ETV Bharat / bharat

ఐదేళ్ల బాలిక అత్యాచారం కేసులో ఆరేళ్ల తర్వాత తీర్పు

దిల్లీలో 2013 నాటి బాలిక అత్యాచార కేసులో పోక్సో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. మైనర్లను దేవతలుగా భావించే మన సమాజంలో కేవలం ఐదేళ్ల బాలిక తీవ్రమైన క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని అనుభవించిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. జనవరి 30న శిక్షపై వాదనలు విననున్నట్లు తెలిపింది. మరోవైపు కోర్టు నిర్ణయం అనంతరం బయటకు వచ్చే క్రమంలో దోషుల్లో ఒకరు మీడియాపై దాడికి పాల్పడ్డాడు.

author img

By

Published : Jan 18, 2020, 5:38 PM IST

2 convicted for raping 5-year-old girl in Delhi in 2013
దిల్లీ: బాలిక అత్యాచారం కేసులో ఇద్దర్ని దోషులుగా తేల్చిన కోర్టు

2013లో దిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక కేసులో పోక్సో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అదనపు సెషన్స్​ న్యాయమూర్తి నరేష్ కుమార్ మల్హోత్రా... నిందితులు ప్రదీప్ కుమార్, మనోజ్ షాలను దోషులుగా ప్రకటించారు. బాలిక తీవ్ర క్రూరత్వాన్ని అనుభవించిందని వ్యాఖ్యానించారు.

"సమాజ సామూహిక మనస్సాక్షిని ఈ ఘటన కదిలించింది. మన సమాజంలో మైనర్లను దేవతలుగా భావిస్తాం. కేవలం ఐదేళ్లున్న బాలిక తీవ్రమైన క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని అనుభవించింది."-న్యాయస్థానం

57 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఐదేళ్లకు పైగా సమయం పట్టిందని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. దోషులకు విధించే శిక్షకు సంబంధించి జనవరి 30న వాదనలు విననున్నట్లు తెలిపింది.

'న్యాయం జరిగింది'

కోర్టు తీర్పు పట్ల బాలిక తండ్రి హర్షం వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగిందన్నారు. రెండేళ్లలో ట్రయల్స్ పూర్తికావాల్సి ఉండేదని... చివరకు ఆరేళ్లకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు.

మీడియాపై దాడి

దిల్లీ కోర్టు నిర్ణయం అనంతరం బయటకు వచ్చే క్రమంలో దోషుల్లో ఒకడు మీడియాపై దాడికి పాల్పడ్డాడు. విలేకరి మొబైల్ ఫోన్​ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో అధికారులు దోషుల్ని నిలువరించారు.

మీడియాపై దాడి చేస్తున్న దృశ్యాలు

బాలికపై క్రూరత్వం

2013 ఏప్రిల్ 15న గాంధీ నగర్​ ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై ప్రదీప్ కుమార్, మనోజ్ షాలు కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక శరీరంలోని రహస్య భాగాలలో వస్తువులను చొప్పించి నరకయాతనకు గురిచేశారు. చివరకు బాలిక మరణించిందని భావించి మనోజ్ ఇంట్లోనే వదిలి వెళ్లారు. అయితే 40 గంటల తర్వాత బాలికను కాపాడారు. నిందితులను దిల్లీ పోలీసులు బిహార్​లోని ముజఫర్​పుర్, దర్భంగా ప్రాంతాల్లో 2013లో అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: అభిమానులకు శుభవార్త... ఫిబ్రవరి 8న బరిలోకి ధోనీ!

2013లో దిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక కేసులో పోక్సో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అదనపు సెషన్స్​ న్యాయమూర్తి నరేష్ కుమార్ మల్హోత్రా... నిందితులు ప్రదీప్ కుమార్, మనోజ్ షాలను దోషులుగా ప్రకటించారు. బాలిక తీవ్ర క్రూరత్వాన్ని అనుభవించిందని వ్యాఖ్యానించారు.

"సమాజ సామూహిక మనస్సాక్షిని ఈ ఘటన కదిలించింది. మన సమాజంలో మైనర్లను దేవతలుగా భావిస్తాం. కేవలం ఐదేళ్లున్న బాలిక తీవ్రమైన క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని అనుభవించింది."-న్యాయస్థానం

57 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఐదేళ్లకు పైగా సమయం పట్టిందని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. దోషులకు విధించే శిక్షకు సంబంధించి జనవరి 30న వాదనలు విననున్నట్లు తెలిపింది.

'న్యాయం జరిగింది'

కోర్టు తీర్పు పట్ల బాలిక తండ్రి హర్షం వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగిందన్నారు. రెండేళ్లలో ట్రయల్స్ పూర్తికావాల్సి ఉండేదని... చివరకు ఆరేళ్లకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు.

మీడియాపై దాడి

దిల్లీ కోర్టు నిర్ణయం అనంతరం బయటకు వచ్చే క్రమంలో దోషుల్లో ఒకడు మీడియాపై దాడికి పాల్పడ్డాడు. విలేకరి మొబైల్ ఫోన్​ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో అధికారులు దోషుల్ని నిలువరించారు.

మీడియాపై దాడి చేస్తున్న దృశ్యాలు

బాలికపై క్రూరత్వం

2013 ఏప్రిల్ 15న గాంధీ నగర్​ ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై ప్రదీప్ కుమార్, మనోజ్ షాలు కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక శరీరంలోని రహస్య భాగాలలో వస్తువులను చొప్పించి నరకయాతనకు గురిచేశారు. చివరకు బాలిక మరణించిందని భావించి మనోజ్ ఇంట్లోనే వదిలి వెళ్లారు. అయితే 40 గంటల తర్వాత బాలికను కాపాడారు. నిందితులను దిల్లీ పోలీసులు బిహార్​లోని ముజఫర్​పుర్, దర్భంగా ప్రాంతాల్లో 2013లో అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: అభిమానులకు శుభవార్త... ఫిబ్రవరి 8న బరిలోకి ధోనీ!

Intro:രണ്ടുദിവസത്തെ ആർമി മേളയ്ക്ക് മലപ്പുറത്ത് തുടക്കമായി. എംഎസ്പി ഗ്രൗണ്ടിൽ നടന്ന മേള മേജർ ജനറൽ ബാബു ഉദ്ഘാടനം ചെയ്തു. സൈനികരുടെ അഭ്യാസ പ്രകടനം കാണാൻ നിരവധി ആളുകളാണ് എത്തിയിരുന്നത്


Body:കണ്ണൂർ ഡിഫൻസ് സെക്യൂരിറ്റി ക്രോപ്സ് സെൻറർ നേതൃത്വത്തിലാണ് മലപ്പുറത്തെ രണ്ടുദിവസത്തെ നടക്കുന്ന ആർമി മേള നടക്കുന്നത്. മേളയുടെ ഭാഗമായി എംഎസ്പി ഗ്രൗണ്ടിൽ പാരാ മോട്ടോർ മിലിറ്ററി മോട്ടോർസൈക്കിൾ, ഭീകര കീഴടക്കുന്ന രീതിയിലൂടെ പ്രകടനം ബോംബ് നിർമ്മാർജ്ജനം. തുടങ്ങിയ അഭ്യാസ പ്രകടനങ്ങളും ആയുധ പ്രദർശനം തുടങ്ങിയ പരിപാടികളും അരങ്ങേറി

ഹോൾഡ്


രാജ്യത്തെ സുരക്ഷാ സേവനങ്ങളെക്കുറിച്ച് പൊതുജനങ്ങൾക്കിടയിൽ കൂടുതൽ അറിയുന്നതിനും യുവജനങ്ങളെ സുരക്ഷാ സേനയുടെ ഭാഗമാകുന്നത് പ്രോത്സാഹിപ്പിക്കുന്ന നയമാണ് മേള നടക്കുന്നത്..


ബൈറ്റ്...
ബ്രിഗേഡിയർ എ വൈ രാജൻ
ഗ്രൂപ്പ് കമാൻഡ് എൻസിസി ഗ്രൂപ്പ് കോഴിക്കോട്


കരസേനയിൽ ജോലി ആഗ്രഹിക്കുന്നത് സേനയെ പരിചയപ്പെടുത്തുന്നതിനും സേനയെ പ്രവേശിക്കാനുള്ള യോഗ്യത വിവരങ്ങൾ ശമ്പളവും മറ്റ് ആനുകൂല്യങ്ങൾ എന്നിവയും പ്രദർശനത്തിൽ സംഘടിപ്പിച്ചിട്ടുണ്ട് രണ്ടു ദിവസങ്ങളിലായി നടക്കുന്ന മേളയിൽ പ്രവേശനം സൗജന്യമാണ്


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.