ETV Bharat / bharat

హత్య కేసు నిందితుడి చెరలో 20మంది చిన్నారులు!​

author img

By

Published : Jan 30, 2020, 11:11 PM IST

Updated : Feb 28, 2020, 2:24 PM IST

ఉత్తరప్రదేశ్​లోని ఫరూఖాబాద్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ హత్య కేసు నిందితుడు.. 20 మంది చిన్నారులను నిర్బంధించాడు. అడ్డుకునేందుకు యత్నించిన గ్రామస్థులపై కాల్పులు జరిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడి చెర నుంచి చిన్నారులను రక్షించడానికి చర్యలు ముమ్మరం చేశారు.

a-man-makes-hostage-more-than-12-children-inside-house-and-started-firing-in-farrukhabad
హత్యాచార కేసు దోషి చెరలో 20మంది చిన్నారులు!​

హత్య కేసు దోషి చెరలో 20మంది చిన్నారులు!​

జన్మదిన వేడుకల పేరుతో ఓ వ్యక్తి 20మంది చిన్నారులను నిర్బంధించాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఫరూఖాబాద్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడు కావడం స్థానికులను తీవ్ర ఆందోళనకు ​గురిచేస్తోంది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్​ ఆరా తీశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

a-man-makes-hostage-more-than-12-children-inside-house-and-started-firing-in-farrukhabad
ఉత్తరప్రదేశ్​లోని ఫరూఖాబాద్​లో దారుణం

ఇదీ జరిగింది...

సుభాశ్​ బాథమ్​... ఓ హత్య కేసులో నిందితుడు. కథారియా గ్రామంలో జన్మదిన వేడుకల పేరుతో చిన్నారులను పిలిచాడు. అనంతరం వారిని ఓ ఇంట్లో నిర్బంధించాడు. గ్రామస్థులకు కొంత సేపటి తర్వాత ఆ ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన వారిపై అతడు కాల్పులు జరిపాడు.

a-man-makes-hostage-more-than-12-children-inside-house-and-started-firing-in-farrukhabad
ఇంటి సమీపంలో

గ్రామస్థులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సుభాశ్​ మానసిక స్థితి సరిగా లేదని స్పష్టం చేశారు.

"చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేక పోలీసు దళం, స్పెషల్​ ఆపరేషన్​ గ్రూప్​, ఉగ్రవాద నిరోధక బృందం రంగంలోకి దిగాయి."
--- పీవీ రామశాస్త్రి, ఏడీజీ.

లోపల ఉన్న వ్యక్తి ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. తొలుత స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పినట్టు అధికారులు వివరించారు. కానీ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. సుభాశ్​ చెర నుంచి చిన్నారులను రక్షించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

a-man-makes-hostage-more-than-12-children-inside-house-and-started-firing-in-farrukhabad
స్థానిక ఎమ్మెల్యే

హత్య కేసు దోషి చెరలో 20మంది చిన్నారులు!​

జన్మదిన వేడుకల పేరుతో ఓ వ్యక్తి 20మంది చిన్నారులను నిర్బంధించాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఫరూఖాబాద్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడు కావడం స్థానికులను తీవ్ర ఆందోళనకు ​గురిచేస్తోంది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్​ ఆరా తీశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

a-man-makes-hostage-more-than-12-children-inside-house-and-started-firing-in-farrukhabad
ఉత్తరప్రదేశ్​లోని ఫరూఖాబాద్​లో దారుణం

ఇదీ జరిగింది...

సుభాశ్​ బాథమ్​... ఓ హత్య కేసులో నిందితుడు. కథారియా గ్రామంలో జన్మదిన వేడుకల పేరుతో చిన్నారులను పిలిచాడు. అనంతరం వారిని ఓ ఇంట్లో నిర్బంధించాడు. గ్రామస్థులకు కొంత సేపటి తర్వాత ఆ ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన వారిపై అతడు కాల్పులు జరిపాడు.

a-man-makes-hostage-more-than-12-children-inside-house-and-started-firing-in-farrukhabad
ఇంటి సమీపంలో

గ్రామస్థులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సుభాశ్​ మానసిక స్థితి సరిగా లేదని స్పష్టం చేశారు.

"చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేక పోలీసు దళం, స్పెషల్​ ఆపరేషన్​ గ్రూప్​, ఉగ్రవాద నిరోధక బృందం రంగంలోకి దిగాయి."
--- పీవీ రామశాస్త్రి, ఏడీజీ.

లోపల ఉన్న వ్యక్తి ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. తొలుత స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పినట్టు అధికారులు వివరించారు. కానీ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. సుభాశ్​ చెర నుంచి చిన్నారులను రక్షించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

a-man-makes-hostage-more-than-12-children-inside-house-and-started-firing-in-farrukhabad
స్థానిక ఎమ్మెల్యే
Intro:Body:

फर्रुखाबाद


Conclusion:
Last Updated : Feb 28, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.