ETV Bharat / state

విద్యార్థులున్నా... వసతులు సున్నా..! - రాజంపేటలో కూలిపోతున్న బాలికల పాఠశాల భవనాలు న్యూస్

అక్కడ విద్యార్థుల సంఖ్య అధికం... పాఠశాల పరిస్థితి మాత్రం దారుణం. ప్రైవేటు సంస్థల ధాటికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నా.. ఈ స్కూళ్లో విద్యార్థుల సంఖ్య అస్సలు తగ్గలేదు. కానీ ఇప్పుడు భవనాలు శిథిలావస్థకు చేరాయి. మరీ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

school building collapsed in kadapa district rajampeta
author img

By

Published : Nov 20, 2019, 5:35 PM IST

విద్యార్థులున్నా... వసతులు సున్నా..!

450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల తాకిడికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో... ఇక్కడ మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. కానీ భవనాల పరిస్థితి దారుణంగా ఉంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల నిర్మించిన భవనాల్లోనే ఇరుగ్గా కాలం వెళ్లదీస్తున్నారు. ఇది కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుస్థితి.

1960 డిసెంబర్ 27న రాజంపేటలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల భవనాల పైకప్పు చెక్కలు, పెంకులతో నిర్మించారు. ప్రస్తుతం భవనాలు శిథిలావస్థకు చేరాయి. పెంకులు రోజూ ఒకటో రెండో కింద పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పెంకులు పడి విద్యార్థులు గాయపడిన సందర్భాలూ అనేకం. ధ్యాన మందిరంలో వరండా అంతా పెంకులు ఊడిపోయి... చెక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు కూర్చుండే గది వద్ద పైకప్పు పూర్తిగా దెబ్బతింది. ఉపాధ్యాయుల గది గురించి ఎంత తక్కువ చెబితే... అంత మంచిది.

ఈ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు 15 సెక్షన్లు ఉన్నాయి. గదులు మాత్రం 12 మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా పలు తరగతులు చెట్ల కిందనే సాగుతున్నాయి. వర్షం పడితే పాఠశాల ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది. ఈ పరిస్థితులను ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించినా... పరిష్కార మార్గం మాత్రం చూపడం లేదు. ప్రభుత్వం స్పందించి పాఠశాలను బాగుచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు​

విద్యార్థులున్నా... వసతులు సున్నా..!

450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల తాకిడికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో... ఇక్కడ మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. కానీ భవనాల పరిస్థితి దారుణంగా ఉంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల నిర్మించిన భవనాల్లోనే ఇరుగ్గా కాలం వెళ్లదీస్తున్నారు. ఇది కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుస్థితి.

1960 డిసెంబర్ 27న రాజంపేటలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల భవనాల పైకప్పు చెక్కలు, పెంకులతో నిర్మించారు. ప్రస్తుతం భవనాలు శిథిలావస్థకు చేరాయి. పెంకులు రోజూ ఒకటో రెండో కింద పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పెంకులు పడి విద్యార్థులు గాయపడిన సందర్భాలూ అనేకం. ధ్యాన మందిరంలో వరండా అంతా పెంకులు ఊడిపోయి... చెక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు కూర్చుండే గది వద్ద పైకప్పు పూర్తిగా దెబ్బతింది. ఉపాధ్యాయుల గది గురించి ఎంత తక్కువ చెబితే... అంత మంచిది.

ఈ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు 15 సెక్షన్లు ఉన్నాయి. గదులు మాత్రం 12 మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా పలు తరగతులు చెట్ల కిందనే సాగుతున్నాయి. వర్షం పడితే పాఠశాల ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది. ఈ పరిస్థితులను ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించినా... పరిష్కార మార్గం మాత్రం చూపడం లేదు. ప్రభుత్వం స్పందించి పాఠశాలను బాగుచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు​

Intro:Ap_cdp_46_20_VO_dayaneeyam_unnata patasala_dustiti_pkg_Ap10043
k.veerachari, 9948047582
450 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.. పాఠశాల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల తాకిడికి ప్రభుత్వ పాఠశాలలు పతనమవుతున్న వేళ ఈ పాఠశాలలో మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. అయితే ఇక్కడ భవనాల పరిస్థితి దారుణంగా ఉంది. అరవై ఏళ్ళ క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల నిర్మించిన భవనాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇది కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుస్థితి.
* 1960 డిసెంబర్ 27న ఈ పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ భవనాల పైకప్పు చెక్కలు, పెంకులతో నిర్మించారు. ప్రస్తుతం భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పెంకులు రోజూ ఒకటో రెండో కింద పడుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు పెంకులు కింద పడడంతో విద్యార్థులు గాయ పడిన సందర్భాలు ఉన్నాయి. ధ్యాన మందిరం వరండా అంతా పెంకులు ఊడిపోయి చెక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు కూర్చుండే గది వద్ద అ పైకప్పు పూర్తిగా దెబ్బతింది. ఉపాధ్యాయినిలు కూర్చుండే గది కూడా దయనీయంగా ఉంది.
* రాజంపేట బాలిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు 15 సెక్షన్లు ఉన్నాయి. గదులు మాత్రం 12 మాత్రమే అనడంతో ఒకటి రెండు తరగతులు చెట్ల కిందనే సాగుతున్నాయి. వర్షం పడితే పాఠశాల ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది ఈ పరిస్థితులను ఎన్నో మార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు అలా వచ్చి పరిశీలించి ఇలా వెళ్ళి పోవడం తప్ప పరిష్కార మార్గం చూపలేదు. ఇప్పటికైనా నేతలు స్పందించి పాఠశాలను బాగు చేయాలని విద్యార్థినిలు కోరుతున్నారు.


Body:దయనీయంగా బాలిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.