendra Fadnavis resigns as the Chief Minister of Maharashtra.
మూణ్నాళ్ల ముచ్చటగా 'దేవేంద్ర 2.0'- సీఎం పదవికి రాజీనామా
'మహా' పరీక్షకు ముందే ఫడణవీస్​ 'మిడిల్​ డ్రాప్​'

మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన భారతీయ జనతాపార్టీ సంతోషం.. ముణ్నాళ్లకే ముగిసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేశారు.

ముంబయిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో అజిత్ పవార్​ కూటమి నుంచి వైదొలగినందున తమ వద్ద ప్రభుత్వానికి సరిపడా సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. ఎన్​సీపీ ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అజిత్​ పవార్​ ఆయనకు చెప్పినట్లు తెలిపారు ఫడణవీస్​.

శివసేనపై తీవ్ర విమర్శలు

శివసేనపై తీవ్ర విమర్శలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. ముఖ్యమంత్రి పదవి కోసం తమను బెదిరించిందని.. అధికారం దాహంతోనే కాంగ్రెస్​తో చేతులు కలిపి సోనియా గాంధీ పేరున ప్రతిజ్ఞ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుక వినిపిస్తుందని ప్రకటించారు.

"ప్రజలు మహాకూటమి(భాజపా-శివసేన)కే పట్టం కట్టారు. భాజపాకు అత్యధికంగా 105 సీట్లు వచ్చాయి. కూటమి విజయం భాజపా కారణంగా వచ్చిందే. ఎందుకంటే భాజపా పోటీ చేసిన 70శాతం స్థానాల్లో గెలిచింది. ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇస్తే వారితో కలుస్తామని శివసేన మాకు ఎన్నికల ఫలితాల ముందే చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తుందని చాలా కాలం వేచి చూశాం. కానీ వారు ఎన్​సీపీ-కాంగ్రెస్​తో చర్చలు జరిపారు. మాతోశ్రీ(ఠాక్రేల అధికారిక నివాసం) దాటి బయటకు రాని వారు ఎన్​సీపీ, కాంగ్రెస్​తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గడపగడపకూ తిరుగుతున్నారు."
-దేవేంద్ర ఫడణవీస్


సుప్రీం తీర్పు నేపథ్యంలో..

అజిత్​ పవార్​తో కలిసి గత శనివారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఫడణవీస్​. అయితే భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన-కాంగ్రెస్​-ఎన్​సీపీ వేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం..​ రేపటిలోపు శాసనసభలో బలపరీక్ష ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ పదవులకు ఫడణవీస్​, అజిత్ పవార్​ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో శివసేన, కాంగ్రెస్‌, ఎన్​సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

'మహా' పరీక్షకు ముందే ఫడణవీస్​ 'మిడిల్​ డ్రాప్​'

మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన భారతీయ జనతాపార్టీ సంతోషం.. ముణ్నాళ్లకే ముగిసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేశారు.

ముంబయిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో అజిత్ పవార్​ కూటమి నుంచి వైదొలగినందున తమ వద్ద ప్రభుత్వానికి సరిపడా సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. ఎన్​సీపీ ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అజిత్​ పవార్​ ఆయనకు చెప్పినట్లు తెలిపారు ఫడణవీస్​.

శివసేనపై తీవ్ర విమర్శలు

శివసేనపై తీవ్ర విమర్శలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. ముఖ్యమంత్రి పదవి కోసం తమను బెదిరించిందని.. అధికారం దాహంతోనే కాంగ్రెస్​తో చేతులు కలిపి సోనియా గాంధీ పేరున ప్రతిజ్ఞ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుక వినిపిస్తుందని ప్రకటించారు.

"ప్రజలు మహాకూటమి(భాజపా-శివసేన)కే పట్టం కట్టారు. భాజపాకు అత్యధికంగా 105 సీట్లు వచ్చాయి. కూటమి విజయం భాజపా కారణంగా వచ్చిందే. ఎందుకంటే భాజపా పోటీ చేసిన 70శాతం స్థానాల్లో గెలిచింది. ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇస్తే వారితో కలుస్తామని శివసేన మాకు ఎన్నికల ఫలితాల ముందే చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తుందని చాలా కాలం వేచి చూశాం. కానీ వారు ఎన్​సీపీ-కాంగ్రెస్​తో చర్చలు జరిపారు. మాతోశ్రీ(ఠాక్రేల అధికారిక నివాసం) దాటి బయటకు రాని వారు ఎన్​సీపీ, కాంగ్రెస్​తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గడపగడపకూ తిరుగుతున్నారు."
-దేవేంద్ర ఫడణవీస్


సుప్రీం తీర్పు నేపథ్యంలో..

అజిత్​ పవార్​తో కలిసి గత శనివారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఫడణవీస్​. అయితే భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన-కాంగ్రెస్​-ఎన్​సీపీ వేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం..​ రేపటిలోపు శాసనసభలో బలపరీక్ష ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ పదవులకు ఫడణవీస్​, అజిత్ పవార్​ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో శివసేన, కాంగ్రెస్‌, ఎన్​సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

AP Video Delivery Log - 1000 GMT News
Tuesday, 26 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0849: South Korea ASEAN 3 AP Clients Only 4241838
ASEAN leaders agree on Korean Peninsula proposals
AP-APTN-0810: Albania Earthquake Body AP Clients Only 4241834
Body removed from rubble after earthquake
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 26, 2019, 7:14 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.