సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.... ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభత్వం ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ముద్రించిన గోడ పత్రాలను నేతలు ఆవిష్కరించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చెయ్యకుంటే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు.
ఇదీ చూడండి: