ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ హైదరబాద్ పోలీసులకు సలాం కొట్టారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు.. ఆయన కళతోనే అభినందనలు తెలిపారు. హైదరాబాద్ పోలీసులు సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారని కొనియాడారు. ఒడిశా పూరీ బీచ్లో పోలీసు టోపీకి సెల్యూట్ చేస్తోన్న సైకత చిత్రాన్ని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించారు.