ETV Bharat / bharat

60 ఏళ్ల వయసులో బైక్​పై భారత్​​ యాత్ర- కారణం అద్భుతం!

author img

By

Published : Jan 30, 2020, 3:34 PM IST

Updated : Feb 28, 2020, 1:15 PM IST

అవయవ దానంపై అవగాహన కల్పించాలనేదే ఆయన సంకల్పం. మరి దానికి వయసుతో సంబంధం ఏమిటి? అందుకే.. 60 ఏళ్ల  వయసులో బండేసుకుని బయల్దేరారు. 132 రోజుల్లో 23 రాష్ట్రాలు చుట్టేశారు.

60 years oldman a noble mission on wheels BOY-2.0 for creating awareness on organ donation in karnataka
60 ఏళ్ల వయసులో బైక్​పై భారత్​​ యాత్ర- కారణం అద్భుతం!
60 ఏళ్ల వయసులో బైక్​పై భారత్​​ యాత్ర- కారణం అద్భుతం!

'60 ఏళ్లు వచ్చేశాయి.. బాధ్యతలన్నీ దాదాపు తీరిపోయాయి.. ఇక హాయిగా కృష్ణా రామా అంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు' అని అనుకునే వృద్ధులకు పూర్తి భిన్నం మహారాష్ట్ర సంగ్లీకి చెందిన ప్రమోద్​ లక్ష్మణ్​ మహాజన్. అందుకే, ఆరు పదుల వయసును లెక్కచేయకుండా.. మోటర్ సైకిల్​ యాత్ర చేపట్టారు. దేశమంతా తిరిగి అవయవ దానం గురించి వివరిస్తూ.. చనిపోయాక కూడా బతికే ఉండాలని పిలుపునిస్తున్నారు. బ్రెయిన్​డెడ్​ అయినవారి శరీరం నుంచి 8 అవయవాలను దానం చేసి 8 మంది ప్రాణాలు కాపాడగలమని చెబుతున్నారు మహాజన్​.

19 ఏళ్లుగా ఒక కిడ్నీతో..

ఇప్పటివరకు 23 రాష్ట్రాల మీదగా సాగింది మహాజన్​ యాత్ర. అయితే, ఇలా ప్రచారం చేసేవారంతా మాటలకే పరిమితమని, పరులకు హితబోధ చేసేవారు సొంత అవయవాలు దానం చేయలేరనే అపనమ్మకాన్ని కొట్టిపారేశారు మహాజన్​. దాదాపు 2 దశాబ్దాల క్రితమే.. తన మూత్రపిండం దానం చేసి ఓ జవాను ప్రాణాలు నిలిపారు ఈ సమాజ సేవకుడు.

"2000 సంవత్సరంలో కిడ్నీ దానం చేశాను. సుమారు 19 ఏళ్లు గడిచిపోయాయి. ఒక్క కిడ్నీతోనే నేను భారత దేశమంతా బైక్​పైనే తిరుగుతున్నాను. అవయవ దానాల పట్ల ఏవైనా అపోహలుంటే, ప్రజల మదిలోని ప్రశ్నలుంటే అవి తీర్చేస్తున్నాను. ఎవరైనా బ్రెయిన్ డెడ్​ అయితే.. తిరిగి కోలుకునే అవకాశాలు దాదాపు ఉండవు. కాబట్టి అలాంటివారి అవయవాలు దానం చేయడం చాలా ముఖ్యం. ఇవి చెప్పడానికే నేను యాత్ర చేపట్టాను."
- ప్రమోద్​ లక్ష్మణ్​ మహాజన్

ఇప్పుడు 2.0తో..

గతేడాది ఇదే సంకల్పంతో 100 రోజుల భారత్​ ఆర్గాన్​ యాత్ర(బాయ్​) చేపట్టారు మహాజన్​. 19 రాష్ట్రాల్లో 17 వేల కిలోమీటర్లు ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు.

ఇప్పుడు బాయ్​ 2.0 పేరుతో మరోసారి యాత్ర చేపట్టారు. 25 రాష్ట్రాల్లో అవయవ దానం ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుతం కర్ణాటక చేరుకున్నారు.

ఇదీ చదవండి:పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?

60 ఏళ్ల వయసులో బైక్​పై భారత్​​ యాత్ర- కారణం అద్భుతం!

'60 ఏళ్లు వచ్చేశాయి.. బాధ్యతలన్నీ దాదాపు తీరిపోయాయి.. ఇక హాయిగా కృష్ణా రామా అంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు' అని అనుకునే వృద్ధులకు పూర్తి భిన్నం మహారాష్ట్ర సంగ్లీకి చెందిన ప్రమోద్​ లక్ష్మణ్​ మహాజన్. అందుకే, ఆరు పదుల వయసును లెక్కచేయకుండా.. మోటర్ సైకిల్​ యాత్ర చేపట్టారు. దేశమంతా తిరిగి అవయవ దానం గురించి వివరిస్తూ.. చనిపోయాక కూడా బతికే ఉండాలని పిలుపునిస్తున్నారు. బ్రెయిన్​డెడ్​ అయినవారి శరీరం నుంచి 8 అవయవాలను దానం చేసి 8 మంది ప్రాణాలు కాపాడగలమని చెబుతున్నారు మహాజన్​.

19 ఏళ్లుగా ఒక కిడ్నీతో..

ఇప్పటివరకు 23 రాష్ట్రాల మీదగా సాగింది మహాజన్​ యాత్ర. అయితే, ఇలా ప్రచారం చేసేవారంతా మాటలకే పరిమితమని, పరులకు హితబోధ చేసేవారు సొంత అవయవాలు దానం చేయలేరనే అపనమ్మకాన్ని కొట్టిపారేశారు మహాజన్​. దాదాపు 2 దశాబ్దాల క్రితమే.. తన మూత్రపిండం దానం చేసి ఓ జవాను ప్రాణాలు నిలిపారు ఈ సమాజ సేవకుడు.

"2000 సంవత్సరంలో కిడ్నీ దానం చేశాను. సుమారు 19 ఏళ్లు గడిచిపోయాయి. ఒక్క కిడ్నీతోనే నేను భారత దేశమంతా బైక్​పైనే తిరుగుతున్నాను. అవయవ దానాల పట్ల ఏవైనా అపోహలుంటే, ప్రజల మదిలోని ప్రశ్నలుంటే అవి తీర్చేస్తున్నాను. ఎవరైనా బ్రెయిన్ డెడ్​ అయితే.. తిరిగి కోలుకునే అవకాశాలు దాదాపు ఉండవు. కాబట్టి అలాంటివారి అవయవాలు దానం చేయడం చాలా ముఖ్యం. ఇవి చెప్పడానికే నేను యాత్ర చేపట్టాను."
- ప్రమోద్​ లక్ష్మణ్​ మహాజన్

ఇప్పుడు 2.0తో..

గతేడాది ఇదే సంకల్పంతో 100 రోజుల భారత్​ ఆర్గాన్​ యాత్ర(బాయ్​) చేపట్టారు మహాజన్​. 19 రాష్ట్రాల్లో 17 వేల కిలోమీటర్లు ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు.

ఇప్పుడు బాయ్​ 2.0 పేరుతో మరోసారి యాత్ర చేపట్టారు. 25 రాష్ట్రాల్లో అవయవ దానం ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుతం కర్ణాటక చేరుకున్నారు.

ఇదీ చదవండి:పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?

Intro:Body:

On a noble mission on wheels



He is a 68-year-old man. He could have sat at home and taken rest in this falling age. But he is on a mission on his bike all over the country creating awareness on organ donation. Meet Pramod Lakshman Mahajan who is a fountain of enthusiasm and determined to popularise the significance of organ donation among the school, college students and masses.



Mahajan, who hails from Sangli in Maharashtra, himself donated a kidney to save the life of a soldier at his native place 18 years ago. He says his health is fine since then and organ donation is indeed noble as it saves a life. So far, he has travelled in 23 states for over 132 days alone creating awareness in this regard.



Byte: Pramod Lakshman Mahajan



Organ donation does not affect the donor in any way. It is a myth that health will be affected if an organ is donated. A man can donate eight organs and the save the lives of eight people even if his mind becomes inactive, he says.



Byte: Sathyanarayan Patil, 99 Cannons Club member



Mahajan’s effort has received a positive response from the people all over. When aged people are spending time thinking about their own vagaries, men like Mahajan, come across are as a beacon of light working for a noble cause.


Conclusion:
Last Updated : Feb 28, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.