ETV Bharat / bharat

ఔదార్యం: 37 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..!

author img

By

Published : Oct 28, 2019, 9:03 PM IST

మృతదేహమనగానే మనలో కొంతమంది చూసేందుకే భయపడతారు. అలాంటిది 37 ఏళ్లుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నాడో వ్యక్తి. ఈ కార్యక్రమాన్ని తన సొంత ఖర్చుతో చేపడుతున్నాడు.

ఔదార్యం: 37 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..!
37 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..!

ఆస్తి పంపకాల్లో గొడవలతో కన్నవాళ్లనే ఆనాథలుగా గాలికొదిలేస్తున్నటువంటి ఘటనలు వింటూనే ఉన్నాం. నిండు వృద్ధాప్యంలో ప్రాణాలు విడిచినా.. మానవత్వం మరిచి అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా వదిలేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆత్మహత్యలు.. ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనల్లో మరణించిన వారి పరిస్థితి మరింత దయనీయం. కేరళకు చెందిన ఓ మానవతామూర్తి మాత్రం అలాంటివారికి గౌరవప్రదంగా తుది వీడ్కోలు పలకడాన్ని పవిత్ర కార్యంగా భావిస్తున్నాడు. 37 ఏళ్లుగా ఈ పుణ్యకార్యాన్ని నిర్వహిస్తున్నాడు.

కాలువలు, చెరువుల్లో పడి ఉన్న శవాలను వెలికి తీస్తున్న ఈయన పేరు... అబ్దుల్ అజీజ్. కేరళలోని కోజికోడ్‌ జిల్లా ఒలవన్నా గ్రామానికి చెందిన ఈయన వయసు.... 54 ఏళ్లు. గత 37 ఏళ్లుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అజీజ్. నదిలో పడ్డ ఓ చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆయన ప్రయత్నానికి పలువురి ప్రశంసలు దక్కాయి. ఇక అప్పటి నుంచి అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేస్తూ... వారికి గౌరవంగా తుదివీడ్కోలు పలుకుతున్నాడు.

3 వేలకు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు..

పట్టణంలో గుర్తు తెలియని శవం కనిపిస్తే పోలీసులు అజీజ్​కే సమాచారం అందిస్తారు. ఆయన సహాయం లేకుండా పంచనామా నిర్వహించడం కూడా వారికి కష్టం. కుళ్లిన మృతదేహాలను సేకరించే సమయంలోనూ మాస్కులు ధరించడు. అలాంటి శవాలకు అంత్యక్రియలు పూర్తిచేయడం ద్వారా పవిత్రత చేకూరుతుందని అజీజ్ విశ్వాసం.

ఇతరుల సహాయం లేకుండానే ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు అజీజ్​. ఇప్పటి వరకూ 3, 117 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేశాడు. మరణించిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంలోనే సంతృప్తి ఉందని తన సహృదయం ద్వారా చాటుతున్నాడు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ అజీజ్​ తన సేవాగుణాన్ని చాటుకున్నాడు.

ఇదీ చూడండి: పదేళ్లలో 3700 మందిని హతమార్చిన మావోయిస్టు​లు

37 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..!

ఆస్తి పంపకాల్లో గొడవలతో కన్నవాళ్లనే ఆనాథలుగా గాలికొదిలేస్తున్నటువంటి ఘటనలు వింటూనే ఉన్నాం. నిండు వృద్ధాప్యంలో ప్రాణాలు విడిచినా.. మానవత్వం మరిచి అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా వదిలేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆత్మహత్యలు.. ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనల్లో మరణించిన వారి పరిస్థితి మరింత దయనీయం. కేరళకు చెందిన ఓ మానవతామూర్తి మాత్రం అలాంటివారికి గౌరవప్రదంగా తుది వీడ్కోలు పలకడాన్ని పవిత్ర కార్యంగా భావిస్తున్నాడు. 37 ఏళ్లుగా ఈ పుణ్యకార్యాన్ని నిర్వహిస్తున్నాడు.

కాలువలు, చెరువుల్లో పడి ఉన్న శవాలను వెలికి తీస్తున్న ఈయన పేరు... అబ్దుల్ అజీజ్. కేరళలోని కోజికోడ్‌ జిల్లా ఒలవన్నా గ్రామానికి చెందిన ఈయన వయసు.... 54 ఏళ్లు. గత 37 ఏళ్లుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అజీజ్. నదిలో పడ్డ ఓ చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆయన ప్రయత్నానికి పలువురి ప్రశంసలు దక్కాయి. ఇక అప్పటి నుంచి అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేస్తూ... వారికి గౌరవంగా తుదివీడ్కోలు పలుకుతున్నాడు.

3 వేలకు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు..

పట్టణంలో గుర్తు తెలియని శవం కనిపిస్తే పోలీసులు అజీజ్​కే సమాచారం అందిస్తారు. ఆయన సహాయం లేకుండా పంచనామా నిర్వహించడం కూడా వారికి కష్టం. కుళ్లిన మృతదేహాలను సేకరించే సమయంలోనూ మాస్కులు ధరించడు. అలాంటి శవాలకు అంత్యక్రియలు పూర్తిచేయడం ద్వారా పవిత్రత చేకూరుతుందని అజీజ్ విశ్వాసం.

ఇతరుల సహాయం లేకుండానే ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు అజీజ్​. ఇప్పటి వరకూ 3, 117 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేశాడు. మరణించిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంలోనే సంతృప్తి ఉందని తన సహృదయం ద్వారా చాటుతున్నాడు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ అజీజ్​ తన సేవాగుణాన్ని చాటుకున్నాడు.

ఇదీ చూడండి: పదేళ్లలో 3700 మందిని హతమార్చిన మావోయిస్టు​లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 28 October 2019
1. UK Prime Minister Boris Johnson outside 10 Downing Street, UPSOUND (English) "Ok everybody, buy a poppy for poppy day" and posing for photographs before returning inside  
STORYLINE:
UK Prime Minister Boris Johnson appeared on the steps of 10 Downing Street in London on Monday as it emerged European Council President Donald Tusk said the bloc agreed to delay Brexit until January 31.
The prime minister posed for photographs as he told the public to buy a poppy for the 100th anniversary of Armistice Day, which takes place in Britain on the 11th November.
It came as Tusk announced on Twitter "the EU 27 has agreed that it will accept the UK's request for a Brexit flextension (...). The decision is expected to be formalized through a written procedure."
European Union diplomats met in Brussels to sign off on the new delay to Britain's departure from the bloc, which had been due in just three days on October 31.
It's the second time the Brexit deadline has been changed since the 2016 referendum on Britain's departure from the EU.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.