కర్ణాటక సాంస్కృతిక నగరం మైసూర్లో ప్రపంచ అద్భుతాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కేకుతోనే ప్రపంచంలోని ఏడు వింతలను తయారు చేశారు డాల్ఫిన్ బేకర్స్.
సృజనాత్మకత జోడించి ప్రపంచ వింతలతో అందంగా తయారు చేసిన కేకులు.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తాజ్మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, జోర్డాన్లోని పెట్రా, ఈజిప్టులోని చించెన్ ఇట్జా పిరమిడ్, పెరూలోని మాచుపిచ్చూ, బ్రెజిల్లోని క్రీస్ట్ ద రిడీమర్, ఇటలీలోని కొలొజియం అన్నింటినీ ఒకే చోట కేకులతో సృష్టించేశారు.
మైసూర్ మహారాజా కళాశాల మైదానంలో ఇవి తయారు చేసి ప్రదర్శనకు పెట్టారు. వీటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే, ఇవి కేవలం ప్రదర్శించడం కోసం మాత్రమే.. అనేక రసాయనిక రంగులు వాడి తయారు చేశారు కాబట్టి ఇవి తినేందుకు పనికిరావంటున్నారు నిర్వాహకులు.
ఇదీ చదవండి:న్యూఇయర్కు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ఇచ్చిన సునీల్!